ఏపీలో మరో ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి వైసీపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ మేరకు ఆటో, కార్ డ్రైవర్ లకు ఏడాదికి పది వేల రూపాయలు సాయం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. సీఎం జగన్ ఏలూరులో వైయస్సార్ వాహన మిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, అంతకుముందు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ, సొంత ఆటోలు నడుపుకుంటూ సొంత టాక్సీలు నడుపుకుంటూ బ్రతుకు బండిని ఈడుస్తున్న అన్నదమ్ముల కష్టాలను చూశానని ఆ రోజు ఆయన ఎప్పటికీ మరచిపోలేని రోజు అని, ఆయన దగ్గరకొచ్చి ఆటో తోలుకుంటూ ఉంటున్నామని రోజుకి మూడు వందల రూపాయలు, ఐదు వందల రూపాయల మించి ఏ రోజు రాదని, వాటితోటి బతకడమే కష్టం అనుకుంటే అదికాక ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేకపోతే ప్రతిరోజూ యాభై రూపాయలు ఫైన్ వేస్తూ మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వాన్ని ఒక్కసారి చూడండని చెప్పిన మాటలను మర్చిపోలేను అన్నారు.
చెప్పిన మాట ప్రకారం అధికారం లోకి వచ్చి నాలుగు నెలలు తిరగక మునుపే ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన అందరి బ్యాంకు అకౌంట్లల్లో బటన్ నొక్కిన వెంటనే కేవలం రెండు గంటల్లోనే డబ్బులొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని గర్వంగా చెప్పారాయన. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుందని, ప్రతి సంవత్సరం పది వేల రూపాయల చొప్పున ఐదు సంవత్సరాలలో యాభై వేల రూపాయలు ఆటోతో, ట్యాక్సీతో బ్రతుకు బండిని లాగుతున్న ప్రతి ఒక్కరి అకౌంట్ లో వేస్తామని మాటిచ్చారాయన. పరిస్థితులను మారుస్తూ ప్రతి పేదవాడికీ మంచి చేయాలనే తపనతో ప్రభుత్వం ముందడుగులు వేస్తుందన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm-to-launch-vahana-mitra-scheme-for-self-owned-auto-drivers-25-89740.html
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.