తెలంగాణలో కాంగ్రెస్ ‘ఎత్తర జెండా!’

Publish Date:Jun 5, 2023

Advertisement

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రాజకీయ పక్షాలూ సిద్ధం అవుతున్నాయి. అధికార బీఆర్ఎస్ తన పట్టు నిలబెట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. అధికారానికి దూరమైన కాంగ్రెస్ తన పూర్వ వైభవం కోసం శక్తి వంచన లేకుండా పని చేస్తోంది. మొన్నమొన్నటి  వరకూ తమదే గెలుపు అని చెప్పుకున్న బీజేపీ ఇప్పుడు చప్పుడు చేయడం లేదు. తెలుగుదేశం పార్టీ తన బలాన్ని మరో సారి ప్రదర్శించే పనిలో ఉంది.  కమ్యూనిస్టులు, బీఎస్పీ వంటి పార్టీలు ఇంత వరకూ ఎన్నికల ఊసే ఎత్తడం లేదు. జూన్ 2వ తేదీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రకటనతో తెలంగాణ సహా రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో ఎన్నికలు జరగబోతున్నాయని స్పష్టమైంది. 

ఇటీవల ముగిసిన కర్నాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలో అధికార పార్టీ అధినేతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.  కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అనుసరించిన వ్యూహం ఫలితాలను ఇవ్వడంతో తెలంగాణలో కూడా అలాంటి వ్యూహాన్నే అవలంబిచాలని భావిస్తోంది.  తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి రాకపోవడానికి గల కారణాలను అన్వేషిస్తోంది.  కర్నాటక, తెలంగాణలో ఉన్న సారూప్యతలపై అధ్యయనం చేస్తున్న కాంగ్రెస్ ఇక్కడి ముస్లిం ఓట్లపై గురిపెట్టింది. హిజాబ్, టిప్పు సుల్తాన్ వంటి అంశాలు ఇక్కడ లేకపోవడంతో రాజకీయ రిజర్వేషన్లపై కాంగ్రెస్ దృష్టి పెడుతోంది. మరో వైపు ముఖ్యమంత్రి పదవి అల్ప సంఖ్యాక వర్గాలకు ఇవ్వాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి.  

బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ పాలనను తొమ్మిదేళ్లుగా చూస్తున్న తెలంగాణ ప్రజానీకం మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ప్రధానంగా కనిపించబోతోందని రాజకీయ విశ్లేషకుల అంచనా. అంబేడ్కర్ విగ్రహం, కొత్త సచివాలయం, అమరుల స్థూపం వంటి నిర్మాణాలు, దళిత బంధు వంటి కార్యక్రమాలు బీఆర్ఎస్ గ్రాఫ్ ని మరీ పతనం కాకుండా కాపాడినా కాంగ్రెస్ గెలుపును ఆపలేవని తాజా సర్వేలు చేబుతున్నాయి.  మే నెలలో ఓ ప్రముఖ సంస్థ జరిపిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.  

కాంగ్రెస్ వర్గ విభేదాలు పక్కన పెట్టి పని చేస్తే రానున్న ఎన్నికలలో 41శాతం ఓటు షేరును సాధించి 68 సీట్లు గెలవగలదని ఆ సర్వే తేల్చింది.  37శాతం ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ 35 సీ్టలు, పది శాతం ఓట్లతో  బీజేపీ 8 సీట్లు, 3శాతం ఓట్లతో ఎంఐఎం 6 సీట్లను తమ ఖాతాలో వేసుకోనుండగా, ఒకరిద్దరు ఇతరులు విజయం సాధిస్తారని ఈ సర్వే తేటతెల్లం చేసింది. 

తొమ్మదిన్నరేళ్లు అధికారంలో ఉండడం, కింది స్థాయి నాయకులపై ప్రజల్లో అసంతృప్తి ఉండటం, టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం వంటి కారణాలు కేసీఆర్ కు సమస్యగా మారగా, వరుస తప్పిదాలు, నాయకత్వ లోపం, స్పష్టమైన అభివృద్ధి అజెండా లేకపోవడం, కేసుల విషయంలో కప్పదాట్లు బీజేపీ పాలిట శాపంగా మారాయి.  అభ్యుదయ వాదులు, చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలకు బీజేపీ మాటలపై, ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మాటలపై నమ్మకం పోయింది.  ఈ రాజకీయ పరిస్థితిని అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది.  ప్రస్తుతం తెలంగాణలోని తటస్థ నాయకులకు కాంగ్రెస్ ఏకైక ఎంపికగా మారిందనడంలో ఏ మాత్రం సంశయం అక్కర్లేదు. 

