Publish Date:May 29, 2023
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఓన్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. తెలంగాణ ఏర్పడిన 9 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలిసారి అమెరికాలో తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ వేడుకలను నిర్వహించనుంది. దీనికి ముఖ్య అతిథిగా ఎఐసీసీ నేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చినప్పటికీ ఆ క్రెడిట్ బిఆర్ఎస్ కు వెళ్లిందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే తెచ్చింది మాత్రం బిఆర్ఎస్ అని ప్రచారం చేసుకుంటుంది.
వచ్చే నెల రెండున అమెరికా టెక్సాస్ లో జరిగే వేడుకలకు రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొంటున్నారు. ప్రభుత్వ నిధులతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకుంటుందని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. ఇటీవలె కర్ణాటక ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. తెలంగాణలో ఆ పార్టీ బలం పెరిగింది. కర్ణాటక సరిహద్దు జిల్లాలలో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఎక్కువయ్యాయి. కాస్తా కష్టపడితే బిఆర్ఎస్ ను దెబ్బతీయడం సులభమేనని కాంగ్రెస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
పిల్ల పుట్టి తల్లి చచ్చినట్టు తెలంగాణ పుట్టి కాంగ్రెస్ చచ్చినట్టు మారింది. ఇటు తెలంగాణలో, అటు ఆంధ్ర ప్రదేశ్ తుడిచిపెట్టుకుపోయింది. వరుసగా రెండు పర్యాయాలు బిఆర్ ఎస్ అధికారంలో రావడాన్ని కాంగ్రెస్ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.
ఇదిలా ఉండగా బిఆర్ఎస్ దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటుంది. తాము కూడా బీఆర్ఎస్ కు పోటీగా తెలంగాణ ఆవిర్బావ దినోత్సవాలను జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. సోనియాగాంధీని ముఖ్య అతిథిగా హజరుఅయ్యేలా కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నాలు ప్రారంభించాయి. జూన్ రెండున హైదరాబాద్ లో బహిరంగ సభ నిర్వహించాలని చూస్తోంది. కర్ణాటక సీఎం సిద్ద రామయ్య, డిప్యూటి సీఎం డికె శివకుమార్ ను ఈ సభకు రప్పించాలని చూస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/congress-plans-formation-day-celebrations-25-156032.html
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
Publish Date:Aug 31, 2026
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న రాజకీయ సమీకరణాలపై చర్చోపచర్చలు మొదలయ్యాయి.