మెదడుకి దెబ్బ తగిలితే ఇక CT SCAN అక్కర్లేదు

Publish Date:Feb 15, 2019

Advertisement

 

మనుషులన్నాక దెబ్బలు సహజం. పిల్లవాడు ఆడుకుంటూ తల బొప్పి కట్టించుకున్నా, పెద్దవాళ్లు బండి మీద నుంచి జారిపడినా... ఒంటి మీద దెబ్బ పడకుండా జీవితాన్ని ఈదలేం. కాకపోతే తల మీద దెబ్బ తగిలితే ఆ అనుమానమే వేరబ్బా! ఆ దెబ్బ వల్ల మెదడులో ఏదన్నా బ్లడ్‌ క్లాట్‌ అయిందేమో అని మనసు ఒకటే పీకుతూ ఉంటుంది. ఇక ఆ అనుమానాన్ని క్యాష్‌ చేసుకునేందుకు మన హాస్పిటల్స్ ఎలాగూ సిద్ధంగా ఉంటాయి. మెదడుకి కాస్త దెబ్బ తగిలి కళ్లు బైర్లు కమ్మాయని చెప్పగానే వెంటనే CT SCAN తీయించుకోమని భయపెడతారు డాక్టర్లు.

 

సీటీ స్కాన్ అంటే మాటలా! అది ఎక్కడ పడితే అక్కడ ఉండదు. దాన్ని ఏర్పాటు చేసుకున్న హాస్పిటల్స్ దగ్గరకి వెళ్లి తెగ నిరీక్షించాలి. ఆపై వేలకి వేలు ఫీజులు కట్టాలి. సీటీ స్కాన్ మిషన్ వల్ల వెలువడే రేడియేషన్‌కి మన శరీరాన్ని అప్పగించాలి. ఇంత చేసిన తర్వాత రిపోర్టు ఎలా వస్తుందో అని దేవుడికి తెగ మొక్కాలి. మరి ఈ హడావుడి అంతా లేకుండా సింపుల్‌గా ఒకే ఒక్క రక్తపు చుక్కతో మన మెదడులో ఉన్న పరిస్థితిని తెలుసుకోగలిగితే ఎంత బాగుండో కదా!

 

ఇదే ఆలోచన వచ్చింది జెనీవాలో కొంతమంది శాస్త్రవేత్తలకి. మన శరీరంలో ఏదన్నా తేడా జరిగినప్పుడు రక్తప్రసారంలో కొన్ని మార్పులు వస్తాయి. కొన్ని ప్రొటీన్లు ఎక్కువగానో తక్కువగా స్రవిస్తాయి. వీటిని బయోమార్కర్స్ అంటారు. మెదడుకి దెబ్బ తగిలినప్పుడు కూడా ఇలాంటి బయోమార్కర్స్‌ ఏవన్నా విడుదల అవుతాయేమో కనుక్కుందామని ప్రయత్నించారు ఆ శాస్త్రవేత్తలు.

 

మెదడుకి దెబ్బ తగిలినప్పుడు అక్కడ ఉన్న కణాలు ఏవన్నా దెబ్బ తింటే H-FABP అనే ప్రొటీను రక్తంలోకి ఎక్కువగా విడుదల అవుతుందని తెలిసింది. ఒక మిల్లీలీటరు రక్తంలో 2.5 కంటే ఎక్కువగా H-FABP ఉంటే లోపల ఏదో జరిగి ఉంటుందని అనుమానించవచ్చు. అప్పుడే మిగతా పరిక్షల జోలికి వెళ్లవచ్చని తేల్చారు. ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఎలాగైతే యూరిన్‌ శాంపిల్‌ ఉపయోగిస్తామో... అలాగే H-FABP ప్రొటీన్‌ ఎంత ఉందో తెలుసుకునేందుకు ఒక చిన్న స్ట్రిప్‌ మీద రక్తపు బొట్టు వేస్తే సరిపోతుందట.

 

సాధారణంగా ఇలాంటి పరిశోధనలు వినడానికి బాగానే ఉంటాయి కానీ మార్కెట్లోకి రావడానికి చాలాకాలం పడుతుంది. కానీ ఈ స్ట్రిప్‌ని మాత్రం వచ్చే ఏడాది నుంచి జనాలకి అందుబాటులో ఉంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

- నిర్జర.

 

By
en-us Political News

  
ఇప్పట్లో సంపూర్ణ ఆరోగ్యం కలిగిన మనుషులు దాదాపు కనుమరుగయ్యారనే చెప్పాలి.
వేసవికాలం  వచ్చిందంటే మండే ఎండల వల్ల అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటారు.
రోజంతా పాజిటివ్‌గా,  యాక్టివ్‌గా ఉండటానికి మంచి ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
వేసవికాలం వచ్చిందంటే ఆరోగ్య పరంగా మామూలు కంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎండ వేడిమి కారణంగా, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలో ఉష్ణోగ్రత విషయంలో కూడా మార్పులు వస్తాయి. శరీరంలో తేమ శాతం చాలా వేగంగా తగ్గిపోతుంది....
ఉష్ణోగ్రత తగ్గుదల కారణంగా చాలా మంది  శీతాకాలం లేదా రుతుపవన కాలంలో కాళ్ల తిమ్మిరి సమస్య గురించి కంప్లైంట్ చేస్తుంటారు.
లీచీ ఆగ్నేయాసియాకు చెందిన ఉష్ణమండల పండు.
వాకింగ్ సాధారణంగా ఆరోగ్యం కోసం చాలామంది చేసే సింపుల్ వ్యాయామం. దీనికి ఎలాంటి ప్రత్యేక పరికరాలు అక్కర్లేదు.
భారతీయ సంస్కృతిలో తమలపాకులకు చాలా ప్రాముఖ్యత ఉంది. దేవుడి పూజలలోనూ, శుభకార్యాలలోనూ ఇది లేకుండా పని జరగదు....
భారతీయుల ఆహారం చాలా విశిష్టమైనది. ఇందులో పేర్కొన్న ప్రతి ఆహారం వెనుకా ఒక ప్రత్యేక కారణం, బోలెడు ప్రయోజనాలు ఉంటాయి....
పండ్లలో రారాజుగా మామిడిని చెప్పుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల మామిడిపండ్ల రకాలు ప్రసిద్ధి చెందాయి. మామిడి పండ్లు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని..
ల్వపత్రి లేదా మారేడు ఆకులు దేవుడి పూజకు విరివిగా ఉపయోగిస్తారు.
మనిషి శరీరంలో ప్రాణం రక్తంలోనే ఉంటుందని అంటారు.
భారతీయుల వంటింట్లో తప్పనిసరిగా మసాలా దినుసులు ఉంటాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.