అస్త‌మిస్తోన్న సూర్యుడు..మార‌న్ సోద‌రుల మ‌ధ్య గొడ‌వేంటి?

Publish Date:Jun 21, 2025

Advertisement

 

డీఎంకే ఎంపీ ద‌యానిధి మార‌న్, భార‌తీయ కుబేరుల్లో ఒక‌డైన క‌ళానిధి మార‌న్ కి మ‌ధ్య ఆస్తి చిచ్చు మొద‌లైందా? అంటే అవున‌ని తెలుస్తోంది. 2003లో తండ్రి ముర‌సోలి మార‌న్ మ‌ర‌ణించారు. స‌రిగ్గా ఆ టైంలో బీజం వేసుకుందీ ఆస్తి త‌గాదా. అప్ప‌ట్లో త‌న తండ్రి మ‌ర‌ణించిన వెంట‌నే క‌ళానిధి మారన్.. అక్ర‌మంగా 12 ల‌క్ష‌ల షేర్ల‌ను నామ మాత్రం విలువ‌, అంటే రూ. 10 చొప్పున షేర్లు త‌న పేరిట కేటాయింపులు చేసుకున్నార‌నీ.. ఆ టైంలో ఈ షేరు విలువ రెండున్న‌ర వేల నుంచి సుమారు రూ.3 వేల వ‌ర‌కూ ఉండేద‌ని.. దీంతో ఆయ‌న 60 శాతం వ‌ర‌కూ వాటాల‌ను కైవ‌సం చేసుకుని అక్ర‌మంగా స‌న్ నెట్ వ‌ర్క్ య‌జ‌మాని అయ్యార‌ని ఆరోపిస్తున్నారు ద‌యానిధి మార‌న్. అందుకే తాము 2003 నాటి పాత యాజ‌మాన్య స్థితికి కంపెనీని తీసుకురావ‌ల్సిందిగా  కోరుతున్నారు ద‌యానిధి మార‌న్. 

తాను కూడా చ‌ట్ట‌ప‌ర‌మైన వార‌సుడ్నేన‌నీ.. త‌న తండ్రి మ‌ర‌ణ దృవీక‌ర‌ణ‌, చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన  వార‌స‌త్వ ప‌త్రాల్లేకుండానే క‌ళానిధి త‌న‌కు ద‌క్కాల్సిన  షేర్లు, డివిడెండ్లు, ఆస్తులు, ఆదాయాల‌ను ద‌క్క‌కుండా చేశార‌ని.. అవ‌న్నీ తిరిగి చెల్లించ‌కుంటే తాను సెబీ, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, ఆర్వోసీ వంటి సంస్థ‌ల‌కు కంప్ల‌యింట్ తీస్కెళ్లాల్సి ఉంటుంద‌ని త‌న నోటీసుల ద్వారా హెచ్చ‌రించారు మార‌న్ బ్ర‌ద‌ర్. ఈ దిశ‌గా  జూన్ 10న మార‌న్ త‌న సోద‌రుడికి లా ధ‌ర్మ అనే సంస్థ ద్వారా నోటీసులు పంపించారు.

క‌ళానిధి మార‌న్ 2003 నుంచి 2023 వ‌ర‌కూ ఏకంగా 8500 కోట్ల మేర అక్ర‌మ నిధుల‌ను ఎన్నో విభాగాల్లో పెట్టుబ‌డులు పెట్టార‌నీ.. ఇదంతా చ‌ట్ట‌విరుద్ధ‌మ‌నీ అంటారు ద‌యానిధి మార‌న్. 2024లో క‌ళానిధి ఏకంగా 455 కోట్ల విలువైన డివెండ్లు పొందార‌ని.. త‌న భార్య కావేరి, తాను క‌ల‌పి సీఈవోగా ఒక్కొక్క‌రూ అర‌వై కోట్ల‌కు పైగా.. ప్యాకేజ్ తీస్కుంటున్నార‌నీ.. ఆయ‌న 2023లో భార‌త కుబేరుల జాబితాలో 77వ బిలియ‌నీర్ గా ఎదిగారంటే దాని వెన‌క‌- ఈ అక్ర‌మ షేర్ల బ‌దలాయింపు ఉంద‌ని అంటున్నారు ద‌యానిధి మార‌న్.

