వెంకటరెడ్డికి కాంగ్రెస్ పొగ

Publish Date:Aug 13, 2022

Advertisement

మునుగోడు ఉప ఎన్నిక సాక్షిగా కాంగ్రెస్ పార్టీ కొమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ పొగపెట్టేసిందా? పార్టీ నుంచి బహిష్కరించకుండానే ఆయనను ఏకాకిని చేసేసిందా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడే కాదు.. స్టార్ క్యాంపెయినర్ కూడా. అయినా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఆయనకు ఎలాంటి బాధ్యతా అప్పగించలేదు. రాజగోపాలరెడ్డి రాజీనామా చేసిన సమయంలో మునుగోడులో కాంగ్రెస్ ప్రచార సారథ్యం వెంకటరెడ్డిదే అని ఒక ఊరడింపు మాట తప్ప... ఆ తరువాత జరిగిన ఏ విషయంలోనూ, ఏ వ్యవహారంలోనూ వెంకటరెడ్డికి ఎలాంటి బాధ్యతా అప్పగించలేదు. కనీసం సమావేశాలకు కూడా పిలవడం లేదు. మునుగోడు ప్రచార కర్తల జాబితాలో ఆయన పేరు కూడా లేదు. ఎన్నికల సమావేశాలకు పిలవడం అటుంచి కనీసం ప్రచారానికి రమ్మని కూడా అనడం లేదు. ర్యాలీలు, పాదయాత్రలలోనూ ఆయనను దూరంగానే పెడుతున్నారు.

ఒక విధంగా చెప్పాలంటే  కాంగ్రెస్ లో ఉండి కూడా  లేనట్టుగానే ఆయన పరిస్థితి ఉంది. కనీస అవగాహన ఉన్న ఎవరికైనా కాంగ్రెస్ ఆయనకు పొమ్మన లేక పొగపెడుతోందని ఇట్టే అర్ధమైపోతుంది. అలాంటిది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పార్టీలో తన పరిస్థితి ఏమిటో ఇంకా అర్ధం కాలేదని భావించలేం. కానీ ఆయన ఇంకా పార్టీలోనే ఉన్నారు. ఉండి ఊరుకోవడం లేదు. టీపీసీసీ చీఫ్ పై విమర్శల బాణాలు సంధిస్తున్నారు. వాటిని పార్టీ పట్టించుకోవడం లేదని తెలిసినా ఆయన తన ప్రయత్నం తాను మానడం లేదు. సోదరుడి గొంతుకకు వంత పాడుతున్నట్లు ఆయన తీరు ఉందని పార్టీలోనే చర్చ జరుగుతోంది.

అందుకే ఆయన పార్టీలో ఉన్నా బీజేపీ గూటికి చేరిన ఆయన సోదరుడిలాగే కాంగ్రెస్ చూస్తోంది. దీంతో అనివార్యంగా ఎవరూ పిలవకపోయినా, ఎవరూ ఆహ్వానించకపోయినా... ఆ విషయాన్ని దాచి పెట్టి మునుగోడు ఉప ఎన్నికతో తనకు సంబంధం లేదనీ, తానక్కడకు ప్రచరానికి వెళ్లబోవడం లేదనీ గంభీరంగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తనపై అనుచిత విమర్శలు చేయిస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. తనను విమర్శించిన వారినీ, విమర్శించేలా చేసిన వారిని వదిలిపెట్టనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.

వాళ్ల విషయం రాష్ట్ర కాంగ్రెస్ తో కాదనీ, ఏకంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీతోనే తేల్చుకుంటాననీ చెబుతున్నారు. అయితే ఆయన మాటలను కాంగ్రెస్ వర్గీయులే ఎద్దేవా చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పార్టీలో ఉండీ లేనట్టేనని, ఆయన తీరు పట్ల హైకమాండ్ కూడా విసిగిపోయిందనీ చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు సోనియాగాంధీ అప్పాయింట్ మెంట్ కాదుకదా, కనీసం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి అప్పాయింట్ మెంట్ దొరకడం కూడా కష్టమేనంటున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీ ఎప్పుడో పరిగణనలోనికి తీసుకోవడం మానేసిందని అంటున్నారు. పార్టీ నుంచి కోమటిరెడ్డిని ప్రత్యేకంగా బహిష్కరించడం అంటూ ఉండదనీ, కానీ ఆయనకు కనీస గుర్తింపు కూడా లేని చోట ఉండలేని పరిస్థితి కల్పించడమే పార్టీ వ్యూహంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అన్నీ తెలిసినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీని అడ్డు పెట్టుకుని ఉండటానికి కారణం.. పార్టీలో ఉంటూనే తన సోదరుడికి సాధ్యమైనంత మేలు చేసి ఆ తరువాత కమలం గూటికి చేరాలన్న వ్యూహమేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.  

By
en-us Political News

  
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే..  క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.  దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్‌ ద్వారానే ఇంటర్నెట్‌ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి.  మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి.  ఈ ఫలితాలు కేవలం  ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి. 
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.