కుక్కలకీ ఉంది డెమోక్రసీ!

Publish Date:Sep 7, 2017

Advertisement

 

మనిషి సంఘజీవి! నలుగురితో కలిసిమెలిసి బతకనిదే అతనేం సాధించలేడు. కానీ నలుగురూ కలిసి బతుకుతున్నప్పుడు... అందరి మాటకీ విలువ ఉండాలి, అందరికీ న్యాయం జరగాలి. అందుకే ప్రజాస్వామ్యం అనే విధానం అమల్లోకి వచ్చింది. ఎక్కువమంది ఏది అనుకుంటే, ఆ నిర్ణయానికి కట్టుబడటమే ప్రజాస్వామ్యం. ఇప్పటిదాకా మనుషులకి మాత్రమే పరిమితం అయిన ఈ పద్ధతి, జంతువులలో కూడా ఉందని నిరూపిస్తోంది ఓ పరిశోధన.

దక్షిణ ఆఫ్రికాలోని ఓ చిన్న దేశం బోత్స్వానా (Botswana). ఇక్కడి అడవుల్లో అరుదైన ఆఫ్రికన్‌ కుక్కలు నివసిస్తున్నాయి. అంతరించిపోతున్న ఈ జాతిని గమనించేందుకు సిడ్నీ నుంచి కొందరు పరిశోధకులు బోత్స్వానాకు చేరుకున్నారు. అక్కడి వాటి తీరుతెన్నులని గమనిస్తున్న సదరు పరిశోధకులకు ఓ ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది.

అడవి కుక్కలు వేటకి బయల్దేరేటప్పుడు మాంఛి హడావుడి చేస్తాయి. వాటిలో ఒక బలమైన కుక్క సారథ్యం వహించగా, అన్నీ కలిసి ఓ గుంపుగా వేటకి బయల్దేరతాయి. అంతవరకూ బాగానే ఉంది. కానీ కుక్కలు బయల్దేరే ముందు ఓ నాలుగు తుమ్ములు తుమ్మి బయల్దేరడమే విచిత్రం. కుక్కలు ఎక్కువగా తమ వాసన మీదే వేటని పసిగడతాయన్న విషయం తెలిసిందే! అందుకే తమ ముక్కులని సరిచేసుకునేందుకా అన్నట్లు అవి తుమ్ముతాయి. కానీ సరిగ్గా వేటకి బయల్దేరేముందు అన్నీ ఇలా పనిగట్టుకుని తుమ్మడం వెనుక ఏదన్నా కారణం ఉందేమో అని గమనించే ప్రయత్నం చేశారు పరిశోధకులు.

ఇందుకోసం బోత్స్వానాలో ఐదు వేర్వేరు ప్రాంతాలలో నివసించే అడవి కుక్కల గుంపుల తీరుని గమనించడం మొదలుపెట్టారు. ఒకటి కాదు రెండు కాదు... 68 సందర్భాలలో అవి వేటకి బయల్దేరుతున్నప్పుడు, వాటి శబ్దాలని రికార్డు చేశారు. ఎక్కువ తుమ్ములు వినిపించినప్పుడు అవి వేటకి బయల్దేరాయనీ, తుమ్ములు తక్కువగా వినిపించినప్పుడు అవి వేటని విరమించుకున్నాయనీ తేలింది. అంటే తుమ్ముల ద్వారా అవి తమ ఓటుని ప్రకటిస్తున్నాయి! వేటకి వెళ్లడం తమకి ఇష్టం ఉందా లేదా అన్న అభిప్రయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నమాట! పైగా గుంపుకి నాయకత్వం వహించే కుక్క లేకపోతే, మరిన్ని తుమ్ములు అవసరం కావడాన్ని గమనించారు.

ఈ పరిశోధన చాలా చిన్నదే! కానీ కలిసి జీవించేటప్పుడు ఎలా మెలగాలో... జంతువులకి కూడా ఓ అవగాహన ఉన్నట్లు బయటపడుతోంది. ఓ పక్క కుక్కలేమో ప్రజాస్వామ్యానికి అలవాటు పడుతున్నాయి. మరి మనుషులేమో ఉన్న ప్రజాస్వామ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. బలవంతుడిదే రాజ్యం అనే జంతుధర్మానికే ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తున్నారు. మరి ఇప్పుడు ఎవరు ఎవరి నుంచి నేర్చుకోవాలి?

- నిర్జర.

 

By
en-us Political News

  
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు...
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు.  ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు.  అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే...
ప్రేమ,  భార్యాభర్తల బంధం,  సహజీవనం.. ఏదైనా సరే.. మనసులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కీ పాయింట్ గా ఉంటుంది. నేటికాలంలో బంధాలు చాలా పెళుసుగా మారాయి.  చాలా తొందరగా బ్రేకప్ లు  జరుగుతున్నాయి...
పెళ్లి ప్రపంచంలో ప్రజలందరూ సాగించే ఒక పవిత్రమైన  బంధం. భారతీయులు పెళ్లికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.  సాధారణంగా వయసు రాగానే పెళ్లి వయసు వచ్చింది అని అంటుంటారు.  దానికి తగ్గట్టే పెళ్ళిళ్లు చేస్తుంటారు....
గొడవలు లేని భార్యాభర్తల బంధం అంటూ ఉండదు. వాస్తవానికి భార్యాభర్తల మధ్య  జరిగే గొడవలు చాలా వరకు వారి బంధాన్ని మరింత బలంగా మార్చడంలో సహాయపడతాయి.  భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు  ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమను స్పష్టం చేస్తాయి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.