మ‌రీ ముఖ్యంగా కంపెనీల చ‌ట్టం 212 ప్ర‌కారం.. చూస్తే క‌ళానిధి పెట్టుబ‌డులు పెట్టిన  టీవీ, రేడియో, క్రీడా, విమాన యాన ఇలా ఎన్నో రంగాల లైసెన్సులు ర‌ద్దు అయ్యే ప్ర‌మాద‌మున్న‌ట్టు తెలుస్తోంది. స‌న్ నెట్ వ‌ర్క్ కింద 37 చానెళ్లు, 69 రేడియో స్టేస‌న్లుండ‌గా.. వీటితో పాటు స‌న్ పిక్చ‌ర్స్ పేరిట చిత్ర నిర్మాణ సంస్థ ఉండ‌గా.. 2023లో ఈ సంస్థ నుంచి జైల‌ర్ సినిమా విడుద‌లై వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసింది.ఇక క‌ళానిధి కుమార్తె కావ్య మార‌న్ ఇక్క‌డ ఐపీఎల్ లో స‌న్ రైజ‌ర్స్ ఫ్రాంచైజీ  తో పాటు సౌతాఫ్రికాలోనూ ఒక క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. ఈ టీములు 2016లో ఐపీఎల్, 2023-24లో ద‌క్షిణాఫ్రికా చాంపియ‌న్ గా నిలిచాయి. ఇక ఇంగ్లండ్ లోనూ ఒక క్రికెట్ టీమ్ ని కొనుగోలు చేసింది కావ్య‌నాయ‌క‌త్వంలోని స‌న్ నెట్ వ‌ర్క్. అంతే కాదు విమాన‌యానంలోనూ పెట్టుబ‌డులు పెట్టిందీ సంస్థ‌. 

వీట‌న్నిటి లైసెన్సులూ ఇప్పుడు ప్ర‌మాదంలో ప‌డ్డంతో పాటు.. వెయ్యి మందికి పైగా ఉద్యోగుల కుటుంబాల‌పైనా ఈ ప్ర‌భావం ప‌డేలా తెలుస్తోంది.దానికి తోడు ద‌యానిధి మార‌న్ డీఎంకే ఎంపీ  కూడా కావ‌డంతో రాజ‌కీయంగానూ ఈ ఆస్తి వివాదం.. వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం  ప‌డేలా ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌రి దీనంత‌టికీ ఈ కుటుంబం ఫుల్ స్టాప్ పెడుతుందా లేదా తేలాల్సి ఉంది. 2018 వ‌ర‌కూ క‌రుణానిధి జీవించి ఉండ‌గా.. ఆయ‌న ద్వారా ఇలాంటి కుటుంబ స‌మ‌స్య‌లు ఎన్నో క్లియ‌ర్ అవుతూ వ‌చ్చేవి. ఎందుకంటే క‌రుణానిధికి మేన‌ల్లుడే మురుసోలి మార‌న్. దానికి తోడు త‌న మేన‌మామ మీదున్న ప్రేమ కొద్దీ ముర‌సోలి ఆయ‌న పేరును పోలిన  పేర్లు త‌న‌పిల్ల‌ల‌కు పెట్టారు. 

ఈ క్ర‌మంలో ఆయ‌న లేక పోవ‌డం ఒక‌ర‌కంగా ఈ కుటుంబం మ‌ధ్య వివాదం నానాటికీ పెరిగి పెద్ద‌ద‌వుతూ వ‌చ్చింది. ఇప్పుడు క‌రుణ  త‌న‌యుడు స్టాలిన్ త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి. ఆయ‌న‌కున్న ప్ర‌భుత్వ, రాజ‌కీయ ప‌ని ఒత్తిడి కార‌ణంగా ఈ కుటుంబ త‌గాదాలు తీర్చే ప‌రిస్థితి  క‌నిపించ‌డం లేదు. క‌ళానిధి తెలివిగా త‌న ఒకే ఒక్క సోద‌రికి 500 కోట్ల రూపాయ‌లు బ‌దిలీ  చేసి త‌ద్వారా కుటుంబంలో త‌న‌పై ఒత్తిడి రాకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ఇక్క‌డ మ‌రో విచిత్ర‌మైన ప‌రిస్థితి ఏంటంటే.. ద‌యానిధి ఇన్నాళ్ల‌కు త‌న‌కు జ‌రిగిన  అన్యాయాన్ని గుర్తించి.. ఇప్పుడు ఇన్నేళ్ల త‌ర్వాత ఈ ర‌చ్చ‌ను చ‌ట్ట‌ప‌రంగా ఎదుర్కోడానికి సిద్ధ‌ప‌డ్డం వెన‌క ఉద్దేశ‌మేంట‌న్న‌ది అర్ధం కావ‌డం లేదెవ‌రికీ.

By
en-us Political News

  
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.