Publish Date:May 11, 2022
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్.. దేశంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీ. ఇప్పుడు గత వైభవాన్ని కోల్పోయి.. దేశం మొత్తంలో కేవలం రెండంటే రెండు రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉన్న పార్టీ. తమ ప్రమేయం లేకుండానే ఏదో విధంగా మళ్లీ కేంద్రంలో అధికారం దక్కుతుందన్న ఆశతో ఎదురు చూస్తున్న గాంధీ కుటుంబం నేతృత్వంలో నడుస్తున్న పార్టీ. అయితే పార్టీ ఎలాగోలా అధికారంలోకి వచ్చేస్తుందని హైకమాండ్ కున్న నమ్మకం.. పార్టీలోని సీనియర్లలో లేకపోవడంతో చాలా వరకూ సీనియర్లు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. సార్వత్రక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీలో నిరాశా నిస్షృహలు పెరిగిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దేశంలోనే సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎన్నికల సన్నాహాలకు వనరుల లేమితో పరేషాన్ అవుతోంది. ఈ నేపథ్యంలో అనివార్యంగా పార్టీలో ఉత్సాహాన్ని నింపాల్సిన బాధ్యతను అధినేత్రి సోనియాగాంధీ తీసుకున్నారు. శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు ఉదయపూర్ చింతన్ శిబిర్ నిర్వహించనున్న నేపథ్యంలో ఆమె అధ్యక్షతన సీడబ్ల్యుసి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో సోనియా ప్రసంగమే దేశ రాజకీయాలలో పెద్ద చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ పనైపోయిందా అన్న అనుమానాలకూ తెరతీసింది. పార్టీ పునర్వైభవానికి పార్టీ క్యాడర్ లో ఉత్సాహాన్నినింపాల్సిన అధినేత్రి సోనియా గాంధీ సీడబ్ల్యుసీ లో బేలగా ప్రసంగించారు. ఆ సమావేశంలో రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
గ్రాండ్ ఓల్డ్ పార్టీ వల్ల దేశంలో అందరూ లాభపడ్డారనీ.. అలా లాభపడిన వారంతా ఇప్పుడు పార్టీ కోసం తమ వంతు సహాయం అందించాల్సిన సమయం వచ్చిందని సోనియా ఆ సమావేశంలో పిలుపు నిచ్చారు. నేరుగా చెప్పకపోయినా.. కాంగ్రెస్ ను అడ్డుపెట్టుకుని సంపాదించిన వారంతా ఇప్పుడు పార్టీకి ఆర్థిక సహకారం అందించాలన్నదే ఆ పిలుపు లక్ష్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేశంలో కేవలం రెండంటే రెండు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. ఇటీవలి ఎన్నికల్లో ఓటమి పార్టీలో నైరాశ్యాన్ని నింపింది. ఈ పరిస్థితుల్లో క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపి వారిని వచ్చే ఎన్నికలలో క్రియా శీలంగా పని చేసేలా దిశానిర్దేశం చేయాల్సిన అధినేత్రి బేలగా.. పార్టీని ఆదుకోవడానికి ముందుకు రండి అంటూ అభ్యర్థించడం పై రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీలో దశ, దిశ చూపే నాయకత్వం కరవైందనడానికి సీడ్బ్ల్యుసీలో సోనియా ప్రసంగమే నిదర్శనమంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్ర, శనివారాలలో జరిగే చింతన్ శిబిర్ వల్ల పార్టీకి ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండకపోవచ్చని విశ్లేషణలు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/congress-chintan-sibir-from-friday-39-135762.html
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.