తెలుగు సినిమాకు కొత్త రాజుగారు

Publish Date:Feb 13, 2013

Advertisement

 

‘లీడర్’ వంటి ఒక మంచి సినిమాతో తన నటప్రస్థానం ప్రారంభించిన దగ్గుబాటి రానా, ఇతర చిన్నా,పెద్ద నటులవలే కాకుండా విభిన్నమయిన పాత్రలు ఎంచుకొంటూ తన కెరీర్ తొలిదశలోనే ఎవరూ ఊహించని వేగం అందుకొన్నాడు. సాధారణంగా, ఆ దశలో ఉన్న నటులెవరయినా సినీ పరిశ్రమలో నిలద్రొక్కుకొనేవరకూ మాస్ మసాల సినిమాలు చేస్తుంటారు. గానీ, రాణా మాత్రం తన కెరీర్ తొలి దశలోనే బాలివుడ్ వైపుకు కూడా వెళ్లివచ్చేయడమే కాక, ‘కృష్ణం వందే జగద్గురం’ వంటి విభిన్నమయిన సినిమాలు చేసి అందరిని మెప్పించగలిగాడు. తత్ఫలితంగా విజయానికి, కొత్త ఆలోచనలకి మారు పేరయిన రాజమౌళి వంటి దర్శకుల దృష్టిలో పడి, మరింత విభిన్నమయిన పాత్రలు చేసే అవకాశం దక్కించుకొన్నాడు.

 

తెలుగు చిత్ర పరిశ్రమలో చాలారోజుల తరువాత ‘బాహుబలి’ అనే పేరుతొ తయారవుతున్న ఈ జానపద చిత్రంలో రాణాకు అవకాశం దొరకడమే కాక, అందులో ప్రభాస్ కు వ్యతిరేఖంగా ప్రతినాయకుడి పాత్ర పోషించే అవకాశం కూడా దక్కించుకొన్నాడు.

 

మన తెలుగు సినీ పరిశ్రమలో స్వర్గీయ నందమూరి తారక రామారావు, స్వర్గీయ యస్వీ.రంగారావు, గుమ్మడి, అక్కినేని,శోభనబాబు, కృష్ణ వంటి వారు మాత్రమే, తమ హీరో ఇమేజ్ ను పక్కన పెట్టి విభిన్నమయిన పాత్రలు పోషించి, ఆచంద్రార్కం నిలిచిపోయే కీర్తి ప్రతిష్టలను స్వంతం చేసుకోగలిగారు. అయితే, మారిన సామాజిక పరిస్థితుల్లో అటువంటి పాత్రలు చేసే దైర్యం కానీ అవకాశాలు గానీ నేటి హీరోలెవరికీ లేవని చెప్పక తప్పదు. అటువంటి గొప్ప అవకాశం దక్కించుకొన్న దగ్గుబాటి రాణా దానిని సద్వినియోగపరుచుకొంటాడనే ఆశించవచ్చును.

 

దగ్గుబాటి రాణా ఎటువంటి హీరో ఇమేజ్ తనని కబళించక మునుపే విభిన్నమయిన పాత్రలు పోషించే అవకాశం పొందడం ఆయన అదృష్టం అనే చెప్పాలి. ప్రభాస్, రాణా, అనుష్క, రాజమౌళి నలుగురు కలిసి చేస్తున్న ఈ సినిమా విజయవంతమయితే, మన సినీ పరిశ్రమకి కొత్త నటులు దొరకడమే కాకుండా, మన నిర్మాతలు, హీరోలు దైర్యంగా ప్రయోగాలు చేసేందుకు కూడా అది దోహదపడుతుంది.

 

ఇక దగ్గుబాటి రాణా ‘బాహుబలి’ జానపద సినిమాతో బాటు, చారిత్రాత్మక సినిమా ‘రాణీ రుద్రమదేవి’ కూడా చేయనున్నాడు. అందులో నిడవర్ద్యపురం ( నిడదవోలు) యువరాజైన చాళుక్య వీరభద్రుడి పాత్ర అతను పోషిస్తున్నాడు.

 

ఇక, అనుష్క పోషిస్తున్న రాణీ రుద్రమదేవి పాత్ర చుట్టూ తిరగే ఈ సినిమాలో నటించడం రాణాకు నిజంగా కత్తిమీద సామే అవుతుంది. ఎందుకంటే, ఇప్పటికే అరుందతి సినిమా ద్వారా అటువంటి రాజరిక పాత్రలు చేయగల గొప్ప నటిగా నిరూపించుకొన్న అనుష్క, శక్తివంతమయిన రాణీ రుద్రమదేవిగా తెరమీద ఉన్నపుడు ఆమెకు సరితూగేలా నటించడం రాణాకు చాల క్లిష్టమయిన పని అవుతుంది. కనుక దగ్గుబాటి రాణా సినీ ప్రస్థానంలో ఈ రెండు సినిమాలు చాలా కీలకమయినవని చెప్పవచ్చును. అందువల్ల, ఈ సినిమా ద్వారా రాణా తనను తానూ మరో మారు ఆవిష్కరించుకొనే అవకాశం పొందాడు. ‘రాణీ రుద్రమదేవి’ సినిమాకు గుణశేకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.