Publish Date:May 12, 2023
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం (మే 13)న వెలువడతాయి. పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు ఎడ్జి ఉంటుందని చెప్పినా.. వివిధ సంస్థలు వెలువరించిన వేర్వేరు ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రస్ ఏకప విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని అయితే యివ్వలేదు. ఒకటి రెండు సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ లో కర్నాటకలో హంగ్ తప్పదని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై ఎంతో విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ లో ఖంగారు మొదలైనట్లు కనిపిస్తోంది. దీంతో కర్నాటకలో కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది.
కర్నాటకలో ఈ నెల 10న ఎన్నికలు జరిగాయి. మొత్తం 224 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో సగానికి ఒకటి కలిపితే 113 సీట్లు వచ్చిన పార్టీదే అధికారం. కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ గా ఉంటుందని సర్వేలు అన్నీ స్పష్టంగా చెప్పాయి. అయితే మ్యాజిక్ ఫిగర్ కు చేరుతుందన్న అంచనాలకు భిన్నంగా కొన్నిసర్వేలు కాంగ్రెస్ ఆ 113 కొద్ది దూరంలో ఆగిపోతుందని పేర్కొనడంతో కాంగ్రెస్ ఒక వేళ అలా జరిగితే ఏం చేయాలి అన్న దానిపై యిప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. దీంతో ఫలితాలు వెలువడటం మొదలు కాగానే గెలిచిన ఎమ్మెల్యేను గెలిచినట్లుగా క్యాంపునకు తరలించే యోచన చేస్తోందని పరిశీలకులు అంటున్నారు.
కర్నాటకలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో గోవాలో క్యాంపు పెట్టాలన్నది కాంగ్రెస్ భావనగా చెబుతున్నారు. యిందుకు తగ్గ ఏర్పాట్లు అప్పుడే మొదలయ్యాయని కూడా అంటున్నారు. యిక ఎంత నిర్వేదంలో ఉన్నా ఎవో కొన్న స్థానాలలో గెలుస్తామన్న నమ్మకం ఉన్న జేడీఎస్ కూడా గెలిచిన తమ ఎమ్మెల్యేలు జారిపోకుండా అవసరమైన ఏర్పాట్లు చేసుకొంటోంది. సపోజ్ ఫర్ సపోజ్ కర్నాటకలో హంగ్ వస్తే.. కాంగ్రెస్, బీజేపీల చూపు కచ్చితంగా జేడీఎస్ ఎమ్మెల్యేల వైపే ఉంటుందనడంలో సందేహం లేదు. అందుకే జేడీఎస్ కూడా తన జాగ్రత్తలో తాను ఉంటోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/congress-camp-politics-in-karnataka-39-155173.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.