రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నేతల పోరాటమా? హవ్వ!

Publish Date:Feb 7, 2015

Advertisement

 

మళ్ళీ చాలా కాలం తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కలుగుల్లో నుండి ఎలకల్లా బిలబిలా బయటకు వచ్చి కోటి సంతకాల కార్యక్రమం అంటూ హడావుడి చేయడం మొదలుపెట్టారు. ఇంతకాలం రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఒక్కరే పార్టీ ఉనికిని చాటేందుకు నానా తిప్పలు పడుతుంటే ఏనాడూ కనబడని బొత్స సత్యనారాయణ, చిరంజీవి, పనబాక లక్ష్మి, కేవీపీ రామచంద్ర రావు వంటి అనేకమంది కాంగ్రెస్ నేతలు మళ్ళీ బయటకి వచ్చి హడావుడి చేస్తున్నారు. తమ యూపీయే ప్రభుత్వం విభజన సందర్భంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో సహా ఇచ్చిన అన్ని హామీలను ఇంతవరకు అమలుచేయకుండా బీజేపీ మోసం చేస్తుంటే, దానికి మిత్రపక్షమయిన తెదేపా పట్టనట్లు ఊరుకోందని, కానీ అన్ని హామీలను అమలుచేసే వరకు తాము వాటిని వదిలిపెట్టబోమని ప్రకటించారు.

 

తెలంగాణా రాష్ట్రంలో గెలిచేందుకే ఏపీలో తమ పార్టీని పణంగా పెట్టి మరీ రాష్ట్ర విభజన చేసామని టీ-కాంగ్రెస్ నేతలు చెప్పుకొంటున్నారు. అంటే తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విడదీయడానికి, చివరికి తమ స్వంత పార్టీ నేతల భవిష్యత్ ని పణంగా పెట్టడానికి కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకాడదని వారే చాటుకొంటున్నారు. అటువంటప్పుడు ఎన్నికలలో గెలిచేందుకే యూపీయే ప్రభుత్వం అనేక భూటకపు వాగ్దానాలు చేసిందని వేరేగా చెప్పనవసరం లేదు.

 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆమోదం అవసరమని, ఒక రాష్ట్రానికి ఇస్తే దాని కోసం చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న మిగిలిన 8 రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా కోరుతాయి కనుక అది అసాధ్యమనే సంగతి కాంగ్రెస్ అధిష్టానికి తెలియదనుకోలేము. అయినా కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది అంటే అది ప్రజలను మభ్యపెట్టి వారి ఓట్లు పొందేందుకేనని అర్ధం అవుతోంది.

 

ఇప్పుడు ఎలాగూ తమ పార్టీ అధికారంలో లేదు కనుక రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎన్ని డిమాండ్లయినా చేయగలరు. కానీ రాజ్యసభలో ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ యంపీ జై రామ్ రమేష్ ఒక్కరే ఎన్డీయే ప్రభుత్వంతో పోరాడుతున్నప్పుడు చిరంజీవి, కేవీపీ తదితరులు ఆయనతో ఎందుకు గొంతుకలపలేదు? అనే ప్రశ్నకు వారు జవాబు చెపితే బాగుంటుంది.

 

ఇక చంద్రబాబు నాయుడు కేంద్రంపై నిధుల కోసం, ప్రాజెక్టుల అనుమతుల కోసం ఒత్తిడి చేయడంలేదనే వాదన అర్ధరహితం. ఆయన ముఖ్యమంత్రి గా బాధ్యతలు చెప్పట్టక ముందు నుండి నేటి వరకు కూడా అనేకమార్లు డిల్లీకి వెళ్లి ప్రధానితో సహా కేంద్రమంత్రులు అందరినీ కలిసి వారిపై ఒత్తిడి చేస్తున్నారు. మళ్ళీ రేపు కూడా మరోమారు అదే పనిమీద డిల్లీ వెళుతున్నారు. ఆయన ఇందుకోసమే ప్రత్యేకంగా డిల్లీలో రాష్ట్రం తరపున ప్రత్యక ప్రతినిధిగా కంబంపాటి రామ్మోహన్ రావును నియమించిన సంగతి అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా కేంద్రంపై నిరంతరం ఒత్తిడి చేస్తుండటమే కాకుండా, రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు, యంపీల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే అన్నీ రాత్రికి రాత్రే సాధ్యం కాదు కనుక క్రమంగా ఒకొక్క హామీని నెరవేర్చుకొంటూ వస్తున్నారు.

 

తెదేపా-బీజేపీలు మిత్రపక్షాలుగా ఉన్నంత మాత్రాన్న ఈ ఆర్ధిక, సాంకేతిక సమస్యలన్నిటినీ పక్కనబెట్టి మోడీ ప్రభుత్వం రాష్ట్రంపై నిధుల వర్షం కురిపించేయలేదు. ఒకవేళ మళ్ళీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చినా తను చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలుచేయలేదని అందరికీ తెలుసు. ఎందుకంటే గత పదేళ్ళుగా కేంద్రంలో, తనకు కంచుకోట వంటి అవిభాజ్య ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఏమీ విదిలించలేదు. పైగా తన రాజకీయ ప్రయోజనాల కోసం బలమయిన రాష్ట్రాన్ని హడావుడిగా రెండు ముక్కలు చేసి చేతులు దులుపుకొని వెళ్లిపోయింది. అందుకు ఆంద్ర ప్రజలు భారీ మూల్యం చెల్లిస్తున్నారిప్పుడు.

 

రాష్ట్ర ప్రభుత్వం చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితిలో లక్షల కోట్లు ఖర్చుచేసి రాజధాని నిర్మించుకోవలసి వస్తోంది. కాంగ్రెస్ హయాంలో ఏనాడు వినబడని మెట్రో రైల్ నిర్మాణం, రైల్వే జోన్ ఏర్పాటు, ఐ.ఐ.టి. ఐ.ఐ.యం. ఎయిమ్స్ వంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఇప్పుడు తెదేపా-బీజేపీలు అధికారంలోకి వచ్చేకనే ఆచరణ సాధ్యం కాబోతున్నాయి వాటి మధ్య ఉన్న సఖ్యత కారణంగానే ఇవ్వన్నీ సాధ్యం అవుతున్నాయి.

 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినా అంతకు ఏ మాత్రం తీసిపోని విధంగా అన్ని విధాల సహాయం చేస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పదేపదే చెపుతున్నారు. మొన్న విడుదల చేసిన ఆర్ధిక సహాయం కేవలం ఆరంభం మాత్రమేనని విస్పష్టంగా చెపుతున్నారు. తమ పార్టీ కూడా రాష్ట్రంలో బలపడాలని భావిస్తున్నప్పుడు ఆయన ప్రజలను మభ్యపెట్టే సాహసం చేస్తారని ఎవరూ అనుకోరు.

 

కేంద్ర సహాయం అందడంలో కొంత జాప్యం అవుతున్న మాట వాస్తవమే. కానీ దానర్ధం కేంద్రం ఇక సహాయం చేయదని కాదు. రాష్ట్ర ప్రజలందరూ ఇవ్వన్నీ గమనిస్తూనే ఉన్నారు. కానీ కాంగ్రెస్ నేతలే గమనించనట్లు నటిస్తూ దీనిని కూడా తమ రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని హడావుడి చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు వారికి ఎన్నికలలో తగిన గుణపాటం నేర్పించినా వారు మారలేదు, మారబోరని మరోమారు రుజువు చేస్తున్నరిప్పుడు. చేసిన తప్పులను ఒప్పుకోకుండా రాష్ట్రానికి సహాయం చేస్తున్న బీజేపీని, దానిని అభివృద్ధి చేయాలని తపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే నష్టపోయేది కాంగ్రెస్ నేతలేనని గ్రహిస్తే మంచిది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.