కాంగ్రేసుకి అఖిలంతోనే సఖలం

Publish Date:Dec 6, 2012

Advertisement

 

దేశానికి సమర్ధమయిన పరిపాలన అందించని కాంగ్రేసు పార్టీని ఎంతయినా తప్పుపట్టవచ్చును కాని, మిగిలిన విషయాలలో దానికున్న నైపుణ్యాలని ఎవరు వేలెత్తి చూపలేరు. ఎంత పెద్ద కుంభకోణాలలో దొరికిపోయినా టీవిగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, ప్రజలని మభ్యపెట్టి మరిపించేయగలదు. అందుకు తగ్గట్టుగానే, ప్రజలూ కూడా ఎంత పెద్ద కుంభకోణమయినా ఇదివరకులాగ అంతగా పట్టించుకోవడం మానేసిన సంగతి గుర్తించిన కాంగ్రెస్ నిర్భయంగా తనపని తానూచేసుకుపోతోంది.

 

ఇక, విషయాని కొస్తే హటాత్తుగా తన అమ్ముల పొదిలోంచి ‘అఖిల పక్షం’ అనే సమ్మోహనాస్త్రాన్ని తీసి సమయోచితంగా సందించి తెలంగాణా యమ్పీలను తన దారికి తెచ్చుకోవడమే గాకుండా, తెలంగాణాలో తనకున్నకాస్త పరువునీ కొల్లగొడుతున్న చంద్రబాబు, వైయ్యసార్ పార్టీలను ఒకేసారి కంగు తినిపించగలిగింది. ఒక దెబ్బకి రెండు...కాదు...కాదు...మూడు పిట్టల్ని కూల్చేసింది. ఒకేఒక దెబ్బకి తన తెలంగాణా యమ్పీలను దారికి తెచ్చు కోవడమే గాక తే.దే.పా., వైయ్యసార్ పార్టీలకూ అగ్ని పరీక్ష పెట్టి ఆలోచించుకోవడానికి సమయం లేకుండా ఈ నెల 28నే అఖిల పక్షం అని ముహూర్తం కూడా పెట్టేసింది. తన చాణక్యనీతి ఎంత గొప్పదో ఈ దెబ్బతో అందరికీ తెలియజేసింది.

 

ఆదెబ్బకి మొదట విలవిలలాడుతున్నది తే.దే.పా. అని వేరే చెప్పనవసరం లేదు. ఇంత వరకు తన ‘రెండు కళ్ళ సిద్దాంతము’తో ఎలాగో మెల్లగా నెట్టుకొచ్చేస్తున్న తే.దే.పా.ఇప్పుడు తప్పని సరిగా తన మనసులో మాట చెప్పవలసిన పరిస్తితి ఏర్పడింది. గత కొన్ని రోజులుగా తెలంగాణాలో పర్యటిస్తున్న చంద్రబాబు ఇంతవరకు రోజు అక్కడి ప్రజలతో తానూ తెలంగాణా వ్యతిరేఖిని కానని నొక్కి జెప్పుతూ, ఒక వేళ కాంగ్రేసు గాని తెలంగాణా ఇచ్చేమాటయితే తానూ అడ్డు చెప్పబోనని కూడా పదే పదే ప్రజలకి వాగ్దానం చేస్తూ వచ్చేడు. అంతే గాక, తానూ ఈ విషయమై కాంగ్రేసుకి లేఖ వ్రాసినప్పటికీ తన దగ్గిరనుండి ఇంత వరకు ఎటువంటి సమాధానం రాలేదని, తెలంగాణా పట్ల తనకున్న చిత్తశుద్ధి కాంగ్రెస్కు లేక పోవడం వల్లే అలాగ సాగాదీస్తోందనీ తెలంగాణా ప్రజలకి సవివరంగా చెపుతూ తనదయిన పద్దతిలో ముందుకు సాగిపోతున్నప్పుడు, కాంగ్రెస్, తన హట్టాత్ ప్రకటనతో చంద్రబాబుని తెలంగాణాలో ఉండగానే అతని మాటలతోనే అతనిని బంధించింది.

 

తెలంగాణా విషయంలో కాంగ్రెస్ ఏమి చేస్తుందనేది అప్రస్తుతం. గాని ఆ విషయంలో చంద్రబాబు ఏమి చెప్పబోతున్నడనేదదే ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది. ఒకవేళ తెలంగాణాకి వ్యతిరేఖంగా మాట్లాడితే, ఇప్పటికే తే.రా.సా., తల్లీ పిల్ల కాంగ్రేసులు ప్రచారం చేస్తున్న ‘చంద్రబాబు నమ్మ దాగిన వ్యక్తీ కాడు” అనే మాటలు నిజం చేసిన వాడవుతాడు. తద్వారా కేవలం తెలంగాణాలోనే గాకుండా, రాష్ట్రం మొత్తం ఆ సంగతి ప్రచారం చేసుకొనేందుకు తే.రా.సా., తల్లీ పిల్ల కాంగ్రేసులకు చేతులారా అవకాశం ఇచ్చినట్లవుతుంది. అంతేగాక, ఆదెబ్బతో తెలంగాణాలో తే.దే.పా. తుడుచుపెట్టుకు పోయినా ఆశ్చర్య పోనక్కరలేదు. ఎందుకంటే, పార్టీలో ఇంతకాలం ఇబ్బందిగా కొనసాగుతున్న తెలంగాణా నేతలు, తమ రాజకీయ భవిష్యత్తు కోసమయినా పార్టీని విడువక మానరు. అప్పుడు, తే.దే.పా.కు తెలంగాణాలో పార్టీని మళ్ళీ పునర్ నిర్మించుకోవడం సాధ్యం కాని పని. గనుక, ‘అఖిలంలో’ చంద్రబాబు ‘జై తెలంగాణా’ అనక తప్పదు.

 

అప్పుడు, పార్టీలో రెండోవర్గాన్ని ఎలాగ సముదాయిన్చగలడు? అనే ప్రశ్నవస్తుంది. కానీ, తెలంగాణా సమస్యతో రాజకీయ అస్తిరత ఎలాగ ఉంటుందో, అది తమ రాజకీయ జీవితాలని ఎంతగా ఇబ్బంది పెడుతోందో అనుభవపూర్వకం గ్రహించిన సీమంద్ర నేతలను ఇప్పుడు మాత్రమె ఒప్పించడము సులువు అని చంద్రబాబుకి తెలిసే ఉంటుంది. చంద్రబాబు ‘జై తెలంగాణా’ అన్నపుడు మిగిలిన పార్టీలకి అంతకన్నా మరో దారి, అవకాశం, అవసరము లేదు, ఉండదు. అందువల్ల ‘అఖిలంలో’ తే.దే.పా. సై అన్నప్పుడు, తరువాత సహజంగా కాంగ్రేసు వంతువస్తుంది. ప్రస్తుత పరిస్తితుల్లో వెంటనే తెలంగాణా గాని ఇచ్చేసే అవకాశం ఎటూ లేదు గనుక, కోడి గుడ్లు పొదిగినట్లు కాంగ్రెస్ తెలంగాణా అంశాన్ని కూడా 2014 ఎన్నికలవరకూ వరకు పొదుగుతూ కూర్చొని, అప్పుడు ఎన్నికలముందు ఏదో ఒకసానుకూల ప్రకటన చేసేసి తెలంగాణా ఓట్లు తన ఖాతాలో జమ చేసుకొనే ప్రయత్నం చేయవచ్చు.

 

పనిలో పనిగా, ఇప్పటికీ సిద్దంగా ఉన్న తే.రా.సా.ను, తన పిల్ల కంగ్రేసునీ కూడా తనలో కలిపెసుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అప్పుడు, మళ్లీ ఒక దెబ్బకి ఎన్ని పిట్టలో లెక్కబెట్టడం ఎవరితరమూ కాదు. కాకి లెక్కలు కట్టుకొన్నా, రాష్ట్రంలో తిరిగి అధికారం చేజిక్కించుకోవడం, తలనొప్పిగా మారిన తే.రా.సా. పిల్ల కాంగ్రేసులను లొంగదీసుని తన స్వంత ఆయుధాలుగా మార్చుకొని తే.దే.పా.ను తుడిచి పెట్టేసి రాష్ట్రాన్ని ఏక చత్రదిపత్యంగా పరిపాలిన్చేసుకోవడం, ‘తెలంగాణా ఇచ్చేది తెచ్చేది మేమే’ అన్న మాట నిలబెట్టుకొన్నఘనకీర్తీ, రాష్ట్రంలో మళ్లీ ప్రశాంతత తెచ్చమనే గొప్పలు చెప్పుకొనే అవకాశం పొందడం, ఆనక తాపిగా కావలిసినన్ని కుంభకోణాలు చేసుకొనే అవకాశం...ఇలాగ చెప్పుకుపోతే వాటికి అంతే ఉండదు.

 

ఇక, విభజనలో పీటముడి పడిన ఒకేఒక అంశం ‘హైదరాబాద్ ఎవరి సొంతం?” అనేది. ఒక పదేళ్ళో పదిహేనేళ్లో ‘కామన్ క్యాపిటల్’ చేసిపడేస్తే అప్పటి సంగతి అప్పుడు చూసు కోవచ్చుననే ఒక ‘ఆప్షన్’ ఎలాగు ఉంటుంది గనుక, ఆ సమస్యా ఇక తీరిపోయినట్లే! అయినా, అటు తెలంగాణాలోనూ ఇటు ఆంధ్రా ప్రాంతంలోనూ కాంగ్రేసే వడ్డిస్తున్నపుడు ఎవరికి మాత్రం సమస్యలుంటాయి? ‘వడ్డించేవాడు ‘మనోడయితే’ ఎక్కడ కూర్చున్నా అందవలసినవి అందుతూనే ఉంటాయని పెద్దలు ఊరికే చెప్పలేదు కదా!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.