Publish Date:Jan 25, 2022
ఎన్నికల వేళ, ఉత్తర ప్రదేశ్’లో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మూడున్నర దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణం చేసిన, కేంద్ర మాజీ మంత్రి ఆర్పీ సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ, సింగ్ పేరును స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చేర్చిన కొద్ది గంటల్లోనే ఆయన పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్ లేదని, ముందున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి కాంగ్రెస్’కు పొంతనే లేదని అందుకే కాంగ్రెస్ పార్టీని వదిలినట్లు చెప్పారు. ఆయన తమ రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. భారత గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ తన రాజకీయ ప్రయాణం కొత్త మలుపు తీసుకుందని, ఇక్కడి నుంచి కొత్త ప్రస్థానం సాగుతుందని సింగ్ ట్విట్ చేశారు. ఎన్నికల సమయంలో ఆర్పీఎన్ సింగ్ పార్టీని వీడడం కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అదలా ఉంటే, మరో పక్షం రోజులో ఫిబ్రవరి 10 న తొలి విడత పోలింగ్ జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడి పుట్టిస్తోంది. ఇప్పటికే తొలి విడత అభ్యర్థులను ప్రకటించి.. పార్టీలన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరో వంక ఫిరాయింపులూ కొనసాగుతున్నాయి. ప్రధాన పోటీ, బీజేపీ, ఎస్పీల మధ్యనే అయినా, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా పావులు కడుపుతున్నాయి. కింగ్ కాకున్నా కింగ్ మేకర్ కావాలని ఆశ పడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత, యూపీ ఎన్నికల సారధి ప్రియాంకా వాద్రా ఎన్నికల తర్వాత అవసరం అయితే కాంగ్రెస్ పార్టీ, ఎస్పీకి మద్దతు ఇస్తుందని ప్రకటించారు.
ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్ పార్టీ ప్రాథమిక సభ్వత్వానికి రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సమక్షంలో బీజేపీలో చేరారు. అంతే కాదు, కాంగ్రెస్ పార్టీ కథ ముగిసిందని, ప్రధాని మోదీ నేతృత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆర్పీఎన్ సింగ్ చెప్పారు. యూపీ ప్రజలు తనను ఎప్పటి నుంచో బీజేపీలో చేరాలని కోరుతున్నారని.. ఇప్పటికి సాధ్యపడిందని పేర్కొన్నారు. ఆర్పీఎన్ సింగ్తో పాటు కాంగ్రెస్ ప్రతినిధి శశివాలియా, పార్టీ కార్యదర్శి రాజేంద్ర ఆహ్వాన కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సింగ్ చేరికను కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వాగతించారు. బీజేపీలో సింగ్ చేరికతో యూపీలో పార్టీ మరింత బలపడుతుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ విధానాలపై ప్రజలకు నమ్మకం లేదని విమర్శించారు. నిజానికి యూపీలో కాంగ్రెస్ పోటీలోఉన్నా లేనట్లేననే అభిప్రాయం ఎప్పటి నుంచో వ్యక్తమవుతోంది. ఆర్పీ సింగ్ రాజీనామాతో మరో సారి రుజువిందని పరిశీలకులు భావిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/congress-minister-jumps-to-bjp-39-130738.html
తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్. తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియ జేసింది. ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. మండే ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనం లభించనుంది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఓటమి భయం వెంటాడుతోంది. ఇన్నాళ్లూ తనకు అనుకూలమైన అధికారులతో ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులు చేయించిన జగన్ కు ఈసీ వరుసగా షాకిలిస్తోంది. ఎన్నికల నియమావళిలో భాగంగా అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న అధికారులపై ఈసీ బదిలీ వేటు వేస్తోంది.
కంగనా రనౌత్.. సినీమాల గురించి తెలిసిన వారెవరికీ ఈ పేరును కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. నటిగా ఆమె ఉన్నత శిఖరాలను అధిరోహించింది. హీరోయిన్ గానే కాదు, లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనే ఆమె నటన విమర్శలకు ప్రశంసలు సైతం పొందింది.
మరో సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఐదు రోజులు మాత్రమే ఉండటంతో ఉద్యో గుల కోసం పోస్టల్ బ్యాలెట్ సౌలభ్యం ఉంది. ఈ నెల 9 వరకు గడువు విధించినట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు.
భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో మరచిపోలేని తిరుగుబాటు స్వరం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. చిన్నవయసులోనే మహోజ్వల శక్తిగా మారి భరతమాత దాస్యశృంఖలాల విముక్తి కోసం పోరాడిన మన్యం వీరుడు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్ర్యం వస్తుందని నమ్మి, తన ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు.
కీలెరిగి వాత పెట్టినట్లుగా చిరంజీవి జగన్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఎన్డీయే కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నారు. అసలే బలహీనంగా ఉన్న జగన్ కు చిరంజీవి తెలుగుదేశం కూటమికి బాహాటంగా మద్దతు ఇవ్వడం మరింత బలహీనం చేస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకూ చిరంజీవి ప్రత్యక్షంగా తన రాజకీయ మొగ్గు ఎటువైపు అన్నది ప్రకటించలేదు. కానీ మిత్రులు అంటూ అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, అలాగే జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ లకు ఓటు వేయండి అంటూ ఆయన ఒక వీడియో సందేహం ద్వారా ప్రజలకు పిలుపు నిచ్చారు.
దేశంలోనే పేరుపొందిన పారిశ్రామిక ప్రాంతం శ్రీ సిటీ ఇక్కడే ఉంది. అక్కడ కూడా సమస్యల కుప్పగా మారిపోయింది. ఎవరూ పట్టించుకునే వారు లేకపోవడంతో, ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. మరో వైపు, ఒకప్పటి టీడీపీ కంచుకోటగా వున్న సూళ్లూరుపేటలో సంచలన విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.
నేచురల్ స్టార్ నాని జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికలలో ఇప్పటి వరకూ సినీ పరిశ్రమ నుంచి ఎవరూ తమ మద్దతు ఫలానా పార్టీకి, ఫలానా అభ్యర్థికి అంటూ బాహాటంగా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ జనసేన పార్టీలో చేరి ఆ పార్టీకి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
మళ్ళీ జగన్ అధికారంలోకి రావడం అనేది అసంభవం. అయినప్పటికీ ఇంకా చాలా కొద్దిమంది జగన్ మాయలో వుండే అవకాశం వుంది. వాళ్ళు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడేమో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక ప్రముఖులను ఇమిటేట్ చేస్తూ వీడియోలు చేయడం సాధారణమైపోయింది.
జగన్ నోట ఓటమి మాట వచ్చేసింది. ఔను ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతాయా అన్న అనుమానం కలుగుతోంది. తనను అడ్డుకోవడానికి వాళ్లు సొమ్ములు నిలిపివేస్తున్నారు. అధికారులను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు అంటూ జగన్ మాట్లాడారు.
వీళ్ళకి అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం వున్నప్పుడు బెయిల్ కోసం జగన్ ఎవరి కాళ్ళ బేరానికి వెళ్ళాడో, గత పదేళ్ళుగా ఎవరి కాళ్ళు పట్టుకుంటున్నాడో అందరికీ తెలిసిందే. కనీసం కోర్టు హియరింగ్కి కూడా హాజరు కాకుండా హాయిగా తిరుగుతున్నాడు.
ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అడ్డు ఎవరు వచ్చినా వారిని టార్గెట్ చేయడం ఆనవాయితీ. స్వంత బాబాయి వివేకానందరెడ్డి హత్య చేసినట్టు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్వంత బాబాయిని హత్య చేయించిన ఘనుడు జగన్ అని చెల్లెలు వైఎస్ షర్మిల విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ఆమెను చిక్కులు తెచ్చి పెట్టింది.