కాంగ్రెస్ సంక్రాంతి కానుక.. జగన్ మైండ్ బ్లాక్

Publish Date:Jan 17, 2024

Advertisement

పోకిరి అనే సినిమాలో  ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అన్న ఓ పాపులర్ డైలాగ్ ఉంది. ఇప్పుడు షర్మిల ఏపీ పొలిటికల్ ఎంట్రీ జగన్ కు అలా దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే దెబ్బగానే మారింది. ఔను షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం అన్నది జగన్ కు అలాంటి ఇలాంటి దెబ్బ కాదు. వైసీపీ రాజకీయ భవిష్యత్, జగన్ రాజకీయ కెరియర్ ప్రశ్నార్థకంగా మారిపోయేంత చావుదెబ్బగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.  ఔను తెలుగువారికి పెద్ద పండుగ అయిన సంక్రాంతి రోజునే జగన్  పొలిటికల్ కెరియర్ కు ఫుల్ స్టాప్ పెట్టేందుకు కాంగ్రెస్ హై కమాండ్ తొలి అడుగు వేసింది. కనుమరోజున షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించి మలి అడుగు కూడా వేసేసింది. ఇక ఏపీలో  షర్మిల వేసే ప్రతి అడుగూ జగన్ ను, జగన్ పార్టీనీ కొలుకోలేని విధంగా దెబ్బతీసేలాగే ఉంటాయని చెబుతున్నారు. 

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. దీంతో అప్పట్లో  కాంగ్రెస్‌లో చాలా మంది నేతలు,  కార్యకర్తలు జగన్ నేతృత్వంలోని వైసీపిలో గంపగుత్తగా చేరిపోయారు. అదే విధంగా ఏపీలో  కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్ కూడా వైసీపికి దఖలు పడిపోయింది. ఇప్పుడు అంటే దాదాపు పదేళ్ల తరువాత వైఎస్ షర్మిల రూపంలో రాష్ట్ర కాంగ్రెస్ కు మళ్లీ జవసత్వాలు కూడగట్టుకునే అవకాశం లభించింది. వైఎస్ షర్మిల  వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె మాత్రమే కాదు.. ఏపీ సీఎం జగన్ కు తోడబుట్టిన చెల్లి కూడా. దీంతో వైసీపిలో నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు భారీగా ఉండటం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఈ నాలుగున్నరేళ్లలో తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. స్వోత్కర్ష, పరనింద వినా పాలనా పరంగా ఏ రకంగా చూసినా అన్నిందాల విఫలమైన జగన్  పాలనలో ఏ వర్గమూ కూడా హ్యాపీగా లేని పరిస్థితి నెలకొంది. ప్రజా వ్యతిరేకతకు తోడు పార్టీలో కూడా  జగన్ పట్ల అసంతృప్తి కొండలా పేరుకుపోయింది. ముఖ్యంగా నియోజకవర్గంలో పార్టీ ఫేస్ గా ఉండాల్సిన ఎమ్మెల్యేలను డమ్మీలను చేసి వాలంటీర్ల వ్యవస్థను తీసుకురావడం ద్వారా జగన్ క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణాన్నే కుప్ప కూల్చేసుకున్నారు. 

నియోజకవర్గంలో పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యేలా చేసుకున్నారు. ఇప్పుడు అదే వ్యతిరేకతను సాకుగా చూపి ఇష్టారాజ్యంగా అభ్యర్థులను మార్చేస్తున్నారు. దీంతో సిట్టింగులలో తీవ్ర వ్యతిరేతక వ్యక్తం అవుతోంది. ఇంకెంత మాత్రం జగన్ నాయకత్వంలో పని చేసే ప్రశ్నే లేదని బాహాటంగానే చెబుతున్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీలలో అవకాశం లేని వారికి ఇప్పుడు కాంగ్రెస్ డెస్టినేషన్ గా మారింది. ఇప్పటికే  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల వెంటే తన రాజకీయ అడుగులు అని ప్రకటించేశారు. అదే దారిలో  జగన్‌ టికెట్లు ఇవ్వకుండా పక్కన పెట్టేసినవారు, వైసీపిలో ఇమడలేక ఇబ్బంది పడుతున్న సీనియర్ నేతలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇంతకాలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదన్న పట్టుదలతో తెలుగుదేశం, జనసేన కూటమి అడుగులు వేస్తోంది. ఆ దారిలో దాదాపు సక్సెస్ అయ్యింది. ఇప్పుడు వైసీపీ అనుకూల ఓటు షర్మిల ఎంట్రీతో గంపగుత్తగా కాంగ్రెస్ కు దఖలు పడనుంది.  

