అన్నదాతలకు అండగా బొద్దింకలు.!

Publish Date:Jul 30, 2026

Advertisement

 ఇప్పటివరకు సోషల్ మీడియాలో, స్టూడెంట్ ప్రొటెస్ట్‌లలో మాత్రమే వినిపించిన పేరు... కాక్రోచ్  జనతా పార్టీ (సీజేపీ)! ఇప్పుడు ఈ బొద్దింకలు  రైతు సంఘాలతో చేతులు కలిపాయి.  నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి. రైతులు, కాక్రోచ్ ల కలయిక నిస్పందేహంగా కేంద్ర ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తీసుకువస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

 కేంద్రంలోని మోడీ సర్కార్ కు ఇన్నేళ్లలో ఎదురైన నిజమైన, బలమైన సవాళ్లు ఏవైనా ఉన్నాయంటే.. అవి.. గతంలో జరిగిన చారిత్రాత్మక రైతు ఉద్యమం, తాజాగా నీట్ లీకేజీకి నిరసనగా ఉవ్వెత్తున ఎగసిన కాక్రోచ్ ల ఆందోళన. రెండు సందర్భాలలోనూ కూడా మోడీ సర్కార్ దిగి వచ్చి వారి డిమాండ్లను అంగీకరించాల్సి వచ్చింది.  ఇప్పుడు ఈ రెండు శక్తులూ ఏకతాటిపైకి వచ్చాయి. దీంతో భవిష్యత్ లో వీరి కలయిక మోడీ సర్కార్ ను ఏ స్థాయిలో ఇరుకున పెడుతుందీ అన్న చర్చ ఇప్పుడు దేశ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. 

జంతర్ మంతర్ వేదికగా సిజెపి నాయకులు, రాకేష్ తికాయత్ సహా 500 మంది రైతులతో  భేటీ అయ్యారు. గురువరాం(జులై 29) జరిగిన ఈ భేటీ..కాక్రోచ్ లు ఉద్యమ బాట వీడలేదనీ. కేవలం విద్యా సమస్యలే కాదు, కర్షకుల సమస్యలపైనా తాము ఉద్యమిస్తామనీ, అన్నదాతలకు అండగా నిలుస్తామని ఈ భేటీ ద్వారా సందేహాలకు అతీతంగా పరోక్షంగా ప్రకటించారు.  విద్యార్థులు, యువత,  రైతులు ఏకతాటిపైకి  వచ్చి ఉద్యమిస్తే.. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో కేందరంలోని మోడీ సర్కార్ పై ఒత్తిడి కొన్ని రెట్లు ఎక్కువ అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

ఇప్పటికే నీట్ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ ల ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై   నమోదైన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలనీ, లేదంటే..  తన ఉద్యమాన్నినెక్స్ట్ లెవెల్ కు తీసుకువెడతామనీ సీజేపీ కేంద్రానికి అల్టిమేటమ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ అల్టిమేటమ్ ఇచ్చిన రోజువ్యవధిలోనే... కాక్రోచ్ జనతా పార్టీ నేతలు రైతు సంఘాల నేతలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.   

Cockroach Janta Party, Rakesh Tikait, NEET Protest Delhi, CJP Farmers Protest, Jantar Mantar Protest, Dharmendra Pradhan, Gen Z Protest India, CJP Foreign Funding Court

By
en-us Political News

  
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.