Publish Date:Oct 16, 2025
ప్రముఖ విదేశాంగ విధాన నిపుణుడు, భారత సంతతికి చెందిన రక్షణ వ్యూహకర్త ఆష్లే టెల్లీస్ అమెరికాలో అరెస్ట్ అయ్యారు. యూఎస్కు చెందిన రక్షణ రహస్యాలను కలిగిఉండటంతో పాటు చైనా అధికారులతో రహస్య సమావేశాలు జరిపినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా అధికారులు ఆయన్ను అరెస్టు చేసినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
విదేశాంగ విధాన నిపుణుడు, రక్షణ రంగ వ్యూహాకర్త, భారతీయ మూలాలున్న ఆష్లే టెల్లీస్ ను ప్రస్తుతం ఫెడరల్ అధికారులు ప్రశ్నిస్తున్నారని వర్జినియాలోని అమెరికా అటార్నీ కార్యాలయం వెల్లడించింది. ఇక ఆయన నివాసంలో సైతం సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో రహస్య పత్రాలను గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆష్లే టెల్లీస్ వద్ద రక్షణ రంగానికి చెందిన అత్యంత కీలకమైన సమాచారం ఉంచుకోవడం ద్వారా నిబంధనలు అతిక్రమించారని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు.
అమెరికా న్యాయవాది లిండ్సే హాలిగన్ ఆష్లేపై ఉన్న అభియోగాలను ప్రకటించారు. వాటి ప్రకారం.. 64 ఏళ్ల ఆష్లే డిపార్ట్మెంట్ ఆఫ్ వార్లో కాంట్రాక్టర్గా పని చేశారు. 2001 నుంచి ఇందులో పనిచేస్తున్న ఆయన దేశ రక్షణకు సంబంధించిన సమాచారాన్ని చట్టవిరుద్ధంగా పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఇళ్లల్లో అధికారులు సోదాలు చేయగా.. ‘సీక్రెట్’, ‘టాప్ సీక్రెట్’ అని ఉన్న వెయ్యికి పైగా పత్రాలు లభ్యమయ్యాయి.
ఇటీవల ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న తన సహ ఉద్యోగిని రహస్య పత్రాలకు సంబంధించి ప్రింట్లు తనకివ్వమని ఆష్లే అడిగినట్లు ఫెడరల్ అధికారులు ఆరోపించారు. ఈ క్రమంలో యూఎస్ ఎయిర్ఫోర్స్లోని సైనిక సామర్థ్యాలకు సంబంధించిన పత్రాలను ప్రింట్ చేసినట్లు తెలిపారు. మరోవైపు.. గత కొన్ని సంవత్సరాలుగా ఆష్లే చైనా ప్రతినిధులతో రహస్య సమావేశాలు జరిపాడని పేర్కొన్నారు. అలా 2022లోనూ 2023 ఏప్రిల్ 11న బీజింగ్ అధికారులతో జరిగిన విందులోను ఆష్లే పాల్గొన్నట్లు పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల కూడా ఇలాంటి భేటీయే జరగ్గా... చైనా అధికారుల నుంచి ఆష్లేకు గిఫ్ట్గా బ్యాగు లభించిందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్నదని ఫెడరల్ అధికారులు తెలిపారు. వీటిల్లో ఆయన దోషి అని తేలితే.. 10 ఏళ్ల వరకూ జైలు 2,50,000 డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/defense-strategist-ashley-tellis-arrested-iamerica-36-208045.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.