కాంగ్రెస్ మంకు పట్టుకి పార్లమెంటు సమావేశాలు బలి

Publish Date:Aug 3, 2015

Advertisement

 

పార్లమెంటు సమావేశాలు జరుగకుండా అడ్డుకోవడమే తమ పార్టీ ఈసారి అనుసరించబోయే వ్యూహమని ఆ పార్టీ ఎంపీ శశీ ధరూర్ సమావేశాలు మొదలయిన రోజే మీడియాకి లీక్ చేసి సోనియాగాంధీ చేత చివాట్లు తిన్నారు. ఆ రహస్యం బయటపడిన తరువాతయినా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహం మార్చుకొనే ప్రయత్నం చేయకుండా వ్యాపం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, లలిత్ మోడీ కేసులో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలు రాజీనామా చేసే వరకు ఉభయ సభలను జరగనీయకుండా అడ్డుపడుతోంది. ఈనెల 13తో ఈ పార్లమెంటు సమావేశాలు ముగుస్తాయి. గత రెండు వారాలుగా కాంగ్రెస్ మిత్ర పక్షాలు ఉభయ సభలను నడవనీయకుండా అడ్డుపడుతుండటంతో ఈసారి పార్లమెంటులో ఒక్క బిల్లుపై కూడా చర్చ జరగలేదు. ఆమోదం పొందలేదు. వారు ముగ్గురు రాజీనామా చేస్తేనే సభను సజావుగా నడవనిస్తామని కాంగ్రెస్ వాదిస్తుంటే, సభను నడవనిస్తే వారి ముగ్గురిపై లేవనేతిన అభియోగాలపై చర్చిద్దామని మోడీ ప్రభుత్వం వాదిస్తోంది.

 

ఈ ప్రతిష్టంభనను తొలగించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి యం. వెంకయ్య నాయుడు ఈరోజు పార్లమెంటు సెంట్రల్ హాల్లో అఖిలపక్ష ఎంపీల సమావేశం నిర్వహించారు. కానీ కాంగ్రెస్ మంకుపట్టు పట్టడంతో ఈ సమావేశంలో ఎటువంటి పరిష్కారం లభించలేదు. కనుక మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల నుండి మొదలయిన పార్లమెంటు సమావేశాలలో కాంగ్రెస్ మిత్రపక్షాలు మళ్ళీ ఆందోళనకి ఉపక్రమించాయి. భూసేకరణ బిల్లుకి సవరణలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ మిత్రపక్షాలు ఇదివరకు దానిపై పార్లమెంటులో లోతుగా చర్చించాలని వాదించాయి. కానీ ఇప్పుడు ఏ ఒక్క బిల్లు కూడా ఎటువంటి చర్చా లేకుండానే మూజువాణి ఓటుతో ఆమోదింపబడే పరిస్థితి ఏర్పడింది.

 

ఒకవేళ సుష్మ స్వరాజ్, వసుందర రాజే ఇరువురూ కూడా లలిత్ మోడీకి వీసా వచ్చేందుకు సహకరించి ఉండి ఉంటే, అది తప్పే. అదే విధంగా అనేకమంది మృతికి కారణమయిన వ్యాపం కుంభకోణంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాత్ర ఉంటే ఆయన శిక్షార్హుడే. కానీ వారు రాజినామాల కోసం పట్టుబడుతూ పార్లమెంటును స్తంభిప జేయడం ఇంకా పెద్దతప్పు. బాధ్యతారాహిత్యమే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా తన రాజకీయ ప్రయోజనాల గురించే ఆలోచిస్తుంది తప్ప ప్రజల గురించి, పార్లమెంటులో తన బాధ్యతల గురించి ఆలోచించకపోవడం చాలా శోచనీయం. పైగా తమ డిమాండ్లు నేరవేరుస్తే తప్ప పార్లమెంటుని సజావుగా సాగానీయమని కేంద్రప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడం మరో తప్పు. ప్రజా సమస్యల గురించి చర్చించవలసిన పార్లమెంటులో కూడా కాంగ్రెస్ పార్టీ ఈవిధంగా రాజకీయాలు చేయడాన్ని యావత్ దేశ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. తమని ప్రజలు ఎందుకు తిరస్కరించారో ఆత్మవిమర్శ చేసుకొని తమ తప్పులను సరిదిద్దుకొంటామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అసలు అటువంటి ప్రయత్నమేదీ చేయనే లేదని నిరూపిస్తోంది.

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.