బాలినేని వర్సెస్ దామచర్ల.. ఒంగోలులో కూటమి పార్టీల మధ్య చిచ్చు.!

Publish Date:Aug 10, 2026

Advertisement

ప్రకాశం జిల్లాలో కూటమి పార్టీల మధ్య చిచ్చు రేగింది. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమిలో భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మ మధ్య ఒంగోలులో ఏర్పడిన విభేదాలు, విమర్శలు, ప్రతి విమర్శలతో ఇరు పార్టీల నేతలూ రెచ్చి పోతున్న తీరు జిల్లాలో పొలిటికల్ హీట్ ను అమాంతంగా పేంచేసింది.  ఒంగోలు ఎమ్మెల్యే  దామచర్ల జనార్ధన్‌రావు, మాజీ మంత్రి,   జనసేన   సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి విభేదాలు ఇరు పార్టీల మధ్యా రాజకీయ రచ్చకు కారణమైంది.  దామచర్ల, బాలినేని మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, అలాగే ఆరోపణలు, ప్రత్యారోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.  

 ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో బాలినేని పై  ఆరోపణలు గుప్పించారు. బాలినేని పేరుకే జనసేనలో ఉన్నారనీ, అయితే వైసీపీ తరఫునే, వైసీపీ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలినేని 2024 ఎన్నికల తరువాత వైసీపీకి గుడ్ బై చెప్ప జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ.. దామచర్ల.. బాలినేని వైసీపీ కోసం పని చేస్తున్నారంటూ ఆరోపించారు.  అలాగే తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే లక్ష్యంతో బాలినేని అనుచరుల ద్వారా కరపత్రాలు పంపిణీ చేయించారన్నారు. 

కూటమి ధర్మాన్ని పాటిస్తూ.. ఇంత కాలం ఓర్పుగా ఉన్నానన్న దామచర్ల.. తన ఓర్పును బాలినేని బలహీనతగా భావించి రెచ్చిపోవాలని చూస్తుండటంతో ఇక భరించలేకే బాహాటంగా బాలినేని తీరును బయటపెట్టానన్నారు.  బాలినేని రౌడీయిజాన్ని ఉపేక్షించబోనని హెచ్చరించారు.  తనపై బాలినేని వర్గీయులు చేసిన అక్రమ వసూళ్ల ఆరోపణలు  నిరూపించాలని సవాల్ చేశారు.  ఈ క్రమంలో దామచర్ల బాలినేని కుమారుడు స్థానిక యువతను గంజాయి లాంటి తీవ్ర దురలవాట్లకు గురిచేశారని సంచలన ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, యువత భవిష్యత్తును నాశనం చేసేలా గతంలో కొందరు వ్యవహరించారనీ,  కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒంగోలులో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు తాము కృషి చేస్తుంటే, కొందరు నేతలు ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు.  

కూటమి పార్టీల అగ్రనాయకత్వం స్పష్టమైన అవగాహనతో ఐక్యంగా ముందుకు సాగుతున్నా,  ఒంగోలు నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశం, జనసేన స్థానిక నాయకులు, శ్రేణుల మధ్య   సమన్వయం కుదరడం లేదన్న మాట చాలా కాలంగా వినిపిస్తూ వస్తోంది. ఇప్పుడు దామచర్ల బాలినేపిపై చేసిన ఆరోపణలు, విమర్శలు ఒంగోలులో కూటమి పార్టీల మధ్య సమన్వయ లేమికి అద్ధం పడుతున్నాయి.    

ఎమ్మెల్యే దామచర్ల చేసిన తీవ్ర ఆరోపణలపై బాలినేని శ్రీనివాసరెడ్డి లేదా ఆయన వర్గం ఎలా స్పందిస్తుందనేది ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయంలో ఉత్కంఠగా మారింది. ఇరు పార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు కలసి పనిచేస్తున్న వేళ, క్షేత్రస్థాయిలో సీనియర్ నేతల మధ్య సాగుతున్న ఈ శత్రుత్వం ఎటు దారితీస్తుందోనని స్థానిక ప్రజలు, కూటమి శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నారు. అధిష్ఠానం త్వరితగతిన దిద్దుబాటు చర్యలు చేపట్టి, ఒంగోలులో ప్రశాంత రాజకీయ వాతావరణాన్ని పునరుద్ధరించాలని నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారు.

Damacharla Janardhan, Balineni Srinivasa Reddy,  Ongole politics, TDP Janasena alliance, Prakasam district politics, TeluguOne

By
en-us Political News

  
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.