డిప్యూటీ సీఎంగా లోకేశ్‌.. లైన్ క్లియ‌రైందా?

Publish Date:Jan 19, 2025

Advertisement

తెలుగుదేశం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ డిప్యూటీ సీఎంగా ప్ర‌మోట్ కాబోతున్నారా? టీడీపీ శ్రేణుల నుంచి రోజురోజుకు తీవ్ర‌మ‌వుతున్న ఈ డిమాండ్ పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సానుకూలంగా స్పందించారా? కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క భాగ‌స్వామిగా కొన‌సాగుతున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం టీడీపీ కార్య‌క‌ర్త‌ల డిమాండ్ పై సానుకూలంగా ఉన్నారా? అంటే అవున‌నే స‌మాధానం ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.  తెలుగుదేశం పార్టీకి మూడో త‌రం వార‌సుడిగా.. రాబోయే కాలంలో పార్టీని న‌డిపించే నాయ‌కుడిగా లోకేశ్ ఇప్ప‌టికే పూర్తి స్థాయిలో త‌న స‌మ‌ర్ధ‌త‌ను చాటుకున్నారు. లోకేశ్ సార‌థ్యంలో టీడీపీకి బంగారు భ‌విష్య‌త్ ఉంటుంద‌ని ఆ పార్టీ క్యాడ‌ర్ బ‌లంగా న‌మ్ముతోంది. దీనికి కార‌ణం  లోకేశ్ రాజ‌కీయంగా ఎంతో ప‌రిణితిని క‌న‌బ‌ర్చ‌డ‌మే. ప్ర‌తి ప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌కు ఎదురెళ్లి లోకేశ్ స‌వాల్ చేశారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌తో ప్ర‌జ‌ల్లోకి వెళ్లి వైసీపీ అధిష్టానానికి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించారు. లోకేశ్ దూకుడు కార‌ణంగానే జ‌గ‌న్ అరాచ‌క పాల‌న‌కు భ‌య‌ప‌డి మూడేళ్లు బ‌య‌ట‌కురాని తెలుగుదేశం నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తోపాటు ప‌లు వ‌ర్గాల ప్ర‌జ‌లు సైతం ఒక్క‌సారిగా రోడ్లెక్కి అప్ప‌టి ప్ర‌భుత్వంపై పోరు బాట‌ ప‌ట్టారు. దీంతో జ‌గ‌న్ ప‌త‌నానికి బీజం ప‌డిన‌ట్ల‌యింది.

 కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత‌ కూడా ప్ర‌భుత్వంలో నారా లోకేశ్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌న ప‌రిధిలోఉన్న శాఖ‌ల్లో కీల‌క మార్పులు తీసుకువ‌స్తూ అభివృద్ధిని ప‌రుగులు పెట్టిస్తున్నారు. త‌న‌దైన మార్క్ ను చూపిస్తున్నారు. అన్నివిధాలా లోకేశ్ త‌న స‌మ‌ర్ధ‌త‌ను నిరూపించుకోవ‌టంతో తెలుగుదేశం శ్రేణులు డిప్యూటీ సీఎంగా లోకేశ్ ను ప్ర‌మోట్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఆ పార్టీలోని కీల‌క నేత‌లు బ‌హిరంగంగానే లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేశారు. తెలుగుదేశం అధికార ప్ర‌తినిధి మ‌హాసేన రాజేశ్, పార్టీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు శ్రీ‌నివాస్ రెడ్డితోపాటు డిప్యూటీ స్పీక‌ర్ గా ఉన్న ర‌ఘురామ కృష్ణరాజు, ఫిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మ,  సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలా ప‌లువురు నేత‌లు ఒక్కొక్క‌రుగా నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎంగా ప్ర‌మోట్ చేయాల‌ని కోరుతున్నారు. ఇటీవ‌ల మైదుకూరు స‌భ‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆశీనులైన స‌భావేదిక‌పైనే శ్రీ‌నివాస్ రెడ్డి లోకేశ్ ను డిప్యూటీ సీఎంను చేయాలంటూ చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేశారు. ఇది నా ఒక్క‌డి అభిప్రాయం కాదు, తెలుగుదేశం క్యాడ‌ర్ అభిప్రాయం అని చెప్పారు. అయితే, చంద్ర‌బాబు శ్రీ‌నివాస్ రెడ్డి విజ్ఞ‌ప్తిపై స్పందించ‌లేదు. కానీ, తెలుగుదేశం ముఖ్య‌నేత‌లతో మాట్లాడుతున్న సంద‌ర్భంలో స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు కూట‌మి నేత‌ల‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుందామ‌ని చంద్ర‌బాబు చెప్పిన‌ట్లు పార్టీ నేత‌ల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. 

గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో ఐదుగురు ఉప‌ముఖ్య‌మంత్రులు ఉండేవారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక్క‌రే డిప్యూటీ సీఎంగా కొన‌సాగుతున్నారు. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు.. అదో రాజకీయ పదవి అని చెప్పవచ్చు. ఎందుకంటే రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనే పదవి గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. అయితే, దాదాపు అన్ని రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వాల్లో డిప్యూటీ సీఎంలు ఒక‌రు, అంత‌కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఉప‌ముఖ్య‌మంత్రి అంటే రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన ప‌ద‌వికాక‌పోయిన ఆ స్థానంలో ఉన్న‌వారు ముఖ్య‌మంత్రి త‌రువాత ముఖ్య‌మంత్రిగా రాజ‌కీయ పార్టీలు, ప్ర‌జ‌లు భావిస్తారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్య‌క్తి త‌న శాఖ‌ల‌పై స‌మీక్ష‌లు చేస్తూనే.. ఇత‌ర శాఖ‌ల‌పై స‌మీక్ష‌లు చేసే అవ‌కాశం కూడా ఉంటుంది. మంత్రుల కంటే డిప్యూటీ సీఎంకు ప‌వ‌ర్స్ ఎక్కువ అనే చెప్పొచ్చు. దీంతో కూట‌మిలో అతిపెద్ద పార్టీ అయిన తెలుగుదేశం నుంచి  నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ గట్టిగా వస్తోంది.  మంత్రిగా ఉండ‌టం వ‌ల్ల కేవ‌లం కొంత‌మేర మాత్ర‌మే లోకేశ్ ప్ర‌భుత్వంలో భాగ‌స్వామ్యం కాగ‌లుగుతున్నారనీ, ఉప‌ముఖ్య‌మంత్రి హోదా ఉంటే పాల‌న‌పై పూర్తి స్థాయిలో ప‌ట్టు సాధించి, అభివృద్ధిని ప‌రుగులు పెట్టించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. అంతే కాకుండా లోకేష్ కు ప్రమోషన్ తెలుగుదేశం బలోపేతానికి సైతం దోహదపడుతుందని పార్టీ నేతలు సైతం చెబుతున్నారు. 

మంత్రి నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎంగా ప్ర‌మోట్ చేయాల‌ని తెలుగుదేశం నేత‌ల నుంచి వ్య‌క్త‌మ‌వుతున్న డిమాండ్ ప‌ట్ల జ‌న‌సేన పార్టీ నేత‌లు మౌనంగానే ఉన్నారు. అయితే తెలుగుదేశం శ్రేణుల డిమాండ్ ను అవ‌కాశంగా తీసుకొని కూట‌మిలో విబేధాలు త‌లెత్తేలా చేయాల‌ని వైసీపీ సోష‌ల్ మీడియా గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తున్నది. జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లమంటూ టీడీపీకి వ్య‌తిరేకంగా పోస్టులు పెడుతుండ‌టం విశేషం. అయితే, లోకేశ్ ను డిప్యూటీ సీఎంగా ప్ర‌మోట్ చేయాల‌న్న డిమాండ్ పై జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టివ‌ర‌కు ఎక్క‌డా స్పందించ‌లేదు. మ‌రో వైపు చంద్ర‌బాబు కూడా ఈ అంశంపై  స్పందించ‌లేదు. కానీ, లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాల‌న్న డిమాండ్ రోజురోజుకు ఎక్కువ‌వుతుండ‌టంతో చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నే అంశంపై టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెల‌కొంది.

By
en-us Political News

  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.