రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీని క్షమించండి!

Publish Date:Apr 29, 2015

Advertisement

 

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ నేటికీ రెండు నాల్కలతో మాట్లాడటం మానలేదు. తెలంగాణా సాధన కోసం ఎన్నో ఏళ్లుగా అనేక ఉద్యమాలు చేసినా తెలంగాణా ఏర్పడలేదని కానీ సోనియా గాంధీ దయతలచి తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసారని, అందుకు తెలంగాణా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సర్వదా రుణపడి ఉండాలని తెలంగాణా కాంగ్రెస్ నేతలు చెప్పుకోవడం అందరికీ తెలుసు. కానీ అదే కాంగ్రెస్ పార్టీకి నేతలు “రాష్ట్ర విభజన చేసినందుకు ఏ.ఐ.సి.సి. తరపున విచారం వ్యక్తం చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు క్షమించాలని” కోరుతున్నారు. ఈ మాటలు అన్నది ఎవరో గల్లీ స్థాయి నేతలు కాదు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇన్-చార్జ్ మరియు ఏ.ఐ.సి.సి. కార్యదర్శి అయిన సూరజ్ హెగ్డే బుధవారం సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో యువజన కాంగ్రెస్ నిర్వహించిన యువ శంఖారావం సదస్సులో ఈ మాటలు అన్నారు. అంటే రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ అధిష్టానం నిజంగా పశ్చాతాపపడుతోందనుకోవాలా? లేక ప్రజాభిప్రాయాన్ని మన్నించకుండా రాష్ట్ర విభజన చేసినందున రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది కనుక మళ్ళీ రాష్ట్ర ప్రజలను ప్రసన్నం చేసుకోనేందుకే ఇటువంటి మాటాలు మాట్లాడుతోందనుకోవాలా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిజంగా పశ్చాతాపపడితే అదే ముక్కని తెలంగాణా రాష్ట్రంలో కూడా అనే సాహాసం చేయగలదా?


ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం అనేక దశాబ్దాలుగా ఉద్యమాలు జరుగుతున్నా, వేలమంది యువకులు బలిదానాలు చేసుకొన్నా ఏనాడు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. కానీ సార్వత్రిక ఎన్నికలలో తన విజయావకాశాలు పెంచుకొని మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావాలనే ఆలోచనతోనే ఎన్నికలకు ముందు హడావుడిగా రాష్ట్ర విభజన చేసి చేతులు దులుపుకొన్న సంగతి అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన సమయంలో ఎంత దుర్మార్గంగా ఆలోచించిదంటే తను ఎన్నికలలో గెలిచేందుకు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలా లేక మూడు ముక్కలు చేయాలా ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలుగా విడదీస్తే తనకు లాభమా లేకపోతే ఆంధ్రా రాయల తెలంగాణా రాష్ట్రాలుగా విడదీస్తే తనకి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందా అని ఆలోచించిందే తప్ప ఆంద్ర, తెలంగాణా ప్రజల మనోభావాలను పట్టించుకోలేదు. అదే విధంగా తెలంగాణాలో తెరాసను విలీనం చేసేసుకొని తెలంగాణా రాష్ట్రంలో నూటికి నూరు శాతం ఓట్లు సంపాదించుకోవాలని దురాశకు పోయింది. కానీ కాంగ్రెస్ ప్రదర్శించిన ఆ అతితెలివికి చివరికి అదే బలయిపోయింది. రెండు రాష్ట్రాలలోనే కాకుండా కేంద్రంలో కూడా అధికారంలోకి రాలేకపోయింది.

 

అటువంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకొని తన తప్పులను సవరించుకోకపోగా నేటికీ ప్రజలను ఈవిధంగా మభ్యపెట్టి మళ్ళీ రాష్ట్రంలో తన పట్టు పెంచుకోవాలని ప్రయత్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్ర విభజన చేసినందుకు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిజంగా పశ్చాతాపపడి ఉండి ఉంటే, ఎన్నికల సమయంలోనే లెంపలు వేసుకొని అప్పుడే ఈ నాలుగు ముక్కలు చెప్పుకొని ఉండి ఉంటే బహుశః ఒకటో రెండో సీట్లయినా గెలుచుకోనేదేమో. కానీ అప్పుడు రాష్ట్ర విభజన చేసి తెలంగాణా ఏర్పాటు చేసిన ఖ్యాతి మొత్తం తనకే దక్కాలని తెలంగాణాలోచెప్పుకొంటూ,  ప్రాంతీయ పార్టీలు ఇచ్చిన లేఖలు, వాటి ఒత్తిళ్ళ కారణంగానే రాష్ట్ర విభజన చేయవలసి వచ్చిందని ఆంద్రప్రదేశ్ ప్రజలకు చెప్పుకొని ఓట్లు సంపాదించుకోవాలని ప్రయత్నించి భంగపడింది. ఇంత జరిగినా నేటికీ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి మార్పు, పశ్చాతాపం రాలేదని సూరజ్ హెగ్డే మాటలతో స్పష్టమయింది.

 

ఆంద్ర, తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని ఉద్యమాలు చేసినా, గత పదేళ్ళ అవినీతి, అసమర్ధ కాంగ్రెస్ పాలనతో విసుగెత్తిపోయున్నరెండు రాష్ట్రాలలో ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారనే నమ్మకం లేదు. అలాగని కాంగ్రెస్ పార్టీ చేతులు ముడుచుకొని కూర్చొన్నట్లయితే రెండు రాష్ట్రాలలో పార్టీ పూర్తిగా అదృశ్యమయిపోవడం ఖాయం గనుక కాంగ్రెస్ నేతలు తమ పార్టీ ఉనికిని, తద్వారా తమ ఉనికిని కాపాడుకొనేందుకు ఇటువంటి మాటలేవో చెప్పుకోకతప్పదని ప్రజలు కూడా సరిపెట్టుకోవలసి ఉంటుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.