Publish Date:May 11, 2022
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్.. దేశంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీ. ఇప్పుడు గత వైభవాన్ని కోల్పోయి.. దేశం మొత్తంలో కేవలం రెండంటే రెండు రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉన్న పార్టీ. తమ ప్రమేయం లేకుండానే ఏదో విధంగా మళ్లీ కేంద్రంలో అధికారం దక్కుతుందన్న ఆశతో ఎదురు చూస్తున్న గాంధీ కుటుంబం నేతృత్వంలో నడుస్తున్న పార్టీ. అయితే పార్టీ ఎలాగోలా అధికారంలోకి వచ్చేస్తుందని హైకమాండ్ కున్న నమ్మకం.. పార్టీలోని సీనియర్లలో లేకపోవడంతో చాలా వరకూ సీనియర్లు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. సార్వత్రక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీలో నిరాశా నిస్షృహలు పెరిగిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దేశంలోనే సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎన్నికల సన్నాహాలకు వనరుల లేమితో పరేషాన్ అవుతోంది. ఈ నేపథ్యంలో అనివార్యంగా పార్టీలో ఉత్సాహాన్ని నింపాల్సిన బాధ్యతను అధినేత్రి సోనియాగాంధీ తీసుకున్నారు. శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు ఉదయపూర్ చింతన్ శిబిర్ నిర్వహించనున్న నేపథ్యంలో ఆమె అధ్యక్షతన సీడబ్ల్యుసి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో సోనియా ప్రసంగమే దేశ రాజకీయాలలో పెద్ద చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ పనైపోయిందా అన్న అనుమానాలకూ తెరతీసింది. పార్టీ పునర్వైభవానికి పార్టీ క్యాడర్ లో ఉత్సాహాన్నినింపాల్సిన అధినేత్రి సోనియా గాంధీ సీడబ్ల్యుసీ లో బేలగా ప్రసంగించారు. ఆ సమావేశంలో రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
గ్రాండ్ ఓల్డ్ పార్టీ వల్ల దేశంలో అందరూ లాభపడ్డారనీ.. అలా లాభపడిన వారంతా ఇప్పుడు పార్టీ కోసం తమ వంతు సహాయం అందించాల్సిన సమయం వచ్చిందని సోనియా ఆ సమావేశంలో పిలుపు నిచ్చారు. నేరుగా చెప్పకపోయినా.. కాంగ్రెస్ ను అడ్డుపెట్టుకుని సంపాదించిన వారంతా ఇప్పుడు పార్టీకి ఆర్థిక సహకారం అందించాలన్నదే ఆ పిలుపు లక్ష్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేశంలో కేవలం రెండంటే రెండు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. ఇటీవలి ఎన్నికల్లో ఓటమి పార్టీలో నైరాశ్యాన్ని నింపింది. ఈ పరిస్థితుల్లో క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపి వారిని వచ్చే ఎన్నికలలో క్రియా శీలంగా పని చేసేలా దిశానిర్దేశం చేయాల్సిన అధినేత్రి బేలగా.. పార్టీని ఆదుకోవడానికి ముందుకు రండి అంటూ అభ్యర్థించడం పై రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీలో దశ, దిశ చూపే నాయకత్వం కరవైందనడానికి సీడ్బ్ల్యుసీలో సోనియా ప్రసంగమే నిదర్శనమంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్ర, శనివారాలలో జరిగే చింతన్ శిబిర్ వల్ల పార్టీకి ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండకపోవచ్చని విశ్లేషణలు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/congress-chintan-sibir-from-friday-25-135763.html
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
అమరావతికి చట్టబద్ధత అమరావతి రైతుల నైతిక విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలం పాటు మొక్కవోని దీక్షతో రైతులు చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
రాజధాని ఉద్యమ సమయంలో పాలకులు ప్రయోగించిన అణచివేత చర్యలను ఈ సందర్భంగా రేణుకా చౌదరి గుర్తు చేశారు.