ఏపీలో ప్రజాస్వామిక ఓట్ల సునామీ!

Publish Date:May 13, 2024

Advertisement

ఏపీలో పోలింగ్  సాగుతోంది . మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు జనం ఓ ఉత్సాహంతో, ఓ జోష్ తో పోలింగ్ బూత్ లకు బారులు తీస్తున్నారు.  వేల సంఖ్యలో ఓటర్లతో పోలింగ్ బూత్‌లు కిటకిటలాడుతున్నాయి. ఉత్సాహంగా ఓటు వేయడానికి అన్ని వర్గాల ప్రజలూ ఉత్సాహం చూపుతున్నారు.  గ్రామీణ ప్రాంతాలతోపాటు ఈ సారి పట్టణ ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతోంది. మాచర్ల, పుంగనూరు వంటి చోట్ల దాడులు జరిగినా పోలింగ్‌పై వాటి ప్రభావం ఇసుమంతైనా కనిపించడం లేదు.  

ఉదయం11 గంటలకే దాదాపు పాతిక శాతం పోలింగ్ నమోదైంది. ఓటింగ్ శాతం భారీగా పెరుగుతుండడం  కూటమి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతుంటే, అధికార వైసీపీలో నిరుత్సాహం పెరిగిపోతోంది.  ఊహించిన దానికంటే భారీగా ప్రజామద్దతు కూటమిపై ఉన్నట్లు పోలింగ్ సరళిని బట్టి అర్ధమౌతోందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ ప్రచారం జగనే కావాలి అంటూ జగన్ చేసుకున్న ప్రచారంపై నెటిజన్లు సెటైర్లు గుప్పిస్తున్నారు.  

వై ఏపీ నీడ్స్ జగన్ (ఏపీకి జగనే ఎందుకు కావాలి) పేరుతో వైసీపీ పెద్ద ఎత్తున చేసుకున్న ప్రచారాన్ని గుర్తు చేస్తూ  జగనే కావాలి అని జనంచెప్పాలి కానీ, వారి చేత బలవంతంగా చెప్పిస్తే ఫలితం ఇలాగే ఉంటుందని అంటున్నారు.  వైఏపీ నీడ్స్ జగన్ అంటూ జనంలోకి వెళ్లడానికి ధైర్యంలేని వైసీపీ నేతలు తమ పార్టీ కార్యకర్తల్లాంటి వలంటీర్లను, అధికారులను జనం ముందుకు పంపి వారి చేత జగనే కావలని బలవంతంగా చెప్పించారు. అలా  చెప్పకపోతే పథకాలు ఆగిపోతాయంటూ బెదిరింపుకు కూడా దిగారు.

ఇప్పుడు సరిగ్గా ఎన్నికల వేళ జగన్ తమకు ఎందుకు వద్దో చెప్పడానికి జనం పోలింగ్ బూతులకు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు.  ఓటింగ్ సరళిని గమనిస్తున్న పరిశీలకులు ప్రభుత్వ వ్యతిరేకత జనంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. వైసీపీ మూకలు రెచ్చిపోయి శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నా అవేమీ పోలింగ్ పై ప్రభావం చూపడం లేదనీ, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తమ ఓటు హక్కు వినియోగించుకు తీరుతామన్న పట్టుదలను ప్రదర్శిస్తున్నారు.

ఏపీలో పోలింగ్ సరళిని పరిశీలకులు ప్రజాస్వామిక ఓట్ల సునామీగా అభివర్ణిస్తున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా సామాన్యులు అధికారపార్టీ ఎమ్మెల్యేలను మంత్రులను నిలదీస్తున్న తీరును చూస్తే ప్రజలలో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రత అవగతమౌతోందంటున్నారు. సాక్షాత్తూ ఎమ్మెల్యే చెంపే ఛెళ్లుమనిపించిన ఉదంతమే ఇందుకు నిదర్శనమంటున్నారు. తెనాలిలో అధికార పార్టీ ఎమ్మెల్యే దాష్టీకాన్ని ఓ సామాన్య ఓటరు ఎదిరిస్తే, పిఠాపురంలో ఓ పోలింగ్ బూత్ లో వైసీపీ అభ్యర్థి వంగా గీతకు నిబంధనలు గుర్తు చేసి మరీ నిలదీశారు ఇంకో ఓటరు.   వైసీపీ మూకల దాడులు, దౌర్జన్యాలూ, దాష్టీకాలకు వెరవకుండా ఓటర్లు ఎదురుతిరుగుతున్న పరిస్థితి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నది.  

By
en-us Political News

  
Publish Date:Jan 7, 2026
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చ‌క్రం తిప్పారు. క‌విత ఎడ్యుకేటెడ్ కావ‌డం,  హిందీ కూడా బాగానే మాట్లాడ‌గ‌ల‌గ‌డంతో జాతీయ స్థాయి ప్ర‌తినిథిగా ఉండేవారు. అయితే క‌విత రెండో సారి ఎంపీగా గెల‌వ‌లేక పోయారు
ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.