ఏపీలో నడకే నేరమా? జగన్ హయాంలో ప్రజాస్వామ్యం బందీ!

Publish Date:Oct 26, 2022

Advertisement

ఊరంతా ఒకదారి అయితే ఉలిపికట్టెదొక దారి అన్నది సామెత.. అలాగే దేశమంతా ఒక దారి అయితే జగన్  అధికారంలో ఉన్న ఏపీది ఒక్కటీ ఒక దారి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. అమరావతి రైతుల మహాపాదయాత్రను నిలువరించడానికి జగన్ సర్కార్ చేయని ప్రయత్నం లేదు. అయితే దేశంలో ఇదే సమయంలో ఎన్నో పాదయాత్రలు జరుగుతున్నాయి.

జగన్ ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ బీహార్ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు. భారత్ జోడో యాత్ర పేరిట కాంగ్రస్ ప్రముఖ నేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ఇటీవలే ఏపీలో నిరాటంకంగా పూర్తి చేసుకుని తెలంగాణలో ప్రవేశించింది. ఇక జగన్ కు స్వయాన సోదరి.. వెసీపీ తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ) అధినేత్రి షర్మిల తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. వీరెవరికీ ఎలాంటి అభ్యంతరాలు, అడ్డంకులూ లేవు. కానీ ఏపీలో రైతుల పాదయాత్రకు మాత్రం అడుగడుగునా అడ్డంకులు. ప్రభుత్వం, పోలీసులు, అధికారులు, వైసీపీ నేతలు ఇలా ప్రభుత్వం చెప్పుచేతల్లో, కనుసన్నలలో మెలగడమే తమకు రక్ష  అని భావించే వారంతా పాదయాత్రను అడ్డుకోవడమే ఏకైక అజెండా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

రైతుల పాదయాత్రను అడ్డుకోవడం కోసం ప్రభుత్వం రాష్ట్రంలో రైతుల పాదయాత్ర ఒక్కటే సమస్య అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. ముఖ్యమంత్రికి స్వయానా బాబాయ్ అయిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను వేరే రాష్ట్రానికి మార్చేందుకు సుప్రీం కోర్టు అంగీకరించడం జగన్ సర్కార్ కు చెంపపెట్టు లాంటిదే అయినా.. దాని గురించిన పట్టింపే లేకుండా సర్కార్ వ్యవహరిస్తున్నారు. అమరావతి రైతులపైనే కాదు.. వారి పాదయాత్రకు మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలపైనా, ప్రజా సంఘాలపైనా కూడా ఆంక్షలు విధించడం ద్వారా రైతులే కాదు.. వారి మద్దతు దారులెవరూ రోడ్లపై నడవడానికి వీల్లేదన్న ఒక వింత, కొత్త నిబంధనలకు ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయినా విమర్శలు, కోర్టు మొట్టికాయలకు అలవాటు పడిపోయిన జగన్ సర్కార్ వాటిని వేటినీ ఖాతరు చేయడం లేదు. దేశంలో రైతుల పాదయాత్రకు తప్ప మరే పాదయాత్రలోనూ అందులో పాల్గొన్న వారి గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులూ అడగడం లేదు. కానీ రాష్ట్ర రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులు న్యాయం కోసం రోడ్డెక్కి యాత్ర చేస్తుంటే మాత్రం వారి గుర్తింపు చూపించిన తరువాతే అడుగు కదపాలంటూ నియంత్రిస్తున్నారు. నిజమే  కోర్టు ఆరువందల మంది రైతులు మాత్రమే పాదయాత్రలో పాల్గొనడానికి అనుమతి ఇచ్చింది. అయితే ఆ కోర్టు తీర్పు కాపీ ఇంకా అందనే లేదు.. కానీ పోలీసులు మాత్రం ఆధార్ కార్డులు, గుర్తింపు కార్డులు చేపించిన తరువాతే అడుగు ముందుకు వేయాలంటూ అమరావతి రైతులను నిలువరించారు.

అమరావతి రైతులకు మద్దతుగా వచ్చిన వారినీ ఆపేశారు. దీంతో రైతులు కోర్టులోనే తెల్చుకుంటామంటూ పాదయాత్రకు విరామం ప్రకటించారు. తాము తీసుకున్నది విరామమే కానీ.. యాత్రను ఆపేయలేదని వారు స్పష్టం చేశారు. అయితే బొత్స వంటి మంత్రులు.. ఇతర ఘనత వహించిన వైసీపీ నేతలూ మాత్రం రైతుల యాత్ర ఆగిపోయినట్లేననీ, మహాపాదయాత్ర పేరిట నడుస్తున్న వారెవరూ రైతులే కాదంటూ తమ వాచాలతకు పదును పెట్టారు.

వాస్తవానికి రైతుల మహాపాదయాత్రకు అధికార వైసీపీ వినా.. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలూ, ప్రజా సంఘాలూ, ప్రజలూ మద్దతు ఇస్తున్నారు. ఆఖరికి మూడు రాజధానులంటూ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని జగన్ సర్కార్ వ్యూహాత్మకంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులూ, విశాఖ గర్జనలూ కూడా ప్రజాదరణ ముందు విఫలమయ్యాయి. విశాఖ వాసులు కూడా అమరావతికే జై కొడుతున్నారనడానికి విశాఖ గర్జన్ తుస్సు మనడమే నిదర్శనమని పరిశీలకులు సైతం అభివర్ణిస్తున్నారు. స్వయంగా మంత్రి ధర్మానే పలు సందర్భాలలో విశాఖ వాసులే మూడురాజధానుల అంశానికి మద్దతు ఇవ్వడం  లేదంటూ చిర్రుబుర్రులాడారు.

కానీ జగన్ సర్కార్ మాత్రం రైతుల మహాపాదయాత్ర తన రాజకీయ అస్థిత్వానికే సవాల్ గా భావిస్తున్నది. విపక్ష నేతగా స్వయంగా జగన్ సైతం రాష్ట్రంలో పాదయాత్ర చేసిన సంగతి అందరికీ తెలిసిందే. నాడు ఆ పాదయాత్రను ఇలాగే అడ్డుకుని ఉంటే వైసీపీ నేడు అధికారంలో ఉండి ఉండేదా అని సామాన్యులు సైతం ప్రశ్రిస్తున్న పరిస్థితి నేడు ఏపీలో నెలకొని ఉంది. అయినా దమనకాండతో.. పోలీసులను ప్రయోగించి సర్వ హక్కులనూ కాలరాయడానికి జగన్ సర్కార్ వెనుకాడటం లేదు. 

By
en-us Political News

  
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.