Publish Date:Apr 23, 2022
సమ్మర్ సుర్రుమంటోంది. ఎండకు నోరు ఎండిపోతోంది. దాహం తీరాలంటే.. డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే.. పుచ్చకాయ అయితే సో బెటర్. రోడ్డు పక్కన ఎక్కడ కావాలంటే అక్కడ అమ్ముతుంటారు. ఓ పది రూపాయలు ఇస్తే.. కప్పు ముక్కలు ఇస్తారు. కాయ కావాలంటే 100 పెట్టి కొనాల్సిందే. మండుటెండలో ఆ ఎర్రెర్రని పండును తింటుంటే.. ఆ మజానే వేరు. నీటిశాతం, న్యూట్రిషన్ వ్యాల్యూ కూడా ఎక్కువే కావడంతో హెల్త్కు మంచిదే. ఇదంతా కామనే కానీ.. పుచ్చకాయలకే రారాజు లాంటి పుచ్చకాయ ఒకటుంది. దాని పేరు "డెన్సుకే".
అవును, పేరు వెరైటీగా ఉన్నా.. డెన్సుకే వాటర్మెలన్ చాలా చాలా కాస్ట్లీ. ఇది జపాన్ స్పెషల్ పుచ్చకాయ మరి. పైకి నల్లగా.. గుండ్రంగా.. నునుపుగా ఉంటుంది. లోపల.. ఎర్రటి ఎరుపు. తింటే చక్కెరకంటే తియ్యదనం. రుచిలో అమోఘం. పోషక విలువల్లో ది బెస్ట్. అందుకే అంత డిమాండ్.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుచ్చకాయ డెన్సుకే. క్వాలిటీని బట్టి.. ఒక్కో కాయ రూ.19వేల నుంచి రూ.4లక్షల వరకూ పలుకుతుంది. కొన్నిసార్లు డిమాండ్ మరీ ఎక్కుఉంటే.. వేలంలో అమ్ముతుంటారు కూడా. దీనిపేరిట ఓ గిన్నీస్ రికార్డు కూడా ఉంది.
ఇది కేవలం జపాన్లో కొన్నిచోట్ల మాత్రమే పండుతుంది. అంతర్జాతీయంగా ఫుల్ డిమాండ్ ఉంది. ఉత్పత్తి తక్కువ. ఏటా కొన్ని కాయలు మాత్రమే పండుతాయి. పూత నుంచి కోత వరకు.. ఎంతో జాగ్రత్తగా పెంచాలి. ఖరీదు ఎక్కువ కాబట్టి డెన్సుకే వాటర్మెలన్ను శుభకార్యాల్లో ఖరీదైన బహుమతిగానూ ఇస్తుంటారు. ఈ పుచ్చకాయ నాణ్యతను సూచించేలా దానిపై ఓ లేబుల్ కూడా అతికిస్తారు. ఆ డిటైల్స్ను బట్టి ధర కూడా మారుతుంటుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/costly-densuke-watermelon-39-134855.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది