ఆర్ఎస్ఎస్ అడుగు జాడల్లో హస్తం పార్టీ?

Publish Date:Apr 21, 2025

Advertisement

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అంటే  కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీకి ఉన్న అభిప్రాయం ఏమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఒకటి రెండు సార్లు కాదు..   వందల సార్లు రాహుల్ గాంధీ ఐ హేట్ ఆర్ఎస్ఎస్ అని చాలా స్పష్టంగా చెప్పారు.  ఆఫ్కోర్స్, ఆయన అవే పదాలను, అదే క్రమంలో అని ఉండక పోవచ్చును, కానీ  ఎప్పుడు  ఎక్కడ, ఎలాంటి సందర్భంలో ఆర్ఎస్ఎస్ ప్రస్తావన వచ్చినా..  రాహుల్ గాంధీ తన వ్యతిరేకతను, ద్వేషాన్నీ ఎప్పుడూ  దాచుకోలేదు. నిజానికి  రాహుల్ గాంధీ బీజీపీ, మోదీలను ఎక్కువ వ్యతిరేకిస్తారా? ఆర్ఎస్ఎస్ ను ఎక్కువ వ్యతిరేకిస్తారా అంటే అనుమానం లేకుండా  ఆర్ఎస్ఎస్  అనే సమాధానమే వస్తుంది. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించే క్రమంలోనే ఆయన బీజేపీ,ఆర్ఎస్ఎస్ లతో పాటుగా దేశం పై కూడా  యుద్ధం ప్రకటించారు. అందుకే, ఆర్ఎస్ఎస్ ప్రస్తావన ఎక్కడ వచ్చినా.. ఎప్పుడు వచ్చినా  రాహుల్ గాంధీ అగ్గి మీద గుగ్గిలం అవడం చూస్తున్నాము. 

కాగా  కొద్ది రోజుల కిందట, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సందీప్ దీక్షిత్ తో జరిపిన  సంభాషణలోనూ రాహుల్  గాంధీ అదే చెప్పారు. అంతే కాదు.. ఆర్ఎస్ఎస్ పట్ల తమకున్న వ్యతిరేకత తమ జీన్స్ లోనే ఉందని క్లారిటీ ఇచ్చారు. అవును.. మీ ముత్తాత జవహర్ లాల్ నెహ్రూ కలలో కనిపిస్తే..  మీరు ఆయన్ని ఏమి అడుగుతారు? అని సందీప్ దీక్షిత్  అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ, తాను అడిగే ప్రశ్నతో పాటుగా నెహ్రూ చెప్పే సమాధానం కూడా చెప్పారు. 
 మా ముత్తాత నెహ్రూ కనిపిస్తే.. నేను Tell me one thing that I never ever do  అంటే నేను జీవితంలో ఎప్పుడూ, ఎప్పటికీ ఏది చేయకూడదో చెప్పమని అడుగుతానని  సమాధానం ఇచ్చారు. అంతే కాదు, ఆ వెంటనే,తన ప్రశ్నకు  నెహ్రూ .. ఇచ్చిన సమాధానం కూడా చెప్పనా?  అంటూ  Never compromise with RSS   ఆర్ఎస్ఎస్ తో ఎప్పుడు రాజీ పడద్దు  అని నెహ్రూ చెప్పారని రాహుల్ చెప్పారు. 

ఈ సభాషణను గమనిస్తే, రాహుల్ గాంధీకి ఆర్ఎస్ఎస్ పట్ల వ్యతిరేకత వెనుక జన్మజన్మల వైరం ఏదో ఉందనిపిస్తుంది. అలాగే.. ఆర్ఎస్ఎస్ పట్ల వ్యతిరేకత, ద్వేషం ఏస్థాయిలో వుందో,  అ ద్వేషం మూలాలు ఎక్కడ ఉన్నాయో కూడా స్పష్టంగా అర్థం అవుతుందని అంటున్నారు. 

 అయితే.. రాహుల్ గాంధీకి ఆర్ఎస్ఎస్ పట్ల ఇంత వ్యతిరేకత, ద్వేషం ఉన్నదన్న సంగతి అందరికీ తెలిసిందే.  అ యినా.. చిత్రంగా తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజాన్ మాత్రం..  కాంగ్రెస్ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని  సూచించారు. అవును..  చేవెళ్ల, జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల నేతలతో నిర్వహించిన  సమీక్షా సమావేశంలో ఆమె, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఆదర్శంగా తీసుకుని,వారి పద్దతిలో పనిచేయాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

 అలాగే,ఆర్ఎస్ఎస్ ఎలా పనిచేస్తుందో కూడా ఆమె వివరించారు. ఆర్ఎస్ఎస్  సభ్యులు మనిషి మనిషినీ కలుస్తారు.  కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు కూడా అదే తరహాలో మనిషి మనిషినీ కలిసి ప్రభుత్వ పథకాలను, వాటి ద్వారా ఒనగూరుతున్న ప్రయోజనాలను వివరించాలని సూచించారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేవలం మీడియానో, సోషల్‌ మీడియానో నమ్ముకుంటే సరిపోదని అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి ముఖాముఖి  మాట్లాడాలని,  అప్పుడే ప్రజలు నాయకులకు, పార్టీకి, ప్రభుత్వానికి దగ్గరవుతారని చెప్పారు. 

అయితే..  ఈ సూచనను, కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఎలా తీసుకుంటారు? ఎంత వరకు అమలు చేస్తారు? అనేది పక్కన పెడితే.. ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో నడవాలనే మీనాక్షి నటరాజన్ సూచనను రాహుల్ గాంధీ ఎలా తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారిందని అంటున్నారు. ఓవంక రాహుల్ గాంధీ, కాంగ్రెస్ లో ఉన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ కోవర్టులను గుర్తించి  ఏరివేయాలని అంటుంటే, మీనాక్షి నటరాజన్  ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో నడవాలని కార్యకర్తలు, నాయకులకు చేసిన సూచనను ఎలా తీసుకోవాలని, కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. 
అయితే..  పార్టీ ముఖ్యనాయకులు మాత్రం  ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలేందుకు రాహుల్ గాంధీ ఒక్క నాటికీ అంగీకరించరని అంటున్నారు. అలాగే.. మీనాక్షి నటరాజన్  అనాలోచితంగా ఈ సూచన చేసి ఉండవచ్చునని అంటున్నారు. అన్నిటిని మించి,ఆర్ఎస్ఎస్  కార్యకర్తల  కమిట్మెంట్ తో పనిచేయడం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు మాత్రమే సాధ్యమని, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే, నటరాజన్ సూచనలను, అంత సీరియస్ గా తీసుకోవలసిన అవసరం లేదని కాంగ్రెస్ నాయకులే అంటున్నారు.

By
en-us Political News

  
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.