రెండు రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించాలట!

Publish Date:Feb 15, 2015

Advertisement

 

మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బీజేపీలో చేరబోతున్నారంటూ నిన్న మొన్నటి వరకు మీడియాలో వార్తలు వచ్చేయి. కానీ ఆయన ఆ వార్తలు నిర్ద్వందంగా ఖండించకుండా “ఎన్నికలలో ఓడిపోయిన నన్ను ఎవరు ఏ పార్టీలో జేర్చుకొంటారు?” అని ఎదురు ప్రశ్నించారు. అంటే ఎవరయినా చేర్చుకొంటే చేరేందుకు సిద్దమనే స్పష్టమయిన సంకేతం ఇచ్చేరు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విజయవాడకు వచ్చినప్పుడే ఆయనతో సహా అనేకమంది సీనియర్ కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరుతారని అందరూ భావించారు. కానీ ఎందువల్లో చేరలేదు.

 

బీజేపీలోకి ఎంట్రీ దొరకకపోవడంతో అటువంటి నేతలు అందరూ మళ్ళీ కాంగ్రెస్ టోపీలు బయటకు తీసి దుమ్ము దులిపి వాటిని జనాల నెత్తిన పెట్టే ప్రయత్నాలో రాష్ట్రమంతా కలియతిరిగేస్తూ తెగ హడావుడి చేస్తున్నారు. వారిలో బొత్స సత్యనారాయణ కూడా ఒకరు.

 

తమ యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన తరువాత వచ్చే సమస్యలన్నిటికీ పరిష్కారాలు రాష్ట్ర పునర్విభజన బిల్లులో పొందుపరిచిందని, కానీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాటిని పట్టించుకోకుండా నిత్యం ఏదో ఒక అంశం మీద కయ్యాలకు దిగుతున్నారని, అందువలన ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేంత వరకు రెండు రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేసారు. గవర్నర్ సమక్షంలో అన్ని సమస్యలను పరిష్కరించుకొనే అవకాశం ఉన్నప్పటికీ అందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వాటి ముఖ్యమంత్రులు ప్రయత్నించడంలేదని కనుక రాష్ట్రపతి పాలన విధించడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.

 

కాంగ్రెస్ అధిష్టానం తన రాజకీయ ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని చాలా హడావుడిగా రాష్ట్రవిభజన చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరే వారించారు. ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండా హడావుడిగా రాష్ట్ర విభజన చేసినట్లయితే ఇటువంటి సమస్యలు వస్తాయని, పైగా రాష్ట్రంలో పార్టీ తుడిచిపెట్టుకు పోతుందని కూడా ఆయన పదేపదే హెచ్చరించారు. కనుక విభజన తరువాత తలెత్తే అన్ని సమస్యలకు తగిన ఏర్పాట్లు చేసిన తరువాతే రాష్ట్ర విభజన చేయమని ఆయన హితవు పలికారు. బొత్స, చిరంజీవి, ఆనం వంటి కాంగ్రెస్ నేతలందరూ కేవలం ప్రజాగ్రహానికి గురి కాకూడదనే ఆలోచనతోనే ఆనాడు ఆయనతో గొంతు కలిపారు. కానీ ఆ సమయంలో కూడా వారందరూ కూడా ఒకవైపు తమ అధీష్టానాన్ని మంచి చేసుకొని కిరణ్ కుమార్ రెడ్డి స్థానాన్ని ఆక్రమించాలని చూసారు తప్ప రాష్ట్ర విభజనను అడ్డుకొనేందుకు ప్రయత్నించలేదు. ఇల్లు కాలిపోయిందని ఒకడు ఏడుస్తుంటే, చుట్టకు నిప్పు దొరికిందని సంభరపడినట్లు వారందరూ వ్యవహరించారు. అందుకే అపజయమన్నదే ఎన్నడూ ఎరుగని బొత్స సత్యనారాయణ తో సహా కాంగ్రెస్ నేతలందరినీ రాష్ట్ర ప్రజలు చాలా కటినంగా శిక్షించారు. ఆ సంగతి వారికీ తెలుసు.

 

కానీ వారందరూ తమ పార్టీ చేసిన ఆ పొరపాటుకి ఎటువంటి పశ్చాతాపం వ్యక్తం చేయకపోగా, రాష్ట్ర విభజన చేసి ప్రజలను ఉద్దరించినట్లు నిర్లజ్జగా చెప్పుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పైగా తమ యూపీఏ ప్రభుత్వం చేసిన అని హామీలను కేంద్రప్రభుత్వం అమలుచేయడం లేదంటూ కోటి సంతకాల కార్యక్రమం ఒకటి మొదలు పెట్టారు కూడా. రెండు రాష్ట్రాలలో కొలువు తీరి ఉన్న ప్రజాప్రభుత్వాలను పక్కను బెట్టి రాష్ట్రపతి పాలన విధించమని డిమాండ్ చేయడం సిగ్గు చేటు.

 

ఎన్నికలకు ముందు, తరువాత అవకాశం వస్తే ఏ పార్టీలోకి దూకేద్దామాని చూసిన కాంగ్రెస్ నేతలందరూ ఏ పార్టీలోను చేరే అవకాశం లేకపోవడంతో తమ రాజకీయ భవిష్యత్ కాపాడుకొనే ప్రయత్నంలో విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ టోపీలు పెట్టుకొని ఇలా మీడియా ముందుకు హడావుడి చేస్తున్నారు. కానీ వారు ఎంత హడావుడి చేసినా రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం కల్ల. కానీ వేరే మార్గమేదో దొరికేవరకు ఇలా మీడియా ముందుకు వచ్చి హడావుడి చేయకపోతే ప్రజలు కూడా మరిచిపోవచ్చును. లేదా తమ స్థానాన్ని మరొకరెవరయినా ఆక్రమించే ప్రమాదం ఉంది. అందుకే హడావుడి చేస్తున్నారు. ప్రజలు కూడా వారి బాధను సహృదయంతో అర్ధం చేసుకోక తప్పదు మరి.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.