కోవిడ్ వచ్చి తగ్గిన వారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉందట!

Publish Date:Apr 12, 2023

Advertisement

మనషుల్ని వేధించే ఆరోగ్య సమస్యలలో ఎన్నో ఉన్నాయి. వాటిలో పార్కిన్సన్స్ వ్యాధి కూడా ఒకటి. పార్కిన్సన్స్ వ్యాధి  మెదడులోని కొన్ని భాగాలలో  ఏర్పడే రుగ్మత, ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. సాధారఁంగా ఉన్న జీవితాన్ని ఒక్కసారిగా కుదుపుకు లోనుచేస్తుంది.   2016 సంవత్సరపు గణాంకాల ప్రకారం, దేశంలో సుమారు 6 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు, అయితే అప్పటికంటే కూడా కరోనా  తర్వాత, పార్కిన్సన్స్ కేసులలో వేగంగా పెరుగుదల కనిపించండం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. పార్కిన్సన్స్ వ్యాధిలో నడకలో మార్పు రావడం, దేనినైనా పట్టుకోవడం కష్టమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఈ సమస్య నివారణ,  అవగాహన కోసం ప్రతి కృషి చెయ్యాలి. 

2019 చివరిలో ప్రారంభమైన కరోనా  యొక్క దుష్ప్రభావాలు పార్కిన్సన్స్ వ్యాధి కేసులను  మరింత  పెంచాయని పరిశోధకులు కనుగొన్నారు. సాధారణంగా ఇది ఒకప్పుడు  వృద్ధాప్య సమస్యగా పరిగణించబడేది, అయితే కరోనా మహమ్మారి తర్వాత అయోమయం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, శరీర భంగిమలో అసమతుల్యత వంటి పార్కిన్సన్స్ వ్యాధి యొక్క నాడీ సంబంధిత లక్షణాలు ప్రజలలో  ఎక్కువగా కనిపిస్తున్నాయి.

కోవిడ్ వైరస్ కారణంగా మెదడు  కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం  అయ్యాయి. ఈ అంటువ్యాధి తరువాత, పార్కిన్సస్స్  కేసులు  పెరిగాయి. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనంలో , SARS-CoV-2 వైరస్ పార్కిన్సన్స్ వ్యాధి సమయంలో మెదడులో జరిగే మార్పులను కనుగొన్నారు. వైరస్ ప్రభావం కారణంగా  మెదడులో తాపజనక ప్రతిస్పందనను ప్రేరేపిస్తుందని కనుగొన్నారు. మెదడులోని మైక్రోగ్లియా అనే రోగనిరోధక కణాలపై కరోనా వైరస్ ప్రభావం చూపుతుందని పరిశోధనలో తేలింది. ఈ కణాలు సాధారణంగా పార్కిన్సన్స్ వ్యాధిలో అతిగా చురుగ్గా పనిచేస్తాయి మరియు తాపజనక రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి కోవిడ్ వచ్చినవారు ఈ వ్యాధి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

పార్కిన్సన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ఇప్పటి వరకు పార్కిన్‌సన్‌ వ్యాధి రావడానికి సరైన కారణం తెలియరాలేదని, దానికి నిర్దిష్టమైన చికిత్స ఏమీ లేదని పరిశోధకులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా ఏరోబిక్ వ్యాయామం చేయడం, ఆహారంలో యాంటీఆక్సిడెంట్ల పరిమాణాన్ని పెంచడం వల్ల ఈ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పార్కిన్సన్స్ వ్యాధి పెరుగుతోంది, దీనిపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యకరమైన అలవాట్లు, మంచి పోషకాహారం, మంచి నిద్ర, శారీరక వ్యాయామంతో పాటు మానసికంగా దృఢంగా ఉండటానికి ప్రయత్నం చెయ్యాలి. ఇందుకోసం ధ్యానం, ప్రాణాయామం చక్కగా పనిచేస్తాయి. నాడీవ్యవస్థను బలోపేతం చేసే చిట్కాలు పాటించాలి.

                                            ◆  నిశ్శబ్ద

By
en-us Political News

  
మన భారతీయ సంప్రదాయంలో యోగాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. యోగా కేవలం ఆసనాలకే పరిమితం కాదు, ‘ముద్రలు’ కూడా మన శరీర ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన చేతి ఐదు వేళ్లు పంచభూతాలకు (అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలం) ప్రతిరూపాలు. ఈ వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచే పద్ధతినే ‘ముద్ర’ అంటారు.
మన శరీరంలో మెదడు తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన అవయవం కాలేయం (Liver). జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి, రక్తాన్ని శుద్ధి చేయడం వరకు కాలేయం సుమారు 500 పైగా పనులను నిర్వహిస్తుంది...
ఈ రోజుల్లో అనారోగ్యకరమైన జీవనశైలి,  ఆహారపు అలవాట్ల కారణంగా గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో కొంతకాలంగా యువతలో గుండెపోటులు సంభవిస్తున్నాయి. గుండెను బలోపేతం..
వేసవి కాలంలో శరీరానికి నీరు చాలా అవసరం. నీటి కొరత ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి రోజుకు 8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగమని వైద్యులు తరచుగా సలహా ఇస్తారు. అదనంగా..
వేసవికాలం అంటేనే వేడి గాలులు, వడదెబ్బ, మండే ఎండలు గుర్తొస్తాయి.  ఎండల వేడి గురించి పక్కన పెడితే.. మనుషుల నుండి జంతువుల వరకు.. ప్రతి ఒక్క ప్రాణి వేసవిలో వడదెబ్బకు గురయ్యే అవకాశాలు..
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే ఏ పనులైనా చేయవచ్చు, ఎంత డబ్బు అయినా సంపాదించుకోవచ్చు. కానీ నేటికాలంలో డబ్బు...
వేసవి కాలంలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం పెరుగుతుంది. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గడం అనే ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల కాల్షియం..
పంచదార.. నేటికాలంలో చాలా విరివిగా వాడుతున్నారు. కాఫీ, టీ,  స్వీట్లు,  ఇంట్లో చేసే తీపి పదార్థాలు, డిజర్ట్ లు.. ఇలా చాలా తీపి పదార్థాల తయారీలో పంచదారది అగ్రస్థానం.  కాఫీ, టీ ల విషయాని వస్తే.. రోజులో కప్పుల..
వేసవి కాలం వచ్చిందంటే చల్లదనాన్ని వెతుక్కోవడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగమే ఈత కూడా.. ఇప్పట్లో చిన్న పట్టణాల నుండి పెద్ద నగరాల వరకు చాలా చోట్ల స్విమ్మింగ్ ఫూల్ లు కూడా ఏర్పాటు చేస్తున్నారు...
ఆరోగ్యంగా ఉండటానికి నీరు త్రాగడం మంచిదని చెబుతారు.  నీకు ఎంత తాగితే ఆరోగ్యం అంత బాగుంటుందని కూడా చెబుతారు. ఆరోగ్య  నిపుణులు రోజుకు  8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగాలని సిఫార్సు చేస్తున్నారు...
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఒక్కోరకం కూరగాయలలో ఒకో రకం పోషకాలు ఉంటాయి.  కొన్ని రకాల కూరగాయలు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తాయి.  అలాంటి కూరగాయలలో బ్రోకలీ కూడా ఒకటి.  చూడటానికి ఆకుపచ్చ రంగులో..
మండే వేసవి ఎండ నుండి తప్పించుకోవడానికి గంటల తరబడి ఏసీ ముందు కూర్చోవడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఇది సౌకర్యవంతంగా అనిపించినప్పటికీ, ఈ అలవాటు  శరీరంపై రహస్యంగా..
భారతీయులు చాలామంది రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగుతూ ఉంటారు. ఆయుర్వేదపరంగా పసుపు పాలు ఎంతో ఆరోగ్యకరమైనవి.  పసుపు పాలలో ఉన్న ప్రయోజనాల కారణంగా వీటిని గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.