సీఎం జగన్ లో ఓటమి వణుకు?.. అందుకే హిందూపురం టు ఇచ్ఛాపురం టూర్!

Publish Date:Aug 30, 2022

Advertisement

మూడున్నరేళ్లకు ముందు ‘ఒక్క చాన్స్’ అంటూ జనం ముందు చేతులు జోడించి ప్రాధేయపడ్డారు. తీరా ఆయన మాటలు నమ్మి ఓట్లు వేసి అఖండ మెజారిటీ అధికారం అప్పగించిన అదే జనానికి ముఖం చాటేశారు. అడపా దడపా అదే జనం మధ్యకు రావాల్సిన అగత్యం ఏర్పడినప్పుడు వారికి ఏమాత్రం అందుబాటు లేకుండా బారికేడ్లు, ఇనుప కంచెలు, పరదాలు వేసుకుని లేదా.. గాల్లోనే చక్కర్లు కొట్టేసి తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లిపోయారు. ఇప్పుడు మూడున్నరేళ్ల పాలన తర్వాత జనంలో ప్రభుత్వ వ్యతిరేకత అంటే జగన్ పై వ్యతిరేకత సునామీలా ముంచేస్తుంటే   మరోసారి అదే జనం వద్దకు వచ్చేందుకు జగన్ సిద్ధం అవుతున్నారని వైసీపీ శ్రేణుల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది.   

ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరిని ఎన్నకుంటారంటూ నిర్వహిస్తున్న జనాభిప్రాయం సేకరణలో చంద్రబాబుకు 78.17 శాతం మంది ఓటు వేశారు.  వైఎస్ జగన్ కు అనుకూలంగా కేవలం 18.27 శాతం మందే ఓకే చెప్పారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటూ 3.56 శాతం మంది కోరారు. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవల నిర్వహించిన  సర్వేలో కూడా ఇంచుమించు ఇలాంటి ఏకపక్ష ఫలితమే కనిపించడం విశేషం.

రఘురామ సర్వేలో 93 స్థానాల్లో టీడీపీ కచ్చితంగా గెలుస్తున్నట్లు తేలడం విశేషం. పోటా పోటీ నెలకొన్న నియోజకవర్గాల్లో కూడా 50 శాతం టీడీపీకే అనుకూల ఫలితాలు ఉన్నాయన్నది ఆయన సర్వే సారాంశం. ఏ సర్వే చూసినా   చంద్రబాబే విజయయాత్ర చేస్తారని తేలుతోంది. అంతెందుకు జగన్ స్వయంగా నిర్వహించుకున్న సర్వేలలో కూడా ఇంచుమించు ఇదే ఫలితం రావడంతో ఆయన నియోజకవర్గాలలో అభ్యర్థులను మారుస్తానంటూ ఒక జాబితా కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆయన విడుదల చేసిన జాబితాలో పేర్కొన్న నియోజకవర్గాలన్నిటిలోనూ వైసీపీ ఓటమి ఖాయమని ఆయన స్వయంగా చేయించుకున్న సర్వేలో తేలిందని పరిశీలకులు అంటున్నారు. 
దీంతో జగన్ లో ఓటమి వణుకు మొదలైందంటున్నారు. ఈ క్రమంలో జగన్ హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకు యాత్ర చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అది కూడా ఏపీలో వైసీపీ పట్ల వ్యతిరేకత బాగా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగించేందుకు రూట్ మ్యాప్ సిద్ధమైందంటున్నారు. గతంలో జనం మధ్యలో ఉన్న తనను ఓటర్లు మెచ్చి ఓట్లు వేశారని, అందుకే 151 స్థానాలు ఇచ్చి తనకు తిరుగులేని మెజారిటీ అందించారని జగన్ గొప్పగా చెబుతుంటారు. అనేక వ్యతిరేకతలు, వైఫల్యాల కారణంగా ఈసారి వైసీపీకి గతంలో వచ్చినంత మెజారిటీ రాకపోయినా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అవసరమైన సీట్లు వస్తాయని ఆయన నమ్ముతున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఈ నేపథ్యంలో మెజారిటీకి కావాల్సిన సీట్లు సాధించాలనే వ్యూహంతో జగన్ మరోసారి జనం మధ్యకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు.

ఒక పక్కన రోజు రోజుకూ తగ్గిపోతున్న వైసీపీ హవా.. మరో పక్కన ఏ క్షణంలో అయినా   జగన్ కు ఇచ్చిన బెయిల్ రద్దు చేసే సూచనలు ఉన్నాయంటున్నారు. గత ఎన్నికలకు ముందు అరెస్ట్ వారెంట్ ఉన్నప్పుడు జగన్ జనం మధ్యనే ఉన్న విషయం తెలిసిందే. తన బెయిల్ గనుక రద్దయితే ఇప్పుడు కూడా జనం మధ్యే ఉండి మరోసారి తనకు ఇబ్బందులు తెలెత్తకుండా తప్పించుకునేందుకే రాష్ట్ర యాత్రకు ఉపక్రమిస్తున్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి.

ఎన్నికల ప్రణాళికలో భాగంగా నియోజవర్గాల వారీగా పార్టీల బలాబలాలను బేరీజు వేసుకుంటున్న జగన్ కు గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన నియోజకవర్గాల్లో ఏమాత్రం పట్టు దొరకడం లేదట. 23 చోట్ల టీడీపీ గెలిచిన  సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆయా నియోజకవర్గాలలో  వైసీపీకి ఇప్పటికీ కాలు మోపే సందు దొరకని పరిస్థితులు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.

టీడీపీకి తిరుగులేని ఈ నియోజకవర్గాల్లో ఎలాగైనా తన ఉనికి చాటుకోవాలని జగన్ యత్నిస్తున్నారంటున్నారు. ఈ క్రమంలోనే ఆయా నియోజకవర్గాల్లో బలంగా ఉన్న టీడీపీ నేతలను వైసీపీలోకి ఆపరేషన్ ఆకర్ష్ కూడా ప్రయోగించారు. అయినప్పటికీ   జగన్ ఆటలు సాగలేదంటున్నారు. అందుకే మూడున్నరేళ్లుగా జనానికి ముఖం చాటేసిన జగన్ మళ్లీ జనం మధ్యకు రావాలని నిర్ణయించారని అంటున్నారు.

ముక్తాయింపు ఏమింటంటే.. సీపీఎస్ విషయంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడిస్తామని ప్రకటించడంతో జగన్ లో ఆందోళన మొదలైందంటున్నారు. అందుకే.. ఉద్యోగులను ఎక్కడికక్కడ నిర్బంధించడమే కాకుండా, అరెస్టులు చేయించారు. అంతటితో ఆగకుండా తాను నివాసం ఉంటున్న  తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ నాలుగు అడుగుల ఎత్తు ఐరెన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడం. కేవలం రెండు లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల అల్టిమేటానికే ఇంతలా భయపడుతున్న జగన్ రేపు ఐదున్నర కోట్ల మంది జనానికి ఏం సమాధానం చెప్పుకుంటారు? ఏం చేశానని చెప్పుకుంటారు? మళ్లీ తనకు ఓటు వేసి గెలిపించాలనే ఎలా అభ్యర్థిస్తారన్నది చూడాల్సిందేనని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.

By
en-us Political News

  
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న  స్థానిక  ఎన్నికల్లో  బీజేపీకి  ఏ పార్టీతోనూ  పొత్తులు పెట్టుకునే ఆలోచన  లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్‌కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయోధ్య రామమందిరం పేరిట సేకరించిన విరాళాల విషయంలో అక్రమాలు జరిగాయనే అంశాన్ని వ్యంగ్యంగా, నాటకీయంగా చూపించేందుకు వారు చేపట్టిన ఈ వినూత్న నిరసన రాజకీయ వివాదానికి దారి తీసింది. రామాలయాన్ని, పూజారి వ్యవస్థను, భక్తుల నమ్మకాలను హేళన చేసేలా ఈ నిరసన ఉందంటూ.. బీహార్‌లోని జమూయి సివిల్ కోర్టులో ఓ సీనియర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.