Publish Date:Jun 22, 2022
ఆటలో గెలుపు ఓటములు సహజం.. జీవితంలో ఎత్తు పల్లాలు సహజం. కష్టం వచ్చిందని, వైఫల్యం ఎదురైందని తనువు చాలించుకునే తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం ఏ మాత్రం సమంజసం కాదు. కింద పడ్డ చోటే లేవాలి. ఓడిపోయిన చోటే గెలిచి నిలవాలి. ముఖ్యంగా ఆటగాళ్లలో సక్సెస్, ఫెయిల్యూర్ ను సమానంగా తీసుకునే క్రీడా స్ఫూర్తి అత్యంత అవసరం. పాకిస్థాన్ కు చెందిన ఓ క్రికెటర్ చిన్న వైఫల్యాన్ని తట్టుకోలేక ఆత్మహత్యా యత్నం చేశాడు.
దక్షిణ సింధ్ ప్రావిన్స్ కు చెందిన క్రికెటర్ షోయబ్ ఓ ఫాస్ట్ బౌలర్. అయితే, సెలక్షన్స్ లో విఫలమై లోకల్ జట్టులో స్థానం లభించలేదు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన షోయెబ్ చేతి మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న షోయెబ్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పాకిస్థాన్ లోనే నాలుగేళ్ల కిందట ఇలాంటిదే మరో సంఘటన జరిగింది. అండర్-19 జట్టులో స్థానం కోల్పోయిన మహమ్మద్ జర్యాబ్ అనే యువక్రికెటర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఏ క్రీడలోనైనా ప్రతి ఆటగాడూ ఏదో సమయంలో వైఫల్యాలను ఎదుర్కొనే ఉంటాడు. ఇది స్థానిక స్థాయిలోనైనా, అంతర్జాతీయ స్థాయిలోనైనా ప్రతి క్రీడాకారుడూ ఎదుర్కొనే పరిస్థితి. క్రికెట్ దేవుడిగా అభిమానుల గుండెల్లో కొలువైన సచిన్ టెండూల్కర్ కూడా ఒక సమయంలో ఫామ్ కోల్పోయి విమర్శలను ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం కింగ్ విరాట్ కోహ్లీ కూడా ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్నాడు.
ఏ క్రీడాకారుడైన సరే.. వైఫల్యం ఎదురైనప్పుడు మనో స్థైర్యంతో దానిని అధిగమించాలే తప్ప.. ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాలకు పాల్పడటం ఎంత మాత్రం సమంజసం కాదు. అసలు క్రీడా రంగాన్ని ఎంచుకోవడం అంటేనే గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే మానసిక స్థైర్యం ఉందనే లెక్క. అలా కాకుండా వైఫల్యానికి కుంగిపోయి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం విచారకరం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/crickter-sucide-attempt--39-138231.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.