న్యాయం కోసం గొంతెత్తితే.. లాఠీలకు పని చెబుతారా.. కేంద్రంపై నెటిజనుల ఆగ్రహం

Publish Date:Jul 20, 2026

Advertisement

 నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని సోమవారం (జులై 20) శాంతియుతంగా నిర్వహిస్తున్న  యువతపై పోలీసులు  ఉక్కుపాదం మోపడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ పోలీసుల దాడిలో పలువురు విద్యార్థులు, నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారు. అయినా.. కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాన్ని కూడా  లెక్కచేయకుండా విద్యార్థులు రోడ్లపైనే బైఠాయించి తమ హక్కుల కోసం నినదించారు. 

ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఉద్రిక్త పరిణామాలు, పోలీసుల లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగంపై నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుననారు.   అంతర్జాతీయ వేదికలపై ప్రతి క్లిష్టమైన సమస్యనూ శాంతియుత సంప్రదింపులు, చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని  ఉద్బోధించే ప్రధాని నరేంద్ర మోదీ.. సొంత దేశంలో భవిష్యత్తు భారతాన్ని నిర్మించే విద్యార్థుల ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేయడం ఎంటని నిలదీస్తున్నారు.   తమ భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితిని తొలగించాలనీ, నీట్ లీకేజీపై జవాబుదారీ తనం ఉండాలనీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తున్న   విద్యార్థులను చర్చలకు పిలిచి మాట్లాడాల్సింది పోయి.. వారి గొంతు నొక్కాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలకే విరుద్ధమని నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

  నీట్ ప్రశ్రపత్రాల లీకేజీ కి వ్యతిరేకంగా ఆరంభమైన ఆందోళన  దేశవ్యాప్త విద్యార్థి ఉద్యమంగా మారింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.   విద్యారంగ సంస్కరణల కోసం జూన్ 28 నుంచి వరుసగా 21 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసిన  సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను జంతర్ మంతర్ వద్ద నిరసన స్థలి నుంచి పోలీసులు బలవంతంగా సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించడం, మరోవైపు హైదరాబాద్‌లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసాన్ని ఎన్ఎస్‌యుఐ, ఎస్‌ఎఫ్ఐ, ఐవైఎఫ్, పిడిఎస్‌యు వంటి అనేక విద్యార్థి సంఘాలు ముట్టడించడం వంటి పరిణామాలు కేంద్ర ప్రభుత్వంపై విద్యార్థుల ఆగ్రహాన్ని ఇనుమడింప చేస్తున్నాయి.  

Delhi NEET protest crackdown, Dharmendra Pradhan resignation, Modi government,  NEET criticism, Sonam Wangchuk, online anger

By
en-us Political News

  
అలాగే బహ్రెయిన్‌లోని దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రధాన డేటా సెంటర్‌ను కూడా ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ దేశ పౌర వసతులపై అమెరికా దళాలు జరిపిన దాడులకు తగిన రీతిలో జవాబు చెప్పడానికే ఈ సాంకేతిక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఈ ఆరోపణలు, క్షిపణి దాడి ఘటనను అమెజాన్ కానీ, బహ్రెయిన్ ప్రభుత్వం కానీ ధ్రువీకరించలేదు.
బాబాయ్ త్వరగా కోలుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు క్షణాల్లో వైరల్ అయ్యింది. బాబాయ్ పట్ల ఎన్టీఆర్ చూపించిన ఈ ప్రేమాభిమానాల పట్ల నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో ఒప్పందం ఇవాళ సాకారమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో గత కొన్ని నెలలుగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారం
తన ఆరోగ్యం, ఆసుపత్రి అనుభవాల గురించి తాజాగా నెట్టింట షేర్ చేసిన పోస్టు ఆయన అభిమానులను, సినీ వర్గాలనూ కలవరానికి గురి చేసింది. ఆసుపత్రి వాతావరణం, శస్త్రచికిత్స, అనంతరం ఐసీయూలో వైద్యుల నిరంతర పర్యవేక్షణ వంటి కష్టతరమైన దశలను ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జరుగుతున్న శ్రీ జగదాంబికా అమ్మవారి బోనాల మహోత్సవాల సందర్భంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు విస్తృత స్థాయిలో ట్రాఫిక్ బందోబస్తు చేపట్టారు.
ప్రధాని ఇంటి ఎదుట బైఠాయించిన రాహుల్, ఖర్గే..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జాతీయ రాజకీయం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛలో సంసద్ పార్లమెంట్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఉత్తరాంధ్ర ప్రాంత ప్రగతికి ఊపిరి పోసేందుకు తమ జీవనాధారమైన భూములను ప్రభుత్వం సేకరించడానికి సహకరించిన రైతులకు కృతజ్ఞతగా, గౌరవంగా భోగాపురం విమానాశ్రయం నుంచి ఉచితంగా ఒకసారి విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించారు. ఈ మేరకు ఆయన అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
కాకినాడలో జరుగుతున్న NBK111 సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శిం చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొగాకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పొగాకు (HSN 2401)పై ప్రస్తుతం అమలులో ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలని
ట్రైనీ ఐపీఎస్‌కి న్యాయం జరగాలి..విచారణ పూర్తికాకముందే దోషిగా ప్రకటించడం సరికాదు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.