Publish Date:Apr 30, 2013
మొన్న సుప్రీం కోర్టు జగన్ మోహన్ రెడ్డి బెయిలు పిటిషను విచారణ చేపట్టినప్పుడు జగన్ తరపున వాదిస్తున్నలాయరు హరీష్ సాల్వే కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి “జగన్ మోహన్ రెడ్డి జైల్లోంచి బయటపడాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరక తప్పదు” అని మీడియాకు ఇచ్చిన స్టేట్మెంటును కోర్టుకి సమర్పిస్తూ తన క్లయింటు జగన్ మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా అరెస్టు చేయించిందని చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ అని వాదించేసరికి సీబీఐ కూడా నోట మాటలేకుండా ఉండిపోవలసి వచ్చింది. ఆ విధంగా భరోసా ఇచ్చిన మంత్రిగారికి సమన్లు జారీ చేసి ఈ విషయంలో ఆయనను సంజాయిషీ కోరుతామని సీబీఐ చెప్పింది.
మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్ అటు కాంగ్రెస్ పార్టీని కూడా ఇబ్బందుల్లో పడేసింది. వైయస్సార్ కాంగ్రెస్ నేతలు ఇంతకాలం ఇదే విషయాన్ని గట్టిగా చెపుతున్నప్పటికీ వారి వాదనను కాంగ్రెస్ పార్టీ తేలికగా కొట్టివేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు స్వంత పార్టీకి చెందిన కేంద్ర మంత్రే స్వయంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి వాదనను బలపరుస్తున్నట్లు మాట్లాడటం, ఆ పాయింటును సుప్రీం కోర్టులో జగన్ న్యాయవాదులు బయటపెట్టడంతో కాంగ్రెస్ కూడా అడ్డుగా దొరికిపోయింది.
అయితే, మహా మహా కుంభ కోణాలు బయటపడ్డపుడే కాంగ్రెస్ పార్టీ బెదిరిందీ లేదు, బయపడిందీలేదు. ఇక ఎప్పుడో జరిగిన ఈ కుంభకోణాలను చూసి ఎందుకు బయపడుతుంది? ఇటువంటి సమస్యల నుండి బయటపడటానికి కాంగ్రెస్ వద్ద సాంప్రదాయ సిద్దమయిన గృహ చిట్కాలు చాలానే ఉన్నాయి. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ “కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డిగారు చెప్పిన మాటలు పూర్తిగా అయన వ్యక్తిగతమయినవి. పార్టీకి వాటితో సంబంధం లేదు,” అని ప్రకటించి చేతులు దులుపుకొన్నారు.ఇక, మీడియా ఒక వైపు సీబీఐ మరో వైపు నిత్యం వరి కుప్పలు నూర్చి పోస్తున్నట్లు దివంగత ముఖ్య మంత్రి రాజశేకర్ రెడ్డి హయంలో జరిగిన ‘పుణ్య కార్యలన్నిటినీ’ కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నా కూడా, ఒకవేళ రాజశేకర్ రెడ్డి గనుక తప్పుచేసి ఉంటే, కాంగ్రెస్ వాదులమయిన మేమందరం సిగ్గుతో తలలు వంచుకోవలసి ఉంటుందని ఆయన చెప్పడం మరో విశేషం.
ఇక ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చిన మంత్రి గారిలో కూడా స్వచ్చమయిన కాంగ్రెస్ రక్తమే ప్రవహిస్తోంది కనుక, ఆయన కూడా అలవాటయిన మరో చిట్కాను ప్రయోగిస్తూ “జగన్ మోహన్ రెడ్డి మా పార్టీలో చేరితేనే అతనికి జైలు నుండి విముక్తి లభిస్తుందని నేనెన్నడూ అనలేదు. ఆ విధంగా అన్నానని ఎవరయినా ఋజువు చేస్తే నా మంత్రి పదవిని వదులుకోవడానికి కూడా నేను సిద్ధం. మరి ఎవరయినా దానిని నిరూపించగలరా?” అని సవాలు చేసారు. కానీ, సీబీఐ మాత్రం ఆయనకి సమన్లు జారీ చేసి సంజాయిషీ కోరాలని నిర్ణయించుకొనట్లు సమాచారం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/congress-39-22787.html
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు.
తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.