Publish Date:Mar 29, 2022
బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం ఓ వృద్ధుడి ప్రాణాలతో చెలగాటమాడింది. లోపల ఎవరైన ఉన్నారో లేదో చెక్ చేసుకోకుండానే.. లాకర్ రూమ్కు తాళం వేసి ఇంటికెళ్లిపోయారు. 18 గంటల పాటు ఆ తాళం వేసిన లాకర్ గదిలోనే ఉండిపోయాడు జూబ్లీహిల్స్కు చెందిన 84 ఏళ్ల కృష్ణారెడ్డి అనే వ్యాపారి. రాత్రంతా ఇటు కుటుంబ సభ్యులు.. అటు పోలీసులు తీవ్ర టెన్షన్ పడ్డారు. ఎట్టకేళకు ఉదయం కృష్ణారెడ్డిని లాకర్ రూమ్లో నుంచి బయటకు తీసుకొచ్చారు. సినిమాటిక్గా జరిగిన ఈ ఉదంతం.. బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. సిబ్బంది పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జూబ్లీహిల్స్లోని యూనియన్ బ్యాంక్లో జరిగిందీ ఘటన. జూబ్లీహిల్స్కు చెందిన వ్యాపారి కృష్ణారెడ్డి సోమవారం సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు బ్యాంకులోని లాకర్ రూమ్లోకి వెళ్లారు. అయితే, ఆయన తన లాకర్ చెక్ చేసుకుంటుండగానే.. బ్యాంకు సిబ్బంది ఆయన్ను గమనించకుండా లాకర్ రూమ్ను మూసివేశారు. తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో లాకర్ రూమ్లోనే కృష్ణారెడ్డి రాత్రంతా ఉండాల్సి వచ్చింది.
కట్ చేస్తే.. రాత్రైనా ఇంకా ఇంటికి రాలేదంటూ కృష్ణారెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ టెన్షన్ పడ్డారు. ఆయనకేమైనా జరిగిందేమోనని ఆందోళన చెందారు. వ్యాపారి కావడంతో ఎవరైనా ఏదైనా ప్రమాదం తలపెట్టారేమోననే భయమూ కలిగింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కృష్ణారెడ్డి కోసం గాలింపు మొదలుపెట్టారు. ఎంతకీ ఆయన ఆచూకీ ట్రేస్ కాలేదు. ఆయన సెల్ఫోన్ సిగ్నల్ కూడా చిక్కలేదు. ఈ లోపు తెల్లారిపోయింది.
ఉదయం మళ్లీ ఫ్రెష్గా దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు. కృష్ణారెడ్డి సోమవారం సాయంత్రం బ్యాంక్కి వెళ్లారనే సమాచారం తెలియడంతో అక్కడి సీసీటీవీ ఫూటేజ్ చెక్ చేశారు. బ్యాంక్లోకి వెళ్లినట్టు విజువల్ ఉన్నా.. మళ్లీ బయటకు తిరిగొచ్చిన దృశ్యాలు మాత్రం కెమెరాలో రికార్డు కాలేదు. అంటే, బ్యాంక్లోనే ఏదో జరిగుంటుందనే కోణంలో మరింత సమగ్రంగా విచారించారు. చివరాఖరికి బ్యాంకు లాకర్ రూమ్లోని సీసీఫూటేజీలో కృష్ణారెడ్డి కనిపించారు. వెంటనే లాకర్ గది తాళాలు తెరిపించి.. ఆయన్ను బయటకు తీసుకొచ్చారు. అప్పటికే ఆయన బాగా నీరసంగా ఉన్నారు. ఎందుకైనా మంచిదని వెంటనే హాస్పిటల్కి తరలించారు. అలా సోమవారం సాయంత్రం 4:20 నుంచి మంగళవారం ఉదయం 10:30 వరకు.. దాదాపు 18 గంటల పాటు.. లాకర్ రూమ్లో ఒంటరిగా, భయం భయంగా గడిపారు కృష్ణారెడ్డి. చుట్టూ ఇనుప లాకర్లు మినహా ఏమీ కనిపించదు. ఎలాంటి శబ్దాలూ వినిపించవు. ఎవరూ కనిపించరు. ఓ వైపు ఆకలి, దప్పిక.. ఇంకోవైపు గుండెదడ. బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యానికి.. పాపం 84 ఏళ్ల వయసులో.. రాత్రంతా ఆయన ఎంత నరకం అనుభవించారో.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/customer-locked-in-bank-locker-room-39-133651.html
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.