సుబ్బన్న ఇక లేరు

Publish Date:Dec 7, 2013

Advertisement

 

వెండితెర మీద హాస్యశకం ముగిసింది.. దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను నవ్విస్తూ వస్తున్న ఓ అసామాన్య నటుడు తుది శాస్వవిడిచాడు.. హాస్యనటుడిగా, రచయితగా, దర్శకుడిగా, టెలివిజన్‌ వ్యాఖ్యాతగా, ఇలా  బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం శనివారం రాత్రి మృతి చెందారు. ఆయన గత ఏడాది కాలంగా ఊపిరి తిత్తుల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాదులో చైతన్యపురి వద్ద గల గీతా ఆసుపత్రిలో నిన్న రాత్రి పది గంటలకు ఆయన మృతి చెందారు. ఆయన స్వస్తలమయిన ప్రకాశం జిల్లాలో సింగరాయకొండలో రేపు అంత్యక్రియలు జరుగుతాయి. 

 

ఆ మహానటునికి నివాళి అర్పిస్తూ ఆయన జీవిత ప్రస్థానాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం...ధర్మవరపు సుబ్రహ్మణ్యం అనగానే ఈ తరం ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చే పాత్ర అమాయకపు కాలేజ్‌ లెక్చరర్‌.. ఎన్నో సినిమాల్లో లెక్చరర్‌గా నటించిన ఆయన తన నటనా పటిమతో ఆ పాత్రకే అందం తీసుకువచ్చారు.. ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయేలా చేశారు..1960 ఆగస్టు 9న ప్రకాశం జిల్లా లొని కొమ్మినేని వారిపాలెంలో జన్మించారు ధర్మవరపు.. చిన్ననాటి నుంచే నటన మీద ఉన్న మక్కువతో నాటకాలు వేసేవారు.. ముఖ్యంగా వామపక్షభావజాలానికి ఆకర్షిడైన ఆయన ప్రజానాట్యమండలితో కలిసి ఎన్నో సందేశాత్మక రచనలు చేశారు..

చదువుకునే వయసులోనే ఎక్కువగా నాటకాల వైపు మల్లడంతో విద్యాబ్యాసం కూడా దెబ్బతింది.. ఒక దిశలో ఇంటర్‌ కూడా ఫెయిల్‌ అయిన ధర్మవరం తల్లి కోరిక మేరకు పట్టుదలగా చదివి ఇంటర్‌ పూర్తి చేశాడు.. తరువాత బీకాం డిగ్రీ పూర్తి చేసిన ఆయన పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌లో ఉద్యోగిగా చేరారు..అయితే నాటకాల మీద ఆయనకు ఉన్న మక్కువ ఆయన్ను ఎక్కువ రోజులు ఉద్యోగిగా కొనసాగనివ్వలేదు.. దీంతో కొంత మంది దగ్గర మిత్రులతో కలిసిన నాటకాలు వేయటం ప్రారంభించారు. అలా నాటక రంగంలో బిజీ కావటంతో ఆయన ఉద్యోగానికి కూడా రాజీనామ చేయాల్సి వచ్చింది.నాటకరంగంలో బిజీగా ఉన్న ఆయన ఆకాశవాణి కొసం నాటకాలు రాయడం ప్రారంభించారు.. అప్పటి వరకు నటిడిగా ఆయనకు ఉన్న అనుభవానికి తన మార్క్‌ హాస్యం జోడించి అద్భుతమైన నాటికలు తయారు చేశారు..

తెలుగు టెలివిజన్‌ రంగానికి ధారావాహికలను పరిచయం చేసిన ఘనత కూడా ధర్మవరానిదే.. అప్పటి వరకు టెలీఫిలిం లు మాత్రమే తెలిసిన తెలుగు వారికి ఒకే సీరియల్‌ను భాగాలు టెలికాస్ట్‌ చేయోచ్చు అంటూ అనగనగా ఒక శోభ సీరియల్‌ ద్వారా పరిచయం చేశారు.. తరువాత  బుల్లితెర మీద ఆయన ఎన్నో విభిన్న పాత్రలతో అలరించారు, సీరియల్‌ దర్శకుడిగా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ముఖ్యంగా మనసు గుర్రం లేదు కళ్లెం, పరమానందయ్య శిష్యుల కథ లాంటి సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు..ముఖ్యంగా దూరదర్శన్‌లో ఆయన చేసిన ఆనందో బ్రహ్మ ఆయనకు నటునిగా దర్శకునిగా మంచి గుర్తింపు నిచ్చింది.. ఈ సీరియల్‌ ఘనవిజయం సాదించటంతో ఆయన టెలివిజన్‌ ప్రేక్షకులకే కాదు.. సినీరంగంలోనూ సుపరిచితులయ్యారు..

టెలివిజన్‌ రంగంలో మంచి పేరు తెచ్చుకోవటంతో సినీరంగం నుంచి కూడా ధర్మవరానికి అవకాశాలు వచ్చాయి.. ఎంతో మంది హస్యనటులకు నటులు జన్మనిచ్చాన జంధ్యాల ధర్మవరాన్ని జయమ్ము నిశ్చయమ్మురా సినిమాతో వెండితెరకు పరిచయం చేశారు.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ధర్మవరం తరువాత వరుస అవకాశాలతో మంచి హాస్యనటునిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. టెలివిజన్‌ రంగంలో దర్శకునిగా తనకు ఉన్న అనుభవంతో తోకలేని పిట్ట అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించారు ధర్మవరం.. అయితే ఆ సినిమా ఆశించిన విజయం సాదించకపోవటం తరువాత దర్శకత్వానికి దూరంగా ఉంటూ కేవలం నటునిగానే తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు..

తేజ దర్శకత్వంలో తెరకెక్కిన నువ్వునేను, జయం, ధైర్యం లాంటి సినిమాలతో ఈ తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు ధర్మవరం.. ముఖ్యంగా కాలేజీ లెక్చరర్‌తో పాటు తాగుబోతు పాత్రలలో ఆయన నటన కడుపుబ్బ నవ్విస్తుంది.. ఆయన చేసిన పాత్రలలో ఒక్కడు సినిమాలోని పాస్‌ పోర్ట్ ఆఫీసర్‌ క్యారెక్టర్‌తో పాటు, వర్షం సినిమాలోని వాతావరణ శాఖాదికారి పాత్రలు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి.. ముఖ్యంగా ఢిఫరెంట్‌ డిక్షన్‌తో ఆయన చెప్పే డైలాగ్‌లకు థియేటర్స్‌లో విజిల్స్‌ పడేవి..మరింత కాలం తన నటనతో మనల్ని అలరిస్తాడనుకున్న ధర్మవరం ఇలా అర్థాంతరంగా మన అందరిన మోసం చేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవటంతో సినీ రంగంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా దిగ్‌భ్రాంతి గురయ్యారు.. ఆయన మరణంతో తెలుగు తెర మీద ఓ హస్యశకం ముగిసింది.. కొన్ని పాత్రల ప్రయాణం ఆగిపోయింది.. ఎన్నో పాత్రలతో తెలుగు ప్రేక్షక లోకాన్ని అలరించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యానికి మరొక్కసారి నివాళి అర్పిద్దాం..

By
en-us Political News

  
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.