అనాదిగా నమ్మకాలే రాజ్యం చేస్తున్నాయి. యుగాల నుంచీ తత్వవేత్తలు, తపస్సంపన్నుల మాటే దాదాపు రుజువవుతూ వస్తోంది. చాలాకాలం నుంచి మనం వింటున్నది బ్రహ్మంగారి కాలజ్ఞానం. అందులో ఖచ్చితంగా చెప్పినవాటిలో కొన్ని వాస్త వాలు ఉండవచ్చు. కొన్ని జరిగే ఉండవచ్చు. కానీ జరగడం గమనించానవారు ప్రచారం చేయడంలో కాస్తంత భక్తి ఆవేశంతో అతిగా ప్రచారం చేసి భయపెట్టడం వల్ల క్రమేపీ అలాంటివి నమ్మడం ప్రజల్లో తగ్గింది. వందలు, వేలయేళ్ల క్రితమే లోకంలో జరిగేవి, జరగబోయే చిత్రవిచిత్రాలు, ఘోరాలన్నీ కూడా చాలా కొద్దిమంది చెప్పారు, గ్రంథస్తం కూడా చేశారు. అలా పుస్తక రూపంలో ఉన్నవి అంతగా ఇప్పుడు లభించడం లేదు. కానీ కాలక్రమంలో సాహిత్యంలో అలాంటివి కూడా చోటు చేసు కున్నా యి. చాలామంది జ్ఞానులు, కవులు, రచయితలు రాసిన వాటిలో ఆయా కాలాల చరిత్ర, కొన్ని చిత్ర విచిత్ర అంశా లనూ తెలుసుకుంటున్నాము. ఇటువంటి అంశాల్లో చైనీయులు లోకం దృష్టిని ఎంతగానో ఆకట్టుకున్నారు.
ఇపుడు ప్రపంచదేశాలన్నింటినీ ఒణికిస్తున్నది కోవిడ్ మహమ్మారి గురించి చైనా కవి లీయూ ప్రస్తావించారన్నది ఇటీవల బయటపడింది. ఆయన రాసిన ఒక పద్యంలో దీన్ని గురించినది ఉందని తెలిసింది. ఆయన రాసిన ఒక పద్యంలో ఎలుక , పంది సంవత్సరాల మధ్య భయంకరమైన విపత్తు జరుగుతుందని అంచనా వేయబడింది. చైనీస్ రాశిచక్ర సంవత్సరాల ప్రకారం ఎలుక, పంది సంవత్సరాలు 2019, 2020 అయినందున ఈ అంచనా కరోనావైరస్ మహమ్మారి మూలానికి సమానంగా ఉంటుంది. ముఖ్యంగా, 2019లో చైనీస్ న్యూ ఇయర్ ఫిబ్రవరి 5. ప్రతి చైనీస్ సంవత్సరానికి ఒక జంతువు ప్రతీక. 2019 పంది సంవత్సరం. 2020లో, చైనీస్ న్యూ ఇయర్ జనవరి 25న వచ్చింది పైగా అది ఎలుకల సంవత్స రాన్ని ప్రారంభించింది.
పద్యం ఇంకా ఇలా చెబుతుంది..డ్రాగన్ , పాము సంవత్సరాలలో అన్నీ గడిచిపోతాయి. డ్రాగన్, పాము చైనీస్ రాశిచక్ర గుర్తు లు వరుసగా 2024, 2025 సంవత్సరాలు.
లియు ఒక తావోయిస్ట్ మాస్టర్, దానికి తోడు బాగా తెలిసిన, గౌరవప్రదమైన ప్రధాన మంత్రి. కొంతమంది విమర్శకులు బోవెన్ కవితను వ్రాసినట్లు రుజువు లేదని పేర్కొన్నారు. తన పాలనలో విపత్తులను రక్షించడానికి రాజకీయ సాధనంగా ఉపయో గించుకున్న గుర్తు తెలియని చక్రవర్తి ఈ పద్యం రచించాడని చాలామంది నమ్ముతారు. చక్రవర్తి ఈ పద్యం చట్టబద్ధత ఇవ్వ డానికి బోవెన్ రాసినట్లు పేర్కొన్నాడు. అతని అంచనా నిజమవుతుందో లేదో కాలమే నిర్ణ యిస్తుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/covid-expressed-in-lieu-poem-39-141448.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.