జనసేనకు అంత సీన్ లేదు.. పృధ్వీ సంచలన వ్యాఖ్యలు

Publish Date:Nov 21, 2018

Advertisement

 

కమెడియన్ పృధ్వీ వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సందర్భాల్లో వైసీపీకి మద్దతుగా మాట్లాడుతూ టీడీపీ మీద విమర్శలు చేసిన పృధ్వీ.. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ రాబోయే ఎన్నికల్లో పెద్దగా రాణించలేదని అన్నారు. తను వైసీపీలో ఉండడం వల్ల ఈ మాట చెప్పడం లేదని, ఎన్నో ప్రాంతాలు తిరిగి జనాలను పరిశీలించిన తర్వాతే ఈ అభిప్రాయానికి వచ్చానని తెలిపారు. పవన్ కల్యాణ్ ఏ అన్నం తింటున్నాడో తను చెప్పలేకపోవచ్చని, కానీ జనసేన హవా ఎలా ఉందో మాత్రం లెక్కకట్టగలనని అన్నారు. 'ఆయన వాదనలు ఆయనకున్నాయి. అవన్నీ ప్రజలకు నచ్చుతాయని నేను అనుకోవడం లేదు. నేను కూడా స్టేజ్ ఎక్కి వంద మాట్లాడతాను. పవన్ కూడా అంతే. అవన్నీ వినే ఓపిక, పట్టించుకోవాల్సిన అవసరం జనాలకు లేదు. ఆయనకు ఓ పార్టీ ఉంది, ఎజెండా, మేనిఫెస్టో కూడా ఉంది. చూద్దాం, ఆయన హవా ఎలా ఉంటుందో జనాలు తేలుస్తారు' అన్నారు.

జనసేన వల్ల తమ ఓటు బ్యాంక్ కు ఎలాంటి నష్టం లేదన్నారు. 'ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా జనసేనకు పడదు. ఎందుకంటే, ప్రభుత్వాన్ని వ్యతిరేస్తున్న ప్రజలు వైసీపీని ఆరాధిస్తున్నారు. జగన్ వెంట నడుస్తున్నారు. పవన్ ను కేవలం చూడ్డానికి మాత్రమే ప్రజలు వస్తున్నారు' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపు వర్గం ఓటు బ్యాంకు విషయంపై కూడా పృధ్వీ స్పందించారు. 'కాపు వర్గం ఓట్లు ఎటు వెళ్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే వాదన సరైంది కాదు. కులం మీద ఓటు వేసి గెలిచే సంస్కృతి లేదు. ఓ కాపు వర్గానికి చెందిన వ్యక్తిగా నేను చెబుతున్నాను. కుల రాజకీయాల మీద ఎన్నికలు గెలుస్తామని భావించడం మూర్ఖత్వం ' అని పృధ్వీ పరోక్షంగా కాపులంతా పవన్ వైపే ఉన్నారనే వాదనను తిప్పికొట్టారు. మరి రాబోయే ఎన్నికల్లో జనసేన రాణిస్తుందో లేక పృధ్వీ చెప్పినట్టు డీలా పడుతుందో చూద్దాం.

By
en-us Political News

  
కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో టీడీపీకి ఒక బెర్త్ క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో టెండరింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనీ, కేవలం మైనింగ్ మాత్రమే కాకుండా, విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు ఇలా ప్రతి రంగంలోనూ నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా తెరిచారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
జగన్ పాలనా వైఫల్యాలు అంటూ వైసీపీయులు కలలో కూడా అంగీకరించడానికి సాహసించని మాటలను పేర్ని నాని నోటి వెంట రావడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. జగన్ పాలనా వైఫల్యం కారణంగానే 2019 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని పేర్ని నాని యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించేశారు.
రాజకీయాల్లో నాయకులపై విమర్శలు, ఆరోపణలు సహజం. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం అన్నది సాధారణంగా అధకారంలో ఉన్న వారిపై కంటే అధికారంలో లేని వారిపైనే ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఈ పద్ధతిని బ్రేక్ చేసి.. ఇది ప్రజాస్వామ్యం, తన, పర తేడా లేకుండా ఎవరిపై ఆరోపణలు వచ్చినా విచారణ జరుపుతామని,తప్పు చేశారని నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ చెబుతున్నారు.
ముంబైపై పట్టు సాధించడమే లక్ష్యంగా థాక్రే బదర్స్ కలవడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ-షిండే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలినప్పటికీ, థాక్రేల కలయిక నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ముంబై వాసులలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.
రాష్ట్రంలో మునిసిపోల్స్ దగ్గర పడుతున్న తరుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శుక్రవారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిర్మల్ జిల్లాలో సదర్ ఘాట్ బ్యారేజీకి, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కోరట పంప్ హౌస్ కు ప్రారంభోత్సవం చేయనున్నారు.
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.