హైదరాబాద్ లో గవర్నర్ కే సర్వాధికారాలు?

Publish Date:Jun 23, 2015

Advertisement

 

రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతున్న హైదరాబాద్ లో రెండు ప్రభుత్వ వ్యవస్థలు మరో తొమ్మిదేళ్ళపాటు కొనసాగే అవకాశం ఉంటుంది. కనుక వాటి మధ్య ఎటువంటి సమస్యలు, ఘర్షణలు ఏర్పడినా వాటి వలన హైదరాబాద్ లో శాంతి భద్రతలకు ఎటువంటి భంగం కలగకూడదనే ఉద్దేశ్యంతోనే రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్: 8ని ఏర్పాటుచేసి, హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలను పరిరక్షించే బాధ్యతను గవర్నర్ కి అప్పగించబడింది. సుమారు మూడు నాలుగు నెలల క్రితమే గవర్నర్ నరసింహన్ కూడా సెక్షన్ :8 ద్వారా తనకు సంక్రమించే అధికారాలను, బాధ్యతలను నిర్వచించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే అప్పుడు ఇటువంటి విపత్కర సమస్యలేవీ లేనందున కేంద్ర ప్రభుత్వం కూడా తాత్సారం చేసినట్లుంది. కానీ గత రెండు వారాలలో జరిగిన పరిణామాల వలన ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ద వాతావరణం ఏర్పడటంతో కేంద్రం ఇప్పుడు ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీను సంప్రదించిన తరువాత కేంద్ర హోంశాఖ అందుకు అనుమతించినట్లు సమాచారం.

 

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీని కోసమే కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. కానీ తెలంగాణా ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రెండు ప్రభుత్వాలు దేని వాదన అవి బలంగా వినిపిస్తున్నాయి. కానీ సెక్షన్: 8 ప్రకారం గవర్నర్ తన విశేషాధికారాలను ఉపయోగించుకొని ప్రస్తుత పరిస్థితులను తక్షణమే చక్కదిద్దవలసిందిగా కేంద్రప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. కనుక తెలంగాణా ఎసిబి చూస్తున్న ఓటుకు నోటు దర్యాప్తుని, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తుని కూడా ఇకపై గవర్నర్ నరసింహన్ స్వయంగా పర్యవేక్షించవచ్చును. ఆ రెండు సంస్థలు ఇకపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కాక గవర్నర్ కే తమ దర్యాప్తు నివేదికలను సమర్పించి ఆయన ఆదేశాల ప్రకారమే వ్యవహరించవలసి ఉంటుంది.

 

అయితే దీని ప్రధానోద్దేశ్యం ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తిన ఘర్షణను తొలగించడమే తప్ప తెలంగాణా ప్రభుత్వ అధికారాలను హరించడం కోసం కాదనే విషయం గమనించవలసి ఉంది. కేంద్ర ప్రభుత్వానికి కానీ, గవర్నర్ కి గానీ అటువంటి ఉద్దేశ్యమే ఉన్నట్లయితే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తొలిరోజు నుండే సెక్షన్: 8 అమలుచేసి ఉండేవారు. కానీ సెక్షన్: 8 ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశ్యం సమస్యలు నివారించాలనే తప్ప సృష్టించాలని కాదు. కనుకనే కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ ఇరువురూ కూడా దానిని ఇంతవరకు వినియోగించాలనుకోలేదని స్పష్టమవుతోంది. కనుక ప్రస్తుతం ఏర్పడిన విపరీత పరిస్థితులను చక్కదిద్దేంతవరకే ఆయనకు సెక్షన్: 8 ద్వారా కలిగిన ప్రత్యేకాధికారాలు వినియోగించుకొనేందుకు కేంద్రం అనుమతించి ఉండవచ్చును తప్ప శాశ్వితం కాదని భావించవచ్చును. కనుక పరిస్థితులు చక్కబడగానే తెలంగాణా ప్రభుత్వానికే హైదరాబాద్ లో శాంతి భద్రతలను కాపాడే బాధ్యతలను అప్పగిస్తారనడంలో సందేహమూ లేదు. ఒకవేళ అప్పుడు కూడా గవర్నర్ తన విశేషాధికారాలను వినియోగించుకొంటున్నట్లయితే అప్పుడు తెలంగాణా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేయడం సహేతుకంగానే ఉంటుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.