ఏపీలో పర్యవేక్షణకు సమన్వయ బృందాలు!

Publish Date:Mar 31, 2020

Advertisement

లాక్ డౌన్ పటిష్ట అమలు, నిత్యావసర వస్తువులు సరఫరా,సేవలు పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో సమన్వయ బృందాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేసే ప్రక్రియలో భాగంగా ప్రజలకు వివిధ నిత్యావసర సేవలు అందేలా చూడడం ఇందుకు సంబంధించి ఏమైనా సమస్యలు ఫిర్యాదులు ఉంటే రాష్ట్ర స్థాయిలోని 1902 కంట్రోల్ రూమ్ ద్వారా స్వీకరించి వాటిని సత్వరం పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిల్లో సమన్వయ బృందాలను ఏర్పాటు చేస్తూ జిఓఆర్టి సంఖ్య 223 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.

ఈసమన్వయ బృందాలు లాక్ డౌన్ సక్రమంగా అమలు అయ్యే లి చూడడంతో పాటు ఆ సమయంలో ప్రజలకు వివిధ నిత్యావసర సేవలు సక్రమంగా అందేలా చూస్తుంది.అంతేగాక వివిధ నిత్యావసర వస్తువులు డిమాండ్ ను ముందుగానే అంచనా వేసి ఆయా నిత్యావసర వస్తువులు కూరగాయలు ఆయా ప్రాంతాలకు సరఫరా జరిగేలా ఈసమన్వయ బృందాలు చూస్తాయి.నిత్యావసర వస్తువులు సేవలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఫిర్యాదులు ఉంటే 1902 కంట్రోల్ రూమ్ ద్వారా స్వీకరించి వాటిని రాష్ట్ర,జిల్లా స్పందన కంట్రోల్ రూమ్లు ద్వారా సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ నీలం సాహ్ని ఆ ఆదేశాలలో పేర్కొన్నారు.

పౌరసరఫరాలు, పోలీస్, డైరీ డెవలప్మెంట్, పశుసంవర్థక,మత్స్య, మున్సిపల్, పంచాయతీరాజ్, కార్మిక తదితర శాఖల అధికారులు రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ కు రోజువారీ నివేదికను (Daily Situation Report)సమర్పించాలని సిఎస్ స్పష్టం చేశారు.

సంబంధిత సమన్వయ బృందం ఓవరాల్ ఇన్చార్జి రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ సమన్వయంతో వివిధ నిత్యావసర సేవలు ప్రజలకు సక్రమంగా అందేలా చూడాలని ఆదేశించారు.అదే విధంగా జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్లు కూడా రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ తో సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు.
అదేవిధంగా వివిధ నిత్యావసర వస్తువులు తయారీ,రవాణా, సేవలుకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే అలాంటి సమస్యలు, ఫిర్యాదులను ఈసమన్వయ బృందాలు తెల్సుకుని రాష్ట్ర, జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ లో ద్వారా సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రాష్ట్ర సమన్వయ బృందాలు:
కేంద్ర ప్రభుత్వం,ఇతర రాష్ట్రాలతో  ఓవరాల్ సమన్వయ ఇన్చార్జి  టిఆర్ఆండ్బి ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు ఆయనతోపాటు మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై.మధుసూదనరెడ్డి, మార్కెటింగ్ శాఖ కమీషనర్ ప్రద్యుమ్న,ఎ.శ్రీకాంత్, ఎన్ఫోర్స్మెంట్ ఐజి వినీత్ బ్రిజ్ లాల్,ఐజి లీగల్ హరికుమార్ ఉన్నారు.
అలాగే మాన్యుఫాక్చరింగ్ మరియు నిత్యావసర వస్తువులు సమన్వయ బృందం ఇన్చార్జి గా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఆయనతోపాటు పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం,కార్మిక శాఖ ప్రత్యేక కమీషనర్ రేఖా రాణి,ఎంపి ఫైబర్ సిఇఓ సుమీత్ ఉన్నారు.

నిత్యావసర వస్తువులు సరఫరా రాష్ట్ర, జిల్లా సమన్వయ ఇన్చార్జి గా  పౌరసరఫరాల శాఖ కమీషనర్ కె.శశిధర్ ఆయనతోపాటు ప్రద్యుమ్న,ఉద్యానవన శాఖ కమీషనర్ చిరంజీవి చౌదరి, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హెచ్ అరుణ్ కుమార్, మార్క్ ఫెడ్ ఎండి శ్రీ కేష్ లక్తర్,ఆయిల్ ఫెడ్ ఎండి శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు.

అదేవిధంగా నిత్యావసర వస్తువులు రవాణా పర్యవేక్షణ కు ఇన్చార్జి గా రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ విసి మరియు ఎండి  వై.భాను ప్రకాశ్ ఆయనతోపాటు రవాణా శాఖ కమీషనర్ పి.సీతారామాంజనేయులు,సిఐడి డిజి డా.సిఎం త్రివిక్రమ్ వర్మ, సర్వే శాఖ డైరెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.
స్థానిక సంస్థల్లో నిత్యావసర వస్తువులు,తాగునీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం నిర్వహణ ఇన్చార్జిగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది ఆయనతో పాటు మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఆశాఖ కమీషనర్ జిఎస్ఆర్కె విజయకుమార్, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్,ఎసిబి డిఐజి యం.రవిప్రకాశ్, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు రంజిత్ భాషా ఉన్నారు.

అలాగే స్వచ్చంద సంస్థలు,వాలంటరీ గ్రూపులు,సిఎస్ఆర్ నిధులు సమీకరణ తదితర అంశాలకు ఇన్చార్జి గా సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు కె.హర్షవర్ధన్,బిసి సంక్షేమ శాఖ సంచాలకులు బి.రామారావు,గ్రేహాండ్స్ ఎస్పి రాహుల్ దేవ్ శర్మ ఉన్నారు.

మీడియా మేనేజిమెంట్ ఇన్చార్జి గా సమాచార శాఖ కమీషనర్ టి.విజయకుమార్ రెడ్డి,ఎపిటిఎస్ ఎండి నందకిశోర్,డిఐజి ఎస్పి రాజశేఖర్ బాబు ఉన్నారు.

By
en-us Political News

  
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.