Publish Date:Aug 26, 2025
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ నిశ్చితార్ధంపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చాడు. సోషల్ మీడియాలో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ సందర్భంగా ఓ అభిమాని ప్రశ్నకు సమాధానమిస్తూ అర్జున్ టెండుల్కర్ నిశ్చితార్థం జరిగిందని ధృవీకరించి గత కొంత కాలంగా అర్జున్ టెండూల్కర్ వివాహ నిశ్చితార్థ కార్యక్రమంపై అభిమానులలో నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు.
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్ నిశ్చితార్థం ఇటీవలే జరిగిందన్న వార్త ప్రస్తుతం సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఓ ముంబై వ్యాపారవేత్త మనుమరాలు సానియా చందోక్తో అతడి నిశ్చితార్థం జరిగిందని మీడియా వర్గాలు కూడా ధ్రువీకరించాయి. అయితే, ఈ అంశంపై సచిన్ కుటుంబం కానీ, సానియా కుటుంబం కానీ ఇంతవరకూ స్పందించలేదు. ఇది అభిమానుల్లో ఉత్కంఠకు దారితీసింది. అయితే.. ఈ విషయమై సచిన్ టెండుల్కర్ తొలిసారిగా స్పందించారు.
సచిన్ టెండుల్కర్ ఇటీవల సోషల్ మీడియాలో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ నిర్వహించాడు. అభిమానుల ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా సమాధానమిచ్చాడు. ఈ క్రమంలో ఓ అభిమాని అర్జున్ టెండుల్కర్ నిశ్చితార్థం ప్రస్తావన తెచ్చారు. అతడికి ఎంగేజ్మెంట్ అయిన విషయం నిజమేనా అని సచిన్ను ప్రశ్నించాడు. దీనికి ఆయన అవునని సమాధానం ఇచ్చారు. అవును.. ఎంగేజ్మెంట్ జరిగింది. అతడి జీవితంలో ఓ కొత్త అధ్యాయం ఆరంభమైంది. ఇది మాకెంతో ఆనందం కలిగించే అంశమని రిప్లై ఇచ్చారు. తనయుడిపై సచిన్ తొలిసారి స్పందించడంతో ఈ ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది.
ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనుమరాలే సానియా చందోక్. సానియా కుటుంబం.. హాస్పిటాలిటీ, ఆహార ప్రాసెసింగ్ రంగాల్లో పలు వ్యాపారాలు నిర్వహిస్తోంది. ప్రముఖ ఇంటర్కాంటినెంటల్ హోటల్, బ్రూక్లిన్ క్రీమరీ వారివే. ఇక అర్జున్, సానియాల ఎంగేజ్మెంట్ వేడుక అతికొద్ది మంది కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది.
అర్జున్ ప్రస్తుతం క్రికెట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన అర్జున్కు బ్యాటింగ్పైనా పట్టు ఉంది. గోవా తరపున దేశవాళీ క్రికెట్ మ్యాచుల్లో ఆడుతున్నాడు. ఇప్పటివరకూ 17 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 37 వికెట్లు పడగొట్టి 532 పరుగులు చేశాడు. 24 టీ20 మ్యాచుల్లో 27 వికెట్లు పడగొట్టి 119 పరుగులు చేశాడు. 18 లిస్ట్ ఏ మ్యాచుల్లో కూడా ఆడి తన ప్రతిభ నిరూపించుకున్నాడు. ముంబై ఇండియన్స్ తరపున 2023 ఐపీఎల్లో ఆరంగేట్రం చేశాడు. నాలుగు మ్యాచులు ఆడి మూడు వికెట్లు తీశాడు. ఆ తదుపరి సీజన్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cricket-god-sachin-give-clarity-on-his-sons-engagement-39-205065.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.