దీంతో ఏపీలో వైసీపీకి ఓటు అనేదే లేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.   మొత్తంగా కాంగ్రెస్ ఏపీ పార్టీ  పగ్గాలను షర్మిలకు అప్పగించడం ద్వారా జగన్ ను ఎన్నికల యుద్ధంలో ఆస్త్రాలే లేకుండా చేసేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఇప్పటి వరకూ ప్రత్యర్థి పార్టీల నాయకుల వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ, తిట్లూ దూషణలతో విరుచుకుపడిన జగన్ పార్టీకి ఇప్పుడు  షర్మిల రంగంలోకి దిగడంతో నోరెత్తే అవకాశం ఉండదంటున్నారు. ఎందుకంటే జగన్ సొంత చెల్లే అన్నకు వ్యతిరేకంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రాజకీయ విమర్శ అంటే ఏమిటో తెలియని వైసీపీ మూకలకు తమ అధినేత సోదరిపై నోరు పారేసుకునే ధైర్యం ఉండదు. ఒక వేళ తెగించి కువిర్శలు చేసినా.. అందుకు దీటుగా బదులివ్వడానికి షర్మిల ఇసుమంతైనా వెనుకాడరు. ఈ పరిస్థితుల్లో జగన్ , ఆయన పార్టీ నేతలు తెలుగుదేశం, జనసేనలపై అనుచిత విమర్శలు చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. అన్నిటికీ మించి తన పాలనా వైఫల్యాలను సొంత సోదరి ఎత్తి చూపుతుంటే.. సమాధానం చెప్పుకుని, వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితిలో జగన్ ఇప్పుడు ఉన్నారు. సో షర్మిల ఎంట్రీతో జగన్ అండ్ కో పూర్తిగా డిఫెన్స్ లో పడిపోవడం ఖాయం. ఇప్పటి వరకూ గుడ్డ కాల్చి ముఖం మీద వేసి తుడుచుకోండి అన్న చందంగా ఇష్టారీతిగా విమర్శలతో , దూషణలతో చెలరేగిపోయిన జగన్ పార్టీకి ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జ్ గా షర్మిల సంధించే విమర్శలు, ప్రశ్నలకు సమాధానం ఇచ్చుకోవడం వినా, ప్రతి విమర్శ చేయడానికి కానీ అవకాశం ఉండదు. ఇంతకాలం తెలుగుదేశం, జనసేనలు విమర్శలను జగన్మోహన్‌ రెడ్డి, వైసీపి నేతలు చాలా తేలికగా కొట్టిపడేస్తున్నారు. కానీ ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి సొంత చెల్లెలు వైఎస్ షర్మిల చేయబోయే విమర్శలు, ఆరోపణలను అలా కొట్టిపారేయడానికి అవకాశం ఉండదు. వాటికి సమాధానాలు చెప్పుకోవాలి?  ఇంతకాలం ఎన్టీఆర్‌ కుటుంబంలో చిచ్చు పెట్టి ఆనందించిన జగన్మోహన్‌ రెడ్డికి ఇప్పుడు సొంత చెల్లెలే తిరగబడి నిలదీసే పరిస్థితి రావడం చూస్తుంటే చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవా అన్న సామెత గుర్తుకు వస్తున్నది.

అహంకారం, అధికార మదంతో నాలుగేళ్ల పాటు ఇష్టారీతిగా చెలరేగిపోయిన జగన్ కు ఇప్పుడు అడుగు వేయాలన్నా, అడుగు కదపాలన్నా నేలకింద భూమి కదిలిపోతున్న ఫీలింగ్ వచ్చే పరిస్థితి ఉత్పన్నమైంది. ప్రజలలోకి వెళ్లాలంటే రోడ్లకు ఇరువైపులా పరదాలు కట్టుకుని వెళ్లే పరిస్థితి నుంచి షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చారని అంటున్నారు. 

By
en-us Political News

  
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
ప్రజాస్వామ్య విలువలతో కూడిన పాలనకు, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాంటి అరమరికలూ లేకుండా మిత్రధర్మాన్ని తప్పకుండా నడపిన వాజ్ పేయి స్ఫూర్తిగా ముందుకు సాగాలన్న సంకేతాన్ని ఈ విగ్రహావిష్కరణ ద్వారా చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.