ఆయన శకుని... ఈయన శ్రీకృష్ణుడు...అయినా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్....

Publish Date:Mar 29, 2020

Advertisement

ఇది ఇద్దరు మిత్రుల కథ. . స్నేహానికి విలువిచ్చే రెండు ఉన్నత వ్యక్తిత్వాల ఆవిష్కరణ. ఎన్ఠీఆర్ లోని ఆత్మీయ కోణాన్ని, ఎన్ఠీఆర్ పట్ల  ధూళిపాళ కున్న భ్రాతృ ప్రేమను ఒకే సారి చూసిన ఆయన సన్నిహితుల మాటల్లో.. మీరే చదవండి.. ధూళిపాళ సీతారామ శాస్త్రి. పరిచయం అక్కర్లేని ఈ పేరు గురించి కానీ, ఈయన వ్యక్తిత్వం గురించి కానీ, ఈ రోజు మాత్రమే ప్రస్తావించటానికి ప్రధానమైన కారణం అయితే ఒకటి ఉంది. దివంగత ఎన్ టీ ఆర్ కు ఆత్మీయుడైన ధూళిపాళ తెలుగుదేశం ఆవిర్భావానికి పూర్వం చేసిన కృషి గురించి నందమూరి తారక రాముడి తో సన్నిహిత సంబంధం ఉన్న అతి కొద్దీ మందికి మాత్రమే తెలుసు. పార్టీ రాజ్యాంగం రాసే ముందు, ఎన్నో సందర్భాల్లో ఎన్ టీ ఆర్, ధూళిపాళ తో చాలా కీలకమైన అంశాల మీద చర్చించి, ఆయన సలహాలు తీసుకునే వారు. పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం అనే పధకానికి తుది రూపు తీసుకొచ్చింది ధూళిపాళే అనే విషయం తామిద్దరి మధ్యనే ఉండాలని ఆయన, ఎన్ టీ ఆర్ దగ్గర మాట తీసుకున్నారు. శిఖర సమాన వ్యక్తిత్వమున్న ధూళిపాళ అంటే అందుకే, ఎన్ టీ ఆర్ కు విపరీతమైన అభిమానం, అలాగే స్నేహానికి ప్రాణమిచ్చి, నటుడిగా తనకు నలుదిక్కులా పేరు ప్రఖ్యాతులు తీసుకురావటానికి ఎన్ టీ ఆర్ చూపిన విశేషమైన ప్రేమాభిమానాలను ధూళిపాళ తరచూ గుర్తుచేసుకునే వారు. 

వీరిద్దరి మధ్యన ఉన్న అనుబంధం ఎలాంటిదంటే, ఎన్ టీ ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, తొలిసారి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నప్పుడు, అయన అందరికన్నా ముందర వాకబు చేసింది...ధూళిపాళ గారు ఎక్కడ అని.. బిత్తరపోయిన ఎన్ టీ ఆర్ అభిమానులు ధూళిపాళ కోసం ఎయిర్ పోర్ట్ లో వెతుకుతుంటే, ఎన్ టీ ఆరె నేరుగా ఎయిర్పోర్టు విజిటర్స్ గ్యాలరీ లో కూర్చుని ఉన్న ధూళిపాళ వద్దకు వెళ్లి , ఆయనకు పాద నమస్కారం చేసి, హృదయానికి హత్తుకున్నారు. అదీ ఆ ఇద్దరి మిత్రుల కథ. ఎన్ఠీఆర్ పదవీ చ్యుతుడై, తెలుగుదేశం పార్టీ సంక్షోభం లోకి వెళ్లిన సమయం లో -ఆయనకు మోరల్ సపోర్ట్ గా నిలబడ్డారు ధూళిపాళ. ఆ సమయం లో ఎన్ఠీఆర్ కు, ఆయనకు మధ్య నడిచిన సంభాషణలను దగ్గర నుంచి పరిశీలించిన అత్యంత సన్నిహితులు, ధూళిపాళకు, ఎన్ఠీఆర్ కు ఉన్న బంధం ..ఏకోదరుల బంధంకన్నా ఎక్కువే అని చెప్పుకునే వారు. ఎన్ఠీఆర్ మరణం తో తాను ఏకాకినయ్యానని చెప్పుకున్న ధూళిపాళ తర్వాతి రోజుల్లో సన్యాసాశ్రమం తీసుకుని, పూర్తిగా హనుమంతుడి సేవకు అంకితమైపోయారు. 

ఇహ, ధూళిపాళ సీతారామ శాస్త్రి సినీ రంగ ప్రవేశం ముందు సంగతికి వస్తే, గుంటూరులో కొద్దికాలం ప్లీడర్‌ గుమాస్తాగా పనిచేశారు. 1935లో స్త్రీ పాత్ర ద్వారా నాటకరంగ ప్రవేశం చేశారు. 1941లో గుంటూరులో స్టార్‌ థియేటర్‌ను స్థాపించి నాటక ప్రదర్శనలు ఇస్తుండేవారు. ఆయన రంగస్థలం మీద పోషించిన ధుర్యోదన, కీచక పాత్రలకు మంచి ప్రశంసలు లభిస్తుండేవి. 1959లో మద్రాసు పచ్చయప్ప కాలేజీలో నాటక పోటీలలో రోషనార నాటకంలోని రామసింహుడు పాత్రను పోషించాడు. పోటీల న్యాయనిర్ణేతల్లో ఒకరైన జి.వరలక్ష్మి దృష్టిని ఆయన ఆకర్షించారు. సినిమాల్లో నటించమని ఆమె సూచించడమే గాకుండా దర్శకుడు బి.ఎ.సుబ్బారావుకు పరిచయం కూడా చేశారు. దాంతో బి.ఎ.సుబ్బారావు గారు భీష్మ (1962) చిత్రంలో ధూళిపాళకు ధుర్యోధనుడి పాత్రను ఇచ్చారు. ఆ సినిమాలో భీష్ముడిగా యన్‌.టి.రామారావు నటించారు. ధూళిపాళలోని నటనా ప్రతిభను మెచ్చుకున్న ఎన్‌.టి.రామారావు తర్వాత తన బ్యానర్‌లో నిర్మించిన శ్రీ కృష్ణ పాండవీయంలో శకుని పాత్రను ధూళిపాళకు ఇచ్చారు. ఆ పాత్ర ధూళిపాళ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత గయుడు, రావణుడు, మైరావణుడు వంటి ఎన్నో పౌరాణిక పాత్రలు ఆయన పోషించారు. సాంఘిక చిత్రాల్లో సైతం సాత్విక, దుష్ట పాత్రలు పోషించి అందరినీ మెప్పించారు. దానవీరశూరకర్ణ, కథానాయకుడు, ఆత్మ గౌరవం, ఉండమ్మా బొట్టుపెడతా వంటి ఎన్నో చిత్రాల్లో ఆయన నటించారు. చూడాలని ఉంది, శ్రీ ఆంజనేయం, మురారి వంటివి ఆయన ఆఖరి చిత్రాలు. దివికేగిన ఆ ఇద్దరి మిత్రుల మధుర స్మృతికి తెలుగు వన్ వినమ్రపూర్వక నివాళులు.

 

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.