ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణలో మరణిస్తే కారుణ నియామకం కింద అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తారు. మన దేశంలో ఇది చాలా కాలంగా అమలులో ఉంది. ఇలాంటి ఉద్యోగాల్లో ఎక్కువగా తల్లిదండ్రుల నుంచి కొడుక్కి... కుమారులు లేకపోతే కూతురుకు వస్తుంటాయి. కాని తమిళనాడులో మాత్రం ఓ ప్రభుత్వ ఉద్యోగి అకాల మరణంతో.. కారుణ్య నియామకం కింద వచ్చే ఉద్యోగం కోసం కూతురు, కోడలు పోటీ పడ్డారు. పంచాయితీ ఎటూ తేలకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు విన్న మద్రాసు హైకోర్టు ఎట్టకేలకు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చింది.
విలేజ్ అస్టిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్న అరుముగం అనే వ్యక్తి.. 2019లో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన కుమారుడు కూడా గతంలోనే చనిపోయాడు. కూతురు గోమతి భర్త సైతం మృతి చెందగా.. పిల్లలతో సహా ఆమె అరుముగం కుటుంబంతో కలిసి ఉంటోంది. అరుముగం కుమారుడు చనిపోవడంతో.. కోడలు సంగీత జీవనం కూడా కష్టమైపోయింది. దీంతో మామగారి ఉద్యోగాన్ని తనకు ఇప్పించాలని అధికారులను కోరింది. ఇదే సమయంలో తనూ భర్తను కోల్పోయానని కుటుంబ పోషణ భారంగా మారిందని అరుముగం కూతురు కూడా ఈ ఉద్యోగం తనకే కావాలని కోరింది.
అరుముగం ఉద్యోగం కోసం ఒకే కుటుంబంలో వివాదం తలెత్తడంతో అధికారులు ఏమీ చేయలేకపోయారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో గోమతి, సంగీత వేర్వేరుగా మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్ ఎక్ వైద్యనాథన్ విచారించారు. ఈ విషయంలో ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని, ఓ ఒప్పందానికి రావాలని సూచించారు. న్యాయమూర్తి సూచనకు ఇద్దరూ అంగీకరించారు.
కోర్టు సూచనతో సంగీతతో ఒప్పందం కుదుర్చుకుంది అరుముగం కూతురు గోమతి. ఉద్యోగం తనకు ఇస్తే.. ప్రతీనెల వేతనంలో 30 శాతం సంగీతకు ఇస్తానని చెప్పింది. అలాగే, ఆమె పిల్లల చదువు కోసం సంవత్సరానికి రూ.20వేలు ఇచ్చేందుకు అంగీకరించింది. ఇద్దరి మధ్య ఆ ఒప్పందాన్ని న్యాయమూర్తి ఆమోదించారు. దీంతో రెండు పిటిషన్లను కొట్టేశారు జస్టిస్ వైద్యనాథన్. ప్రతీనెలా గోమతి వేతనంలో 30 శాతం కట్ చేసి సంగీత బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేయాలని ఆదేశించారు. మూడు నెలల్లో గోమతిని విధుల్లోకి తీసుకోవాలని ధర్మాసనం తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించారు. రెండేళ్లుగా నడుస్తున్న ఈ వివాదం సామరస్యపూర్వకంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/court-key-judgment-over-daughter-and-sister-in-law-fight-for-job-25-116937.html
police filed murder attempt case on perni kittu, perin kittu, murder attempt case, ap politics
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలలో అందరి దృష్టీ విశేషంగా ఆకర్షిస్తున్న స్థానం ఏదైనా ఉందీ అంటే అది ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం మాత్రమే. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో విజయం నల్లేరు మీద బండి నడకే అని మొదటి నుంచీ అంతా భావిస్తూ ఉన్నారు. అయితే అభ్యర్థి ఎంపికలో జరిగిన జాప్యం కారణంగా చేజేతులా కాంగ్రెస్ ఖమ్మంలో అవకాశాలను చే జార్చుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్ సాధించే స్కోరు జీరో అనే విషయంలో అందరికీ క్లారిటీ వుంది. బీఆర్ఎస్ నాయకులకు
బిఆర్ఎస్ ఎంఎల్సి దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజవర్గం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా 2022లో దండె విఠల్ ఎన్నికయ్యారు.
ఏపీలో బీజేపీ రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తోందా? పేరుకు పొత్తు తెలుగుదేశం, జనసేనతో.. మద్దతు మాత్రం అధికార వైసీపీకే అన్నట్లుగా ఆ పార్టీ తీరు ఉందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా దేశంలో ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తయ్యింది. రెండు దశల పోలింగ్ సరళిని పరిశీలించిన రాజకీయ నిపుణులు ఉత్తరాదిలో, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ భారీగా నష్టపోవడం ఖాయమని గంటాపథంగా చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత వచ్చిన లోకసభ ఎన్నికలు ఆ పార్టీకి సవాల్ గా మారాయి. మరో పదిరోజుల్లో లోకసభ ఎన్నికలు తెలంగాణలో జరుగనున్నాయి
తుని రాజకీయం ఆసక్తి కరంగా మారింది. గెలుపు కోసం....ఇటు టీడీపీ, అటు వైసీపీకి రెండు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అయితే కలిసొచ్చేదెవరికి, అని చూస్తే, ఇక్కడ సామాజిక సమకరణాలు కీలకంగా మారాయి. టీడీపీ, జనసేన పొత్తతో లెక్కలు మారిపోయాయి. నువ్వా నేనా అన్నట్లుగా హోరా హోరీగా పోటీ అయితే కొనసాగుతోంది
ఎట్టకేలకు చిరుత చిక్కింది. శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో ఆరు రోజులుగా సంచరిస్తూ అందరినీ కలవరపెట్టిన చిరుత చివరకు పట్టుబడింది. అటవీ శాఖ అధికారులు అమర్చిన బోనులో ఎరగా వేసిన మేకను తినేందుకు వచ్చి అందులో చిక్కుకుంది. దీంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు ఆ చిరుతను తొలుత నెహ్రూ జూపార్క్ కు తరలించనున్నారు. చిరుత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొనేందుకు దానికి వైద్య పరీక్షలు నిర్వహించనన్నారు. అనంతరం ఒక రోజుపాటు జూ అధికారుల పర్యవేక్షణలో ఉంచనున్నారు. ఆరోగ్యంగానే ఉందని నిర్ధారణ అయ్యాక చిరుతనునల్లమల అడవిలో విడిచిపెడతామని అటవీ శాఖ అధికారులు చెప్పారు.
తెలంగాణలో బిఆర్ఎస్ చచ్చిపోయింది. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం
కడప పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం. ఆ జిల్లాపై ఆ కుటుంబం ఆధిపత్యం. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ కుటుంబం నిట్టనిలువుగా చీలిపోయింది. ఆ ప్రభావం జిల్లాలో ఆ కుటుంబం ఆధిపత్యంపై కూడా పడింది.
దెందులూరులో మరోసారి వైసిపి గుండాల అరాచకం
2014లో ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీని రకరకాలుగా చిత్రహింసలకు గురిచేసి, ఉక్కిరిబిక్కిరి చేసి,