తమ్మినేనీ.. స్పీకరేనా మీరు?

Publish Date:Sep 22, 2023

Advertisement

 స్పీకర్ స్థానంలో  కూర్చున్నది ఎవరైనా, ఆ స్థానానికి ఒక విలువ ఉంది. అందుకే, చట్ట సభల్లో స్పీకర్ స్థానాన్ని, గౌరవంగా సంబోధించాలి, సంబోధిస్తారు. అలాగే, స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి  తాను స్వతహాగా,ఎలాంటి వారైనా, ఎలాంటి రాజకీయ నేపథ్యం నుంచి వచ్చినా తాను కూర్చున్న  స్థానం గౌరవాన్ని నిలబెట్టవలసి ఉంటుంది. అదే స్పీకర్ ప్రథమ కర్తవ్యం. స్పీకర్ రాజకీయ పదివి కాదు, రాజ్యాంగ పదవి, అందుకే, స్పీకర్ గా ఎన్నికైన వ్యక్తి  ప్రమాణ స్వీకారానికి ముందే, రాజకీయ సభ్యత్వానికి రాజీనామా చేసి, బాధ్యతలు స్వీకరించడం ఒకప్పుడు ఆనవాయితీగా ఉండేది.. స్వతంత్ర భారత లోకసభ మొదటి స్పీకర్ గణేశ్ వాసుదేవ్ మావలాంకర్  ఆ ఒరవడికి శ్రీకారం చుట్టారు. అయితే అనంతర కాలంలో  వచ్చిన స్పీకర్లు చాలా వరకు  రాజకీయ సభ్యత్వానికి రాజీనామా చేసినా చేయక పోయినా, ‘చైర్’ గా సంభోదించే స్పీకర్ స్థానం గౌరవాన్ని దిగజార్చే స్థాయికి దిగజారలేదు. 

అయితే  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలతో పాటు రాజ్యంగ వ్యవస్థలు రాజకీయం రంగు పులుముకున్నాయి. స్పీకర్ వ్యవస్థ అందుకు మినహాయింపు కాదని ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం పదే పదే రుజువు చేస్తున్నారు. తాజాగా గురువారం (సెప్టెంబర్ 21)న అసెంబ్లీలో తన తీరుతో మరోమారు ఆ విషయాన్ని తమ్మినేని సందేహాలకు అతీతంగా రుజువు చేశారు. స్పీకర్ స్థానలో ఉన్న వ్యక్తిని రాజకీయ పదవుల ఆకాంక్షలు, రాజకీయ వాసనలు వదలకపోతే ఆ  స్థానం విలువ దిగజారుతుంది.  గురువారం(సెప్టెంబర్ 21) ఆంధ్ర ప్రదేశ్  అసెంబ్లీలో అదే జరిగింది. అవును. ఏపీ అసెంబ్లీ స్పీకర్  తమ్మినేని సీతారాం ప్రతిపక్ష సభ్యుని ఉద్దేశించి, ‘వాట్ ఈజ్ దిస్... యూజ్‌లెస్ ఫెలో.. ఎవడ్రా చెప్పాడు నీకు’అంటూ చేసిన వ్యాఖ్యలు విస్మయం కలిగిస్తున్నాయి.

నిజానికి సభ్యులు అదుపు తప్పి  నోరు జారితే మందలించో మరో మార్గంలోనూ సభ్యులను దారికి తెచ్చి,సభను సజావుగా నడిపించాల్సిన పవిత్ర బాధ్యతలో ఉన్న స్పీకరే, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే..? స్పీకర్ గౌరవమే కాదు. సభ గౌరవం కూడా పలచనవుతుంది. ఇప్పటికే దిగజారిన చట్ట సభల ప్రతిష్ట మరింత దిగజారి, పరిహాసం పాలవుతుంది. ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో జరిగింది సరిగ్గా అదే.   

అందుకే తెలుగు దేశం  అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ గురించి సభలో ఎక్కడా వినిపించకూడదని వైసీపీ తీసుకున్న రాజాకీయ నిర్ణయాన్నే, స్పీకర్  ఫాలో అయ్యారా  అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్పీకర్ స్థానాన్ని గౌరవించలేదనే కారణాన్ని చూపుతూ మొదటి రోజు సమావేశాల నుంచి ఏకంగా 15 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాదు మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపైనైతే ఏకంగా ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకూ సస్పెన్షన్ వేటు వేశారు.  

ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయడం ఒక ఎత్తైతే.. అంతకుమించి స్పీకర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసినట్లు చెపుతున్న వ్యాఖ్యలు, స్పీకర్ స్థానం విలువలను పలుచన  చేశాయన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొదలైన తొలి రోజే స్పీకర్ తమ్మినేని సీతారాం చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసించిన టీడీపీ ఎమ్మెల్యేలపై చర్యలకు పూనుకున్నారు. నిజమే తమ నాయకుడి అక్రమ అరెస్ట్ ను జీర్ణించుకోలేని టీడీపీ సభ్యులు ఆవేదనలో ఆగ్రహాన్ని ప్రదర్శించి ఉంటే ఉండవచ్చును. కానీ అలాంటి సమయంలోనే కదా స్పీకర్ విజ్ఞత, వివేచనతో వ్యవహరించ వలసినది. కానీ, స్పీకర్ తమ్మినేసి ఆవేదనతో  ఆగ్రహించిన  సభ్యులను సమాధాన పరిచే ప్రయత్నం   చేయకుండానే  వారిపై  సస్పెన్షన్ వేటు వేశారు.

 స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచేలా కాగితాలు చించివేశారని, మీసాలు మెలివేయడం, తొడలు చరచడం లాంటి వికృత చేష్టలకు పాల్పడ్డారని కారణాలుగా చెప్పారు. కానీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేశారు.  ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి ‘యూజ్‌లెస్ ఫెలోస్’, ‘ఎవడ్రా చెప్పాడు నీకు’ వంటి భాషను వాడడంతో  వేళ్లన్ని ఆయనవైపే చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. స్పీకర్ ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? స్పీకర్ స్థాయి వ్యక్తికి ఇది తగునా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

అనుచితంగా వ్యవహరించిన స్పీకర్‌పై ప్రతిపక్ష తెలుగుదేశం మండిపడింది. ఆయన తీరును ఎక్స్‌ (గతంలో ట్విటర్) వేదికగా ఖండించింది. ఈయన అసలు స్పీకర్ పదవికి అర్హుడేనా? అని నిలదీసింది.  టీడీపీ వాళ్ళని యూజ్ లెస్ ఫెలో అంటారు.. వైసీపీ వాళ్ళని ‘మన వాళ్ళు’ అంటారు’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాం అసెంబ్లీలో మాట్లాడిన వీడియో క్లిప్‌ను కూడా టీడీపీ షేర్ చేసింది. దీంతో స్పీకర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయితే స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఈ విధంగా వ్యవహరించడం కొత్తేమీ కాదని, తన తీరులో మార్పురాదని మరోసారి ఆయనే స్వయంగా చాటి చెప్పారని.. అసెంబ్లీలో జరిగిన సంఘటనలను ఉటంకిస్తూ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక అనుచితంగా ప్రవర్తించారని ఎమ్మెల్యేలపై వేటు వేసిన స్పీకర్ ఇలా మాట్లాడొచ్చా అని సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు. వీటిపై స్పీకర్ స్పందిస్తారో లేదో వేచిచూడాలి మరి.

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.