By
en-us Political News

  
వల్లభనేని వంశీ నామినేషన్ దాఖలు చేసిన రోజునే ఓటమిని అంగీకరించేశారా? అంటే పరిశీలకలు ఔననే అంటున్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించడం ద్వారా తనకు గెలుపు ఆశలు ఆవిరి అయిపోయాయని చెప్పకనే చెప్పేశారు.
డోన్ నియోజకవర్గం వైైసీసీ అభ్యర్థి మంత్రి  బుగ్గన నామినేషన్ పెండింగ్లో పడింది.   మంత్రి బుగ్గన రాజేంద్రనాథ నామినేషన్ ను ఆర్వో పెండింగ్ లో ఉంచారు.
ఏపీ ఎన్నికల సందర్భంగా జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కమెడియన్ హైపర్ ఆది ప్రచారం చేస్తున్నారు.
హిందూపురం తెలుగుదేశం అభ్యర్థిగా బాలకృష్ణ భార్య వసుంధర నామినేషన్! అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
ఓ వైపు ప్రజా వ్యతిరేకత, మరో వైపు చెల్లెళ్ల విమర్శలు, ఇంకో వైపు పార్టీ నుంచి పెరిగిపోతున్న వలసలు, వెరసి ఓటమి భయంతో జగన్ వణికి పోతున్నారా? ఆఫ్రస్ట్రేషన్ లో సొంత చెల్లెలిపైనే అనుచిత వ్యాఖ్యలు చేసి తనకు తానే నష్టం చేసుకున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
ఏంటమ్మా జగనూ... మొన్న చెల్లి షర్మిలమ్మ ఎలక్షన్ కమిషన్ దగ్గర అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు చూశాంలే..
కేసీఆర్ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సెంటిమెంట్ ను పండించేందుకు నానా ప్రయత్నాలూ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత కారణాలేమైతేనేం చాలా రోజుల పాటు ఎక్కడా బహిరంగంగా మాట్లాడని ఆయన ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ముంగిట ప్రజల ముందుకు వచ్చారు.
గుడివాడ, గన్నవరం.. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ రెండు చోట్లా కూడా వైసీపీ అభ్యర్థుల తీరు, భాష పట్ల ఆయా నియోజకవర్గాలలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అయినప్పటికీ వైసీపీ గాంభీర్యం పదర్శిస్తూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నది.
ఏపీలో భానుడు చండ్ర నిప్పులు చెరుగుతున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి.
సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్ తానేదో పెద్ద రాజకీయవేత్త అన్నట్టుగా బిల్డప్పు ఇస్తుంటారుగానీ, ఆయన నడిపేవి దిక్కూమొక్కూ లేని రాజకీయాలు.
నిజామాబాద్ లో మూడు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులూ ఆరితేరిన ఉద్ధండులే! ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్ని బ‌ట్టి చూస్తే ఓటర్లు ఏ పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వలేదు! ఏడు సెగ్మెంట్లలో మూడు చోట్ల‌ బీఆర్‌ఎస్‌ గెలిస్తే.. కాంగ్రెస్‌, బీజేపీ రెండేసి చొప్పున పంచుకున్నాయి! పార్లమెంటు ఎన్నికల్లో ఇప్పుడు మూడు పార్టీలూ హోరాహోరీ తలపడుతున్నాయి!
ఏడు విడతల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా రెండో విడత పోలింగ్ ఈ రోజు ఉదయం మొదలైంది. కేరళలోని మొత్తం 20 లోక్ సభ స్థానాలకూ, కర్నాటకలో 14, రాజస్థాన్ లో 13, మహారాష్ట్ర, యూపీలలో ఎనిమిదేసి స్థానాలకు, మధ్య ప్రదేశ్ లో 7, బీహార్, అసోంంలలో ఐదేసి, చత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్ లో రెండేసి స్థానాలకూ ఈ రోజు పోలింగ్ జరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.