ఇకపై లోక్ సభలో 850 స్థానాలు

Publish Date:Apr 14, 2026

Advertisement

 

దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లులకు రంగం సిద్దమైంది. ఈ నెల 16 రెండు బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. దానిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఎంపీలకు సమాచారం ఇచ్చి, బిల్లు ప్రతులను వారికి పంపింది. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన బిల్లు ప్రతిపాదనల ప్రకారం రాష్ట్రాల్లో 815 వరకు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 35 వరకు లోక్‌సభ స్థానాలు పెరగనున్నాయి. అంటే లోక్‌సభ స్థానాలు 543 నుంచి 850కి పెరుగుతాయని తెలుస్తోంది. 

లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి, చకచకా సీట్ల పెంపు కార్యక్రమం పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయాలని చూస్తోంది.సీట్ల పెంపుతో దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని సమాచారం. జనగణన తర్వాత అందలో వచ్చిన లెక్కల ఆధారంగా సీట్ల పెంపునకు అనుమతిస్తే ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య తేడా వచ్చే అవకాశముందని దక్షిణాది రాష్ట్రాలు ముందు నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దాంతో అన్ని రాష్ట్రాల్లో సగటున లోక్‌సభ, అసెంబ్లీ సీట్లు 50 శాతం పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని వల్ల అన్ని రాష్ట్రాలకూ ఇప్పుడున్న రాజకీయ ప్రాతినిధ్యం యథాతధంగా కొనసాగే అవకాశం ఉంటుందంటున్నారు.  

By
en-us Political News

  
ఈ సారి కడపలో సాంప్రదాయ పద్ధతుల్లో కాకుండా, పర్యావరణానికి ఎలాంటి హాని తలపెట్టని సరికొత్త గ్రీన్ టెక్నాలజీతో సిమెంట్‌ను తయారీకి శ్రీకారం చుట్టబోతున్నారు. సాధారణ సిమెంట్ తయారీ ప్రక్రియతో పోలిస్తే గ్రీన్ సిమెంట్ ఉత్పత్తి వల్ల కార్బన్ ఉద్గారాలు భారీగా తగ్గుతాయి.
దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు దర్పణం పడుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబై వెళ్లి పవన్ కళ్యాణ్‌ను కలిసి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కోకిలాబెన్ హాస్పిటల్‌కు విచ్చేసి ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించారు.
అప్పట్లో టీవీకే సహా పలు ఇతర రాజకీయ పార్టీలు ఆయన వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో కూడా అరుణ్ పరిపాలనాపరమైన వివక్ష చూపించారనే ఫిర్యాదులు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆయనను పక్కన పెట్టింది. అలాంటి వివాదాస్పద అధికారిని ఏకంగా అవినీతి నిరోధక శాఖాధిపతిగా అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టడంపై విజయ్ సర్కార్ పై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఒమన్ ప్రాంతీయ జలాల పరిధిలో మొంబాసా , అల్ బహియా అనే రెండు యూఏఈ చమురు నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిని యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాలను, నౌకాయాన నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడమేనని పేర్కొంది.
ఇరాన్‌కు చెందిన అగ్రశ్రేణి కమాండర్లందరూ హతమయ్యారనీ, ఇప్పుడు ఇరాన్ వద్ద చెప్పుకోదగ్గ నావికాదళం లేదు, వైమానిక దళం లేదు.. వారి వైమానిక రక్షణ నిఘా వ్యవస్థలు నేలమట్టమయ్యాయన్నారు. ఇప్పుడిక ఇరాన్ వద్ద ఏమీ లేదనీ, నిస్సహాయ స్థితిలో ఉందనీ ట్రంప్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఇరాన్, అమెరికా మధ్య జరిగిన దాడుల సమయంలో ఈ వ్యూహం పతాక స్థాయికి చేరింది. ఇరాన్‌లోని అహ్మదీనెజాద్ నివాసంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిగి ఆయన రక్షణ వాహనాలు ధ్వంసమైన వెంటనే.. ఒక ప్యుజో కారు అక్కడికి చేరుకుని ఆయనను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లింది. ఆ కారును నడిపింది మొసాద్ ఏజెంట్లని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది.
హైదరాబాద్‌లో మారుతి సుజుకి ఫ్లాగ్‌షిప్ లగ్జరీ ఎంపీవీ ఇన్విక్టో ఆన్‌రోడ్ ధరలు, వేరియంట్లు, 23.24 కిమీ మైలేజ్ విశేషాలు మరియు ఈఎంఐ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
భారతదేశంలో ఫైవ్ స్టార్ మరియు లగ్జరీ హోటల్ రూమ్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే ఇవి ఇంకా తక్కువని, భవిష్యత్తులో ఒబెరాయ్, ఐటీసీ వంటి టాప్ హోటళ్ల రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వేదాంత గ్రూప్ మెగా డీమెర్జర్ తర్వాత విడిపోయిన అల్యూమినియం, ఐరన్ & స్టీల్, పవర్ మరియు ఆయిల్ కంపెనీల షేర్లు 5 శాతం వరకు దూసుకెళ్లాయి. క్యూ1 ఉత్పత్తి గణాంకాలు, భారీ టార్గెట్ ధరలతో బ్రోకరేజ్ సంస్థల రేటింగ్స్ ఇన్వెస్టర్లలో జోష్ నింపాయి. ఈ స్టాక్స్ కొనుగోలుపై పూర్తి వివరాలు మీకోసం.
అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (FIFA) ప్రపంచకప్‌లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. జట్ల సంఖ్యను 48కి పెంచడం ద్వారా భారత ఫుట్‌బాల్ జట్టుకు వరల్డ్‌కప్ అర్హత సాధించే సువర్ణావకాశం లభించనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించే చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
హత్య కేసులో నిర్లక్ష్యం వహించిన 23 మంది పోలీస్ సిబ్బంది స్థానచలనం..
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన షాబాద్ వరుస హత్యల కేసులో ప్రధాన నిందితుడు పార్వతి రాజ్‌కుమార్ (29) అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.