Publish Date:Jan 15, 2025
ఢిల్లీలో అధికారం కోసం బీజేపీ గత మూడు పర్యాయాలుగా చెమటోడుస్తూనే ఉంది. అయినా హస్తిన ప్రజ కమలనాథులకు ఆ అవకాశం ఇవ్వలేదు. అయితే వచ్చే నెలలో ఢిల్లీ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో కష్టం లేకుండానే హస్తినపై కమలనాథుల జెండా ఎగిరే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అయితే ఇందుకు బీజేపీ ప్రయోజకత్వం కానీ, ఆ పార్టీపై ప్రజలలో నమ్మకం పెరగడం కానీ కారణం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరి ఏమిటి కారణం? అన్న ప్రశ్నకు కాంగ్రెస్, ఆప్ మధ్య విభేదాలే కారణమన్న సమాధానం వస్తోంది. అసలు దేశంలో వరుసగా మూడు పర్యాయాలు బీజేపీ అధికార పగ్గాలను అందుకోవడానికి కారణం బీజేపీయేతర పార్టీల అనైక్యతేనన్నది నిర్వివాదాంశం. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలోనూ అదే జరగనుందని అంటున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం కూడా జోరందుకుంది. పోటీ ప్రధానంగా అధికార ఆప్, విపక్ష బీజేపీల మధ్యే అన్నట్లుగా పరిస్థితి ఉంది. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక, ప్రచారం దగ్గర నుంచీ అన్నిటా వెనుకబడే ఉంది. బీజేపీ, ఆప్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో ఢిల్లీ మార్మోగిపోతున్నది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ, కాంగ్రెస్ జుగల్ బందీ నాటకం బయటపెడతానని చేసిన వ్యాఖ్యలతో బీజేపీ నెత్తిన పాలు పోసినట్లైంది. కాగా కేజ్రీవాల్ వ్యాఖ్యలై కాంగ్రెస్ మండి పడింది. రాహుల్ గాంధీ కూడా కేజ్రీవాల్ పై విమర్శలు గుప్పించారు.
ఇక్కడ చెప్పుకోవాల్సిందేమిటంటే.. కాంగ్రెస్, ఆప్ లు పరస్పర విమర్శలపై పెట్టిన దృష్టి కమలంపై పెట్టడం లేదు. ఈ రెండు పార్టీలూ కమలం పార్టీని వదిలేసి పరస్పర నిందలతో సరిపెడుతున్నాయి. దీంతో ఢిల్లీ ఎన్నికలలో బీజేపీ పని నల్లేరుమీద బండి నడకలా మారిందని విశ్లేషకులు అంటున్నారు. ఆప్, కాంగ్రెస్ పార్టీలు రెండూ కూడా వెండిపల్లెంలో పెట్టి బీజేపీకి ఢిల్లీని అప్పగించడంలో పోటీ పడుతున్నాయన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/delhi-assembly-elections-bjp-safe-game-39-191281.html
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.