Publish Date:Apr 13, 2026
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆదివారం వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఆట పరంగానే కాకుండా వ్యక్తిగత విభేదాల పరంగానూ హాట్ టాపిక్గా మారింది. టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు, అన్నదమ్ములు అయిన హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా మధ్య విభేదాలు పొడసూపినట్లు మైదానంలో దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ సోదరులు ఇప్పుడు ఒకరి ముఖం ఒకరు చూసుకోకపోవడం అభిమానులను విస్మయానికి గురిచేస్తోంది.
ఈ మ్యాచ్లో కృనాల్ పాండ్యా ఆర్సీబీ తరపున ప్రాతినిధ్యం వహిస్తుండగా, హార్దిక్ ముంబై ఇండియన్స్కు సారథ్యం వహించాడు. ముంబై బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హార్దిక్ క్రీజులోకి రాగానే కృనాల్ తన బౌలింగ్తో స్వాగతం పలికాడు. అయితే గతంలో లాగా ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకోకుండా చాలా సీరియస్గా కనిపించారు. ముఖ్యంగా కృనాల్ సంధించిన ఒక బౌన్సర్కు హార్దిక్ చాలా ఘాటుగా స్పందించడం గమనార్హం.
మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. జాకోబ్ డఫీ బౌలింగ్లో హార్దిక్ పాండ్యా అవుట్ అయిన సమయంలో కృనాల్ పాండ్యా ఎగిరి గంతేస్తూ సంబరాలు చేసుకున్నాడు. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ అవుట్ అయితే ఆనందించడం సహజమే అయినా, తన సొంత తమ్ముడు అవుటైనప్పుడు కృనాల్ చూపించిన ఆవేశం చూస్తుంటే వారి మధ్య ఏదో పెద్ద గొడవ జరిగిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇద్దరు ఆటగాళ్లు సంప్రదాయబద్ధంగా కరచాలనం చేసుకోకుండానే విడిపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.
ఈ గ్యాప్కు కారణం హార్దిక్ వ్యక్తిగత జీవితమే అని ప్రచారం సాగుతోంది. నటాషా స్టాంకోవిచ్తో విడాకుల తర్వాత హార్దిక్ ప్రవర్తన పట్ల కుటుంబం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కృనాల్ భార్య నటాషాతో ఇప్పటికీ సన్నిహితంగా ఉండటం, హార్దిక్ మరో కొత్త స్నేహితురాలితో కనిపించడం అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టినట్లు సమాచారం. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా కృనాల్ తన తమ్ముడికి సోషల్ మీడియాలో విష్ చేయకపోవడం అప్పట్లో చర్చకు దారితీసింది.
ప్రస్తుతం ఆర్సీబీ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుండగా, హార్దిక్ సారథ్యంలోని ముంబై వరుస ఓటములతో కుదేలవుతోంది. ఈ క్రమంలో వ్యక్తిగత విభేదాలు కూడా హార్దిక్ మీద ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. ఈ ఇద్దరి మధ్య దూరం తగ్గుతుందా లేక మున్ముందు ఈ కోల్డ్ వార్ ఇంకా ముదురుతుందా అనేది వేచి చూడాలి. రానున్న మ్యాచుల్లో ఈ పాండ్యా సోదరుల వ్యవహారశైలిపై క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా దృష్టి సారిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cold-war-between-hardik-and-krunal-36-217281.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.