సీఎం జగన్ లో ఓటమి వణుకు?.. అందుకే హిందూపురం టు ఇచ్ఛాపురం టూర్!

Publish Date:Aug 30, 2022

Advertisement

మూడున్నరేళ్లకు ముందు ‘ఒక్క చాన్స్’ అంటూ జనం ముందు చేతులు జోడించి ప్రాధేయపడ్డారు. తీరా ఆయన మాటలు నమ్మి ఓట్లు వేసి అఖండ మెజారిటీ అధికారం అప్పగించిన అదే జనానికి ముఖం చాటేశారు. అడపా దడపా అదే జనం మధ్యకు రావాల్సిన అగత్యం ఏర్పడినప్పుడు వారికి ఏమాత్రం అందుబాటు లేకుండా బారికేడ్లు, ఇనుప కంచెలు, పరదాలు వేసుకుని లేదా.. గాల్లోనే చక్కర్లు కొట్టేసి తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లిపోయారు. ఇప్పుడు మూడున్నరేళ్ల పాలన తర్వాత జనంలో ప్రభుత్వ వ్యతిరేకత అంటే జగన్ పై వ్యతిరేకత సునామీలా ముంచేస్తుంటే   మరోసారి అదే జనం వద్దకు వచ్చేందుకు జగన్ సిద్ధం అవుతున్నారని వైసీపీ శ్రేణుల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది.   

ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరిని ఎన్నకుంటారంటూ నిర్వహిస్తున్న జనాభిప్రాయం సేకరణలో చంద్రబాబుకు 78.17 శాతం మంది ఓటు వేశారు.  వైఎస్ జగన్ కు అనుకూలంగా కేవలం 18.27 శాతం మందే ఓకే చెప్పారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటూ 3.56 శాతం మంది కోరారు. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవల నిర్వహించిన  సర్వేలో కూడా ఇంచుమించు ఇలాంటి ఏకపక్ష ఫలితమే కనిపించడం విశేషం.

రఘురామ సర్వేలో 93 స్థానాల్లో టీడీపీ కచ్చితంగా గెలుస్తున్నట్లు తేలడం విశేషం. పోటా పోటీ నెలకొన్న నియోజకవర్గాల్లో కూడా 50 శాతం టీడీపీకే అనుకూల ఫలితాలు ఉన్నాయన్నది ఆయన సర్వే సారాంశం. ఏ సర్వే చూసినా   చంద్రబాబే విజయయాత్ర చేస్తారని తేలుతోంది. అంతెందుకు జగన్ స్వయంగా నిర్వహించుకున్న సర్వేలలో కూడా ఇంచుమించు ఇదే ఫలితం రావడంతో ఆయన నియోజకవర్గాలలో అభ్యర్థులను మారుస్తానంటూ ఒక జాబితా కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆయన విడుదల చేసిన జాబితాలో పేర్కొన్న నియోజకవర్గాలన్నిటిలోనూ వైసీపీ ఓటమి ఖాయమని ఆయన స్వయంగా చేయించుకున్న సర్వేలో తేలిందని పరిశీలకులు అంటున్నారు. 
దీంతో జగన్ లో ఓటమి వణుకు మొదలైందంటున్నారు. ఈ క్రమంలో జగన్ హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకు యాత్ర చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అది కూడా ఏపీలో వైసీపీ పట్ల వ్యతిరేకత బాగా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగించేందుకు రూట్ మ్యాప్ సిద్ధమైందంటున్నారు. గతంలో జనం మధ్యలో ఉన్న తనను ఓటర్లు మెచ్చి ఓట్లు వేశారని, అందుకే 151 స్థానాలు ఇచ్చి తనకు తిరుగులేని మెజారిటీ అందించారని జగన్ గొప్పగా చెబుతుంటారు. అనేక వ్యతిరేకతలు, వైఫల్యాల కారణంగా ఈసారి వైసీపీకి గతంలో వచ్చినంత మెజారిటీ రాకపోయినా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అవసరమైన సీట్లు వస్తాయని ఆయన నమ్ముతున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఈ నేపథ్యంలో మెజారిటీకి కావాల్సిన సీట్లు సాధించాలనే వ్యూహంతో జగన్ మరోసారి జనం మధ్యకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు.

ఒక పక్కన రోజు రోజుకూ తగ్గిపోతున్న వైసీపీ హవా.. మరో పక్కన ఏ క్షణంలో అయినా   జగన్ కు ఇచ్చిన బెయిల్ రద్దు చేసే సూచనలు ఉన్నాయంటున్నారు. గత ఎన్నికలకు ముందు అరెస్ట్ వారెంట్ ఉన్నప్పుడు జగన్ జనం మధ్యనే ఉన్న విషయం తెలిసిందే. తన బెయిల్ గనుక రద్దయితే ఇప్పుడు కూడా జనం మధ్యే ఉండి మరోసారి తనకు ఇబ్బందులు తెలెత్తకుండా తప్పించుకునేందుకే రాష్ట్ర యాత్రకు ఉపక్రమిస్తున్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి.

ఎన్నికల ప్రణాళికలో భాగంగా నియోజవర్గాల వారీగా పార్టీల బలాబలాలను బేరీజు వేసుకుంటున్న జగన్ కు గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన నియోజకవర్గాల్లో ఏమాత్రం పట్టు దొరకడం లేదట. 23 చోట్ల టీడీపీ గెలిచిన  సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆయా నియోజకవర్గాలలో  వైసీపీకి ఇప్పటికీ కాలు మోపే సందు దొరకని పరిస్థితులు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.

టీడీపీకి తిరుగులేని ఈ నియోజకవర్గాల్లో ఎలాగైనా తన ఉనికి చాటుకోవాలని జగన్ యత్నిస్తున్నారంటున్నారు. ఈ క్రమంలోనే ఆయా నియోజకవర్గాల్లో బలంగా ఉన్న టీడీపీ నేతలను వైసీపీలోకి ఆపరేషన్ ఆకర్ష్ కూడా ప్రయోగించారు. అయినప్పటికీ   జగన్ ఆటలు సాగలేదంటున్నారు. అందుకే మూడున్నరేళ్లుగా జనానికి ముఖం చాటేసిన జగన్ మళ్లీ జనం మధ్యకు రావాలని నిర్ణయించారని అంటున్నారు.

ముక్తాయింపు ఏమింటంటే.. సీపీఎస్ విషయంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడిస్తామని ప్రకటించడంతో జగన్ లో ఆందోళన మొదలైందంటున్నారు. అందుకే.. ఉద్యోగులను ఎక్కడికక్కడ నిర్బంధించడమే కాకుండా, అరెస్టులు చేయించారు. అంతటితో ఆగకుండా తాను నివాసం ఉంటున్న  తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ నాలుగు అడుగుల ఎత్తు ఐరెన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడం. కేవలం రెండు లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల అల్టిమేటానికే ఇంతలా భయపడుతున్న జగన్ రేపు ఐదున్నర కోట్ల మంది జనానికి ఏం సమాధానం చెప్పుకుంటారు? ఏం చేశానని చెప్పుకుంటారు? మళ్లీ తనకు ఓటు వేసి గెలిపించాలనే ఎలా అభ్యర్థిస్తారన్నది చూడాల్సిందేనని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.

By
en-us Political News

  
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, సనీనటి విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవ కాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..!
నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి. 
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో అధికార పార్టీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.