కాంగ్రెస్ మంకు పట్టుకి పార్లమెంటు సమావేశాలు బలి

Publish Date:Aug 3, 2015

Advertisement

 

పార్లమెంటు సమావేశాలు జరుగకుండా అడ్డుకోవడమే తమ పార్టీ ఈసారి అనుసరించబోయే వ్యూహమని ఆ పార్టీ ఎంపీ శశీ ధరూర్ సమావేశాలు మొదలయిన రోజే మీడియాకి లీక్ చేసి సోనియాగాంధీ చేత చివాట్లు తిన్నారు. ఆ రహస్యం బయటపడిన తరువాతయినా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహం మార్చుకొనే ప్రయత్నం చేయకుండా వ్యాపం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, లలిత్ మోడీ కేసులో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలు రాజీనామా చేసే వరకు ఉభయ సభలను జరగనీయకుండా అడ్డుపడుతోంది. ఈనెల 13తో ఈ పార్లమెంటు సమావేశాలు ముగుస్తాయి. గత రెండు వారాలుగా కాంగ్రెస్ మిత్ర పక్షాలు ఉభయ సభలను నడవనీయకుండా అడ్డుపడుతుండటంతో ఈసారి పార్లమెంటులో ఒక్క బిల్లుపై కూడా చర్చ జరగలేదు. ఆమోదం పొందలేదు. వారు ముగ్గురు రాజీనామా చేస్తేనే సభను సజావుగా నడవనిస్తామని కాంగ్రెస్ వాదిస్తుంటే, సభను నడవనిస్తే వారి ముగ్గురిపై లేవనేతిన అభియోగాలపై చర్చిద్దామని మోడీ ప్రభుత్వం వాదిస్తోంది.

 

ఈ ప్రతిష్టంభనను తొలగించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి యం. వెంకయ్య నాయుడు ఈరోజు పార్లమెంటు సెంట్రల్ హాల్లో అఖిలపక్ష ఎంపీల సమావేశం నిర్వహించారు. కానీ కాంగ్రెస్ మంకుపట్టు పట్టడంతో ఈ సమావేశంలో ఎటువంటి పరిష్కారం లభించలేదు. కనుక మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల నుండి మొదలయిన పార్లమెంటు సమావేశాలలో కాంగ్రెస్ మిత్రపక్షాలు మళ్ళీ ఆందోళనకి ఉపక్రమించాయి. భూసేకరణ బిల్లుకి సవరణలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ మిత్రపక్షాలు ఇదివరకు దానిపై పార్లమెంటులో లోతుగా చర్చించాలని వాదించాయి. కానీ ఇప్పుడు ఏ ఒక్క బిల్లు కూడా ఎటువంటి చర్చా లేకుండానే మూజువాణి ఓటుతో ఆమోదింపబడే పరిస్థితి ఏర్పడింది.

 

ఒకవేళ సుష్మ స్వరాజ్, వసుందర రాజే ఇరువురూ కూడా లలిత్ మోడీకి వీసా వచ్చేందుకు సహకరించి ఉండి ఉంటే, అది తప్పే. అదే విధంగా అనేకమంది మృతికి కారణమయిన వ్యాపం కుంభకోణంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాత్ర ఉంటే ఆయన శిక్షార్హుడే. కానీ వారు రాజినామాల కోసం పట్టుబడుతూ పార్లమెంటును స్తంభిప జేయడం ఇంకా పెద్దతప్పు. బాధ్యతారాహిత్యమే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా తన రాజకీయ ప్రయోజనాల గురించే ఆలోచిస్తుంది తప్ప ప్రజల గురించి, పార్లమెంటులో తన బాధ్యతల గురించి ఆలోచించకపోవడం చాలా శోచనీయం. పైగా తమ డిమాండ్లు నేరవేరుస్తే తప్ప పార్లమెంటుని సజావుగా సాగానీయమని కేంద్రప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడం మరో తప్పు. ప్రజా సమస్యల గురించి చర్చించవలసిన పార్లమెంటులో కూడా కాంగ్రెస్ పార్టీ ఈవిధంగా రాజకీయాలు చేయడాన్ని యావత్ దేశ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. తమని ప్రజలు ఎందుకు తిరస్కరించారో ఆత్మవిమర్శ చేసుకొని తమ తప్పులను సరిదిద్దుకొంటామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అసలు అటువంటి ప్రయత్నమేదీ చేయనే లేదని నిరూపిస్తోంది.

By
en-us Political News

  
సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక సిట్ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జగన్ సన్నిహితులనే కాదు జగన్ ను కూడా వణికిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.