మోడీ పాలనపై కాంగ్రెస్ విమర్శలా?

Publish Date:May 22, 2015

Advertisement

 

గత పదేళ్ళ కాలంలో అవినీతికి, అసమర్ధతకు మారుపేరుగా సాగిన కాంగ్రెస్ పాలనను చూసి దేశప్రజలందరూ ఆ పార్టీని తిరస్కరించారు. అయినా ఆ పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకొన్నట్లు కనబడటం లేదు. అందుకే ఆ పార్టీ నేతలలో నేటికీ ఎటువంటి పశ్చాతాపం కనబడటం లేదు. ప్రజలు తమ పార్టీని ఎందుకు తిరస్కరించారని ఆలోచించకుండా, అఖండ మెజార్టీతో ప్రజలు పట్టం కట్టిన మోడీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు విమర్శించడం చూస్తుంటే వారు కనీసం తమ వ్యవహార శైలిని కూడా మార్చుకోలేకపోయారని అర్ధమవుతోంది.

 

ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేతల ప్రధాన ఆరోపణ ఏమిటంటే ఆయన నియంతృత్వంగా వ్యవహరిస్తూ, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని. కానీ నిజమేమిటంటే ఆయన అధికారం చేప్పట్టిన తరువాతనే మళ్ళీ అన్ని వ్యవస్థలను ప్రక్షాళనం చేసి వాటికి జవజీవాలు కల్పించారు. ప్రభుత్వానికి భారంగా తయారయిన అనేక సంస్థలను, కమిటీలను,చివరికి మంత్రిత్వ శాఖలను కూడా రద్దు చేసి పరిపాలనలో సంస్కరణలు తద్వారా వేగాన్ని తీసుకువచ్చారు. ఒకప్పుడు ప్రణాళికా సంఘం అంటే అది ఎవరికీ అంతుపట్టని, ఎవరికీ సంబంధం లేని ఒక ‘బ్రహ్మ పదార్ధం’ గా భావించేవారు అందరూ. కానీ మోడీ దానిని సమూలంగా ప్రక్షాళన చేసి అందులో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించారు.

 

కేంద్ర మంత్రులకు, ఉన్నతాధికారులకు పూర్తి స్వేచ్చ కల్పిస్తూనే వారినే తమపనులకు జవాబుదారీగా చేస్తున్నారు. ఆయన ప్రభుత్వం చేప్పట్టిన అనేక చర్యల వలన ఇప్పుడు దేశ ఆర్ధిక వ్యవస్థ మళ్ళీ మెల్లగా గాడిన పడుతోంది. ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు భారత్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. ఈ మార్పులన్నీ కేవలం మోడీ సమర్ధత, నాయకత్వ లక్షణాల కారణంగానే సాధ్యమవుతున్నాయి. దానినే కాంగ్రెస్ నేతలు నియంతృత్వం అని ఏక వ్యక్తి పరిపాలన అని వర్ణిస్తున్నారు. అదే నియంతృత్వం అయితే, దాని వలననే దేశానికి మేలు జరుగుతుంటే అందుకు బాధపడటం ఎందుకు? మోడీ ప్రదర్శితున్న ఈ సమర్ధత వలన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎన్నడూ అధికారంలోకి రాలేదనే భయం, అభద్రతాభావంతో ఉంది. బహుశః అందుకే అది మోడీని చూసి ఉలికి పడుతోందేమో?  

 

ఒకవేళ దానినే కాంగ్రెస్ పార్టీ నియంతృత్వంగా భావిస్తే, ఇదివరకు డా. మన్మోహన్ సింగ్ ని డమ్మీ ప్రధానమంత్రిగా చేసి ఏ అధికారమూ లేని సోనియా, రాహుల్ గాంధీలు చేసిన పరిపాలనను ఏమనాలి? ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వమూ పరిష్కరించవలసిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాన్ని ఎటువంటి అధికారమూ లేని సోనియా గాంధీ ఎందుకు తన చేతిలోకి తీసుకొన్నారు? అని ప్రశ్నిస్తే ఆమె తెర వెనుక నుండి దేశాన్ని ఏవిధంగా పరిపాలించారో అర్ధమవుతుంది. కానీ ప్రజామోదంతో ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన నరేంద్ర మోడీ ప్రదర్శిస్తున్న నాయకత్వ లక్షణాలను, సమర్ధతను నియంతృత్వమని కాంగ్రెస్ అభివర్ణిస్తోంది. కాంగ్రెస్ పార్టీ గత పదేళ్ళలో చేయలేని అనేక పనులను మోడీ చేసి చూపిస్తుంటే అందుకు ఆయనను మెచ్చుకోకపోగా, సహజసిద్ధమయిన తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ ఇటువంటి మాటలతో ప్రజలను తప్పు ద్రోవ పట్టించే ప్రయత్నాలు చేస్తోంది.

 

కానీ దేశంలో అభివృద్ధి జరుగుతోందా లేదా? దేశానికి ఎవరు మేలు చేస్తున్నారు? ఎవరు కీడు చేస్తున్నారు? అనే విషయాలు గ్రహించలేనంత తెలివి తక్కువ వాళ్ళు కాదు భారతీయులు. అందుకే వారు దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టారు. బీజేపీకి అఖండ మెజార్టీతో పట్టం కట్టారు. మోడీ పరిపాలన గురించి కాంగ్రెస్ పార్టీ ఏమనుకొంటోంది? అనేది అప్రస్తుతం. దేశ ప్రజలు ఏమనుకొంటున్నారనేదే ముఖ్యం. మోడీ అధికారం చేప్పట్టిన తరువాత నుండే పాలనలో వేగం, పారదర్శకత కనబడుతోంది. ఏడాది పాలనలో ఒక్క కుంభకోణం కూడా జరగలేదు. దేశ వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబడ్డాయి. ఈ సంగతి ప్రజలందరికీ స్పష్టంగా కనబడుతూనే ఉన్నాయి ఒక్క కాంగ్రెస్ కి తప్ప. కనుక కాంగ్రెస్ పార్టీ తనను మభ్యపెట్టుకొంటూ ప్రజలను కూడా మభ్య పెట్టేందుకు ఎన్ని కబుర్లు అయినా చెప్పుకోవచ్చును. దాని మాటలకు ప్రజల దృష్టిలో ఎటువంటి విలువ ప్రాధాన్యత లేదు. ఉండబోదు కూడా.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.