తెలంగాణలో ఇటీవల సుదీర్ఘ కాలం సాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె పెద్ద ప్రభావమే చూపింది. టీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో కొందరు కార్మికులు కూడా మరణించారు. ప్రభుత్వం వర్సెస్ ఆర్టీసీ కార్మికులు అన్నట్టుగా ఈ పోరాటం సాగింది. ఒకానొక దశలో కార్మికులు సమ్మెకు ముగింపు పలికారు. దసరాకు ముందు నుంచి మొదలైన సమ్మె కాలంలో తాత్కాలిక సిబ్బంది తోనే బస్సులను నడిపింది ఆర్టీసీ యాజమాన్యం. నాడు చర్యలు కాస్త ఉపశమనం కలిగించినా ఆ మధ్య యూనియన్ల నాయకుల సవాళ్లతో మొదలైంది అసలు కథ. సమ్మె కాలంలో నూటికి నూరుపాళ్లు అవినీతి జరిగిందని వారు బలంగా ఆరోపిస్తున్నారు. కొందరు అధికారులు అందినకాడికి దండుకున్నారుని దీనిపై విచారణ జరిపించాలని యూనియన్ నాయకులు చేసిన డిమాండ్లు ఆర్టీసీలో అంతర్గత చర్చకు దారితీశాయి. బిల్లులూ, రసీదులు అసలు లేకపోవటంతో ఆర్టీసీలో ఆ 52 రోజుల లావాదేవీల లెక్క తేలక పోవడం వారి ఆరోపణలకు బలం చేకూరుస్తోందనే గుసగుసులు వినిపిస్తున్నాయి.
అసలే అప్పుడు దసరా పండుగ సీజన్, ఆపై లెక్కాపత్రం లేని వ్యవహారం, అసలు సమ్మె కాలంలో వచ్చినది ఎంత? పోయింది ఎంత? అనే దానిపై అధికారులకు ఇప్పటికే స్పష్టత లేదు. అందుకే అసలు ఏ డిపోలు ఎంత ఆదాయం వచ్చింది, ఎంత మొత్తం ఖర్చయింది ఆ లెక్కలేమిటీ అనే దానిపై ఆర్టీసీలో ఇంటర్నల్ ఆడిటింగ్ చేశారని తెలిసింది. దాదాపు నెల రోజుల పాటు 15 డిపోలో ఆడిటింగ్ నిర్వహించగా అంతటా లెక్కలూ గజిబిజి కనిపించింది. సమ్మె తొలినాళ్లలో తాత్కాలిక కార్మికులు టికెట్ లెస్ కలెక్షన్ లతో బస్సులు నడిపారు. ఈ కారణంగా అసలు ఎంత ఆదాయం వచ్చిందనే దానిపై స్పష్టత కొరవడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మిగతా రోజులకు సంబంధించి కొంత క్లారిటీ ఉన్నప్పటికీ మొత్తంగా చూస్తే ఎక్కడో లెక్క తప్పుతుందనే టాక్ అంతర్గతంగా వినిపిస్తోందని సమాచారం. టీఎస్ ఆర్టీసీలో కొందరు అధికారులైతే సమ్మె కాలంలో అసలు ఆదాయం వచ్చిందెంతో పోయింది ఎంతో ఎవరికి తెలుసు అని నిర్లక్ష్య ధోరణిలో వ్యాఖ్యానిస్తున్నారు. పైగా అప్పుడు కార్మికులు ఎవరూ లేక పోయినా తాత్కాలిక సిబ్బందితో తాము కష్ట పడి పనిచేయించామని అధికారులు తమకు తామే కితాబిచ్చుకున్నారు.
మొత్తం 97 డిపోలలో ఆడిటింగ్ జరిగాక అసలు ఎంత డబ్బు పక్కదారి పట్టింది అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయని ఆర్టీసీ కార్మికులు అనుకుంటున్నారు. అయితే ఈ తతంగ మంతా పూర్తి కావటానికి ఇంకా కొంత కాలం పడుతుందని అయినా అందులో తేలని లెక్కలు జాబితానే ఎక్కువగా ఉంటుందనీ అభిప్రాయపడుతున్నారు. ఇంటర్నల్ ఆడిటింగ్ మొత్తం పూర్తయిన సందట్లో సడేమియాలా ఎవరిదనేది తేలడం కష్టమేనని కూడా భావిస్తున్నారు.మొత్తం మీద ఆర్టీసీ సమ్మె రోజుల్లో నోటి లెక్కల కాలం సాగినందున అసలు లెక్కల ఆధారాల కోసం వెతకటం వృధా అనే అంటున్నారు. ఆడిటింగ్, విచారణల్లో బయటపడుతుందో లేక ఆరోపించినవారే ఆధారాలను బయటపెడతారో తెలియదు కానీ సమ్మె కాలంలో జరిగిన లావాదేవీల్లో అవినీతి అంశం మాత్రం తేలని గజిబిజి లెక్కగానే మిగిలిపోతోంది. పైగా అధికారుల పొంతన లేని మాటలతో ఈ అంశం సమాధానం దొరకని బేతాళ ప్రశ్నలా మిగిలి పోతుందనే వాదనలు ఉన్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/corruption-in-tsrtc-25-92799.html
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.