Publish Date:Jun 19, 2022
మంచి సంబంధం చూసి పిల్లలకు పెళ్లి చేయడం, రెండు కుటుంబాలు స్నేహపూర్వకంగా వుండడం అనేది అందరం కోరుకుంటాం. కానీ అనేకానేక కారణాల వల్ల పోనీ దురదృష్టవశాత్తూ విడాకుల వరకూ వస్తే విడిపోవడమే మంచిదనుకుంటున్నారు రెండు కుటుంబాల వారూ. చదువు, మంచి వుద్యోగం, ఆర్ధికంగా నిలదొక్కుకున్నప్పటికీ ఏదో కారణంగా విడిపోయే పరిస్థితులు వస్తే అప్పుడు సాధ్యమయినంతవరకూ రెండు కుటుంబాలూ ఆ విపత్తు నుంచి బయటపడాలనే అనుకుంటాయి.
మొన్నటివరకూ అయితే ఇలా తప్పని స్థితిలో విడిపోవడం సజావుగానే జరిగిపోయింది. విడిపోయినపుడు స్నేహపూర్వకంగానే విడిపోయిన కుటుంబాలూ వున్నాయి. అయితే తీసుకున్న వరకట్నం డిమాండ్ చేయడమన్నది ఎప్పూడూ ఎవ్వరూ చేసిన దాఖలాలు లేవు. కానీ చిత్రంగా మొన్నీమధ్యనే బెంగుళూరుకి చెందిన మహిళ వరకట్నంగా ఇచ్చిన సొమ్ముతో పాటు బంగారు ఆభరణాలు డిమాండ్ చేసి కోర్టు ద్వారా పొందింది. ఈ కేసుకు సంబంధించి కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అబ్బాయి కుటుంబంవారు పెళ్లి సమయంలో తీసుకున్న 9 లక్షల కట్నంతో పాటు బంగారు ఆభరణాలు కూడా తిరిగి ఇచ్చేయాలని తీర్పు నిచ్చింది.
విషయమేమంటే ముంబైకి చెందిన ఓ అబ్బాయి 1998లో బెంగుళూరుకి చెందిన అమ్మాయిని పెళ్లాడాడు. 2001 లో ఇద్దరి మధ్యా విభేదాలు రావడంతో అదే ఏడాది సెప్టెంబర్ 10 ఇద్దరూ విడాకుల కోసం ముంబై హైకోర్టు మెట్లు ఎక్కారు. కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. అంతేకాదు భార్యకు 4 లక్షలు జీవభృతిగా ఇవ్వాలని ముంబై కోర్టు ఆదేశించింది. వరకట్నం డబ్బు, పెట్టిన బంగారం కూడా వెనక్కి ఇవ్వమని అమ్మాయి వాళ్లు అడిగితే అబ్బాయి కుటుంబం వారు తిరస్కరించేరు. దీంతో అమ్మాయి కుటుంబంవారు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎం. నాగప్రసన్న ఏకసభ్య ధర్మాసనం కేసు పూర్వా పరాలు విన్న తర్వాత అబ్బాయి కుటుంబం వరకట్నం డబ్బుతో పాటు పెట్టిన బంగారు ఆభరణాలు తిరిగి అమ్మాయి కుటుం బానికి ఇచ్చేయాల్సిందే అని తీర్పునిచ్చింది.
మరంచేత ఇక మగ పెళ్లివారు చాలా జాగ్రత్త పడాల్సి వుంటుదేమో! పిల్లడు పిల్లతో కడు జాగ్రత్తగా మసలు కోవాలి. ఏమాత్రం విభే దించినా, కొట్టడాలు, తిట్టడాలు అతిగా చేసినా కేసు అయి కోర్టుదాకా వెళితే ఇచ్చినదంతా కక్కాల్సి వస్తుంది. బహుపరాక్!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/court-orders-to-give-back-dowry-25-137964.html
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.