ఆరంభం ఆర్భాటం.. అంతలోనే మంగళం.. జగన్ స్టైల్

Publish Date:Aug 19, 2022

Advertisement

ఆర్భాటంగా ఆరంభించడం... ఆ తరువాత మధ్యలోనే వదిలేయడం ఏపీ సీఎం జగన్ కు బాగా అలవాటైన విద్య. సంక్షేమ పథకాల విషయంలోనైనా, పార్టీ కార్యక్రమాల విషయంలోనైనా ఆఖరికి నియోజకవర్గ సమీక్షల విషయంలోనైనా సరే అదే పంథా. ఎలాంటి మినహాయింపులూ ఉండవు. గడపగడపకూ అంటూ ఆర్భాంగా ప్రారంభించిన కార్యక్రమం ఇప్పుడు అతీగతీ లేకుండా పోయినా దానికి సీఎం జగన్ ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు.

అసలు చాలా మంది ఈ కార్యక్రమం కోసం తమ ఇంటి గడప కూడా దాటలేదన్న ఆరోపణలు ఉన్నా పట్టించుకోవడం లేదు. మొదట్లో మాత్రం గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో చురుకుగా పాలు పంచుకోవడం లేదంటూ ఎమ్మెల్యేలపై చర్రుబుర్రులాడిన జగన్ ఆ తరువాత తత్వం బోధపడి మౌనం వహించారు. మంత్రుల సామాజిక న్యాయభేరి యాత్ర వైఫల్యంపై కూడా జగన్ అంతే నాన్ సీరియస్ గా ఉన్నారు. ఇక ఎమ్మెల్యేలతోనూ, మంత్రులతోనూ లాభం లేదు అంటూ తానే స్వయంగా నడుంబిగించి ప్రారంభించిన  నియోజకవర్గాల సమీక్షల వ్యవహారం కూడా అంతే ఆర్భాటంగా ప్రారంభించి ఓ రెండు నియోజకవర్గాల సమీక్ష నిర్వహించేసి చేతులు దులిపేసుకున్నారు.

ఆ నియోజకవర్గాల సమీక్షలలో తన పాలన గురించి పొగడ్తలు లేకపోవడం.. కార్యకర్తల నుంచి కూడా సమస్యల పరిష్కారం కోసం వినతులు వెల్లువెత్తడంతో ఆయన ఇక ఆ కార్యక్రమానికీ మంగళం పాడేశారు. స్వోత్కర్ష, పర నింద ఆయన స్టైల్. అలాగే తన వద్దకు వచ్చే వారు కూడా విపక్షాలపై విమర్శలు గుప్పించి, తననూ తన పాలననూ పొగడ్తలతో ముంచెత్తితే ఆయన అంగీకరిస్తారు. అందుకు భిన్నంగా సమస్యల ప్రస్తావన తీసుకు వస్తే మాత్రం వారిని దూరం పెడతారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. బాలినేని వంటి వారు పార్టీ విషయంలో అంటీముట్టనట్టుగా వ్యవహరించడానికి కారణం వారు సమస్యలను ప్రస్తావించి అధినేత ఆగ్రహానికి గురి కావడమేనంటున్నారు. ఇక జగన్ కేబినెట్ లో సీనియర్ మంత్రులకు ఉక్కపోతకు కారణం కూడా అదేనంటున్నారు. బొత్స సత్యనారాయణ వంటి సీనియర్లు తన రాజకీయ అనుభవంతో క్షేత్ర స్థాయిలో సమస్యలను ప్రస్తావించేందుకు చేసే ప్రయత్నాలు అధినేతకు రుచించడం లేదని గ్రహించి సైలెంట్ అయిపోయారు.

ఇక ఎమ్మెల్యేల పరిస్థితీ అంతే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లు పైబడిన కాలంలో కనీసం ఒక్కసారి కూడా సీఎంను కలవని ఎమ్మెల్యేల సంఖ్య అధికంగా ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక కార్యకర్తల సంగతి అయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత తక్కువ. నియోజకవర్గ సమీక్షల పేర కార్యకర్తలతో జగన్ భేటీ అవుతారని వారంతా ఎంతో సంతోషించారు. కానీ కుప్పం, రాజాం నియోజకవర్గాల సమీక్షతోనే ఆ కార్యక్రమానికి జగన్ మంగళం పాడేయడంతో కార్యకర్తలు ఉసూరు మన్నారు. క్షేత్ర స్థాయిలో నేతలను ప్రజలు నిలదీస్తున్న సమస్యల విషయం సమీక్షల్లో కార్యకర్తలు ఎక్కడ ప్రస్తావిస్తారో.. వారు ప్రస్తావించిన అంశాలే ఎక్కడ హై లైట్ అవుతాయోనన్న జంకే జగన్ సమీక్షలకు మంగళం పాడేయడానికి కారణంగా పార్టీ శ్రేణులే చెప్పుకుంటున్నాయి. జగన్ వచ్చే ఎన్నికలలో 175 అవుటాఫ్ 175 విన్ గ్యారంటీ అని చెబుతుంటే.. సమీక్షలకు హాజరైన వారు మాత్రం గుంతల రోడ్లు, పథకాల్లో కోత, లబ్డిదారులు సైతం వ్యక్తం చేస్తున్న ఆగ్రహం ఇవే ప్రస్తావిస్తున్న పరిస్థితి.

ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సమీక్షలు కూడా లేకుండా తమ అధినేత సైలంట్ గా ఉండటం పట్ల కార్యకర్తలలో అసంతృప్తి వ్యక్తమౌతున్నది. సమస్యలను అడ్రస్ చేయకుండా ఎన్నికలలో ప్రజలను ఓట్లడిగేందుకు ఎలా వెళ్లగలమని వారు స్థానిక నేతలను నిలదీస్తున్నారు. స్ధానిక నేతలూ ఏం చేయలేని పరిస్థితి. 

By
en-us Political News

  
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సమాజిక మాధ్యవ వేదిక ఎక్స్ లో పెట్టిన పోస్టులో.. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ… రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామన్నారు.
ఆమె నామినేషన్ తిరస్కరణను బీజేపీ పక్కా ప్రణాళికతో చేసిన రాజకీయ కుట్రగా అభివర్ణించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను పావుగా వాడుకుని, ఉద్దేశపూర్వకంగానే మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను అడ్డుకుందని ఆరోపించారు.
ఈ ఆందోళన చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో, ఎలాంటి హింసకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. డిజిటల్ స్క్రీన్‌ల నుండి నేరుగా రోడ్లపైకి వస్తున్న ఈ జెన్-జీ ఉద్యమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.