దేశ సమగ్రతే జనసేన ఆత్మ : డిప్యూటీ సీఎం పవన్

Publish Date:Jun 15, 2026

Advertisement

 

దేశ సమగ్రత, జాతీయ సమైక్యతే జనసేన పార్టీ మూల సిద్ధాంతమని జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులపై రాజీ లేకుండా పోరాడతామని, దేశ ప్రయోజనాలే పార్టీకి తొలి ప్రాధాన్యమని తెలిపారు.

ఢిల్లీలో నిర్వహించిన ‘జాతీయ సమైక్యత కోసం.. సేన ప్రస్థానం’ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధికారం లేదా పదవుల కోసం కాకుండా దేశ సమగ్రతను కాపాడాలనే లక్ష్యంతో ఏర్పాటైందన్నారు. “దేశమే ఫస్ట్.. మిగతావన్నీ నెక్స్ట్” అనేది జనసేన విధానమని స్పష్టం చేశారు.

దేశ రాజధాని ఢిల్లీ త్యాగాలకు, స్వాతంత్ర్య పోరాటాలకు, దేశభక్తికి ప్రతీక అని పేర్కొన్న ఆయన, ప్రతి భారతీయుడి కలలు ఢిల్లీతో ముడిపడి ఉన్నాయని అన్నారు. దేశాన్ని విభజించే భావజాలాలు, ప్రాంతీయ విద్వేషాలు, ప్రజల మధ్య విభేదాలు సృష్టించే శక్తులను జనసేన ఎప్పటికీ ఉపేక్షించదని హెచ్చరించారు.

జనసేన సిద్ధాంతాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయని, కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి కూడా పార్టీ భావజాలానికి ఆదరణ లభిస్తోందని తెలిపారు. భిన్న ప్రాంతాలను, భిన్న వర్గాలను దేశభక్తి అనే ఒకే తాటిపైకి తీసుకురావడమే జనసేన లక్ష్యమన్నారు.

తెలంగాణ ఏర్పాటును జనసేన ఎప్పుడూ వ్యతిరేకించలేదని, అయితే రాష్ట్ర విభజనను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన తీరును మాత్రమే ప్రశ్నించామని చెప్పారు. విభజన ప్రక్రియలో జరిగిన లోపాల వల్లే ఇప్పటికీ సమస్యలు కొనసాగుతున్నాయని అభిప్రాయపడ్డారు.

దేశానికి హాని చేసే శక్తులు ఎంత చిన్నవైనా వాటిని తేలికగా తీసుకోవద్దని పేర్కొన్న పవన్ కళ్యాణ్, దేశ సమగ్రతకు భంగం కలిగించే ప్రతి చర్యను జనసేన బలంగా అడ్డుకుంటుందని అన్నారు. దేశ విభజనవాదాన్ని ప్రోత్సహించే వారిపై పార్టీ గళం ఎప్పుడూ బలంగానే ఉంటుందన్నారు.

పార్లమెంట్‌లో జనసేనకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలకు ప్రత్యేక బాధ్యత ఉందని, కేవలం నియోజకవర్గ సమస్యలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ అంశాలపై కూడా గళం వినిపించాలని సూచించారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ దేశ ప్రయోజనాల కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.

జెన్-జీ తరానికి దేశభక్తి, రాజ్యాంగ విలువలు, బాధ్యతాయుత పౌరసత్వం గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నిజాయితీతో కూడిన రాజకీయాలు, నీతివంతమైన పాలన ఎలా ఉండాలో జనసేన చూపిస్తుందని, దేశానికి బలమైన పునాదులు వేయడమే పార్టీ లక్ష్యమని పవన్ కళ్యాణ్ అన్నారు.

By
en-us Political News

  
మెటా సంస్థ కేవలం ఒకరి ఫిర్యాదుతో ఓవర్ నైట్ ఏ అకౌంట్‌ను సస్పెండ్ చేయదని ఆయన చెప్పారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను పదే పదే ఉల్లంఘించడం వల్లే ఈ బ్లాక్ జరిగిందని వివరించారు. ముఖ్యంగా ఇటీవల ముగిసిన ఉపాధ్యాయ నియామక ప్రక్రియ డీఎస్సీ ద్వారా రికార్డు స్థాయిలో 15,941 మంది నిరుద్యోగులకు పారదర్శకంగా ఉద్యోగాలు లభించాయనీ.. అయితే వైసీపీ నేతలు తప్పుడు ఆధారాలు, ఫేక్ ఆడియో క్లిప్పింగులతో సమాజంలో అస్థిరత సృష్టించడానికి ప్రయత్నించారని అప్పసాని రాజేష్ ఆరోపించారు.
దేశవ్యాప్తంగా లోక్ సభ నియోజక వర్గాల సంఖ్యను ఏకంగా 50 శాతం మేర పెంచి, మొత్తం 815 స్థానాలకు చేర్చాలనేది ప్రాథమిక ప్రతిపాదన. అయితే.. దీనిపై కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహా మండలి ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక నివేదికను సిద్ధం చేసింది.
మెట్రో ఫేజ్ 1 టేకోవర్.. దానికి సంబంధించిన రీఫైనాన్సింగ్ నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మెట్రో మొదటి దశను నిర్వహించిన ఎల్ అండ్ టీ సంస్థ భారీ నష్టాల కారణంగా ఫేజ్ 2 విస్తరణకు ముందుకు రాకపోవడంతో.. కేంద్ర ప్రభుత్వ సలహా మేరకే రాష్ట్ర ప్రభుత్వం ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను తన అధీనంలోకి తీసుకుంది.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 90వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.
అసలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాని ఒక వ్యక్తి సుదీర్ఘ కాలం పాటు మంత్రి పదవిలో ఎలా కొనసాగుతారనే ప్రాథమిక రాజ్యాంగ ప్రశ్నను ఈ కేసు లేవనెత్తింది.
ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ (DSC) నియామకాల చుట్టూ ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ వివాదం కూటమి ప్రభుత్వానికి సరికొత్త సవాలుగా మారింది.
భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రాంతీయ పార్టీల పాత్ర అత్యంత కీలకమైనది
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపు తిరుగుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ మరింత ముదురుతోంది.
ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కేసిరెడ్డిని, అలాగే ఏపీబీసీఎల్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డిని ఈడీ అధికారులు మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరి అరెస్టుతో ఈ కుంభకోణం తాలూకు మూలాలు ఎక్కడికి దారితీస్తున్నాయి, అంతిమంగా దీని ప్రభావం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పడబోతోందా అనే విషయంపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో విశ్లేషించారు.
ఈ మొత్తం స్థలం విలువ బహిరంగ మార్కెట్లో వెయ్యి కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంటున్నారు. ఇందులో సింహభాగం అంతా ప్రభుత్వానికి చెందిన భూమి కావడం గమనార్హం. కాగా ఈ వ్యవహారంపై తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ అనలిస్ట్ భరద్వాజ మాట్లాడారు.
సహజంగా దేశ చరిత్రలో జవహర్‌లాల్ నెహ్రూ 17 సంవత్సరాల పాటు, ఇందిరా గాంధీ 16 సంవత్సరాల పాటు ప్రధానమంత్రులుగా సేవలందించారు. అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన రికార్డు ఎలా ? అన్న విషయాన్నితెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ ఎనలిస్టు వివరించారు.
గత సార్వత్రిక ఎన్నికల ముందే వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్రమై కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన సోదరుడు కేశినేని చిన్ని చేతిలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని ఓటమి పాలయ్యారు. ఎన్నికల ముగిసిన తర్వాత నాని వైసీపీకి దూరంగా జరుగుతూ మళ్లీ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ.. తమ్ముడు కేశినేని చిన్నితో వైరం మాత్రం పెరుగుతూనే